Category ఎడిటోరియల్

కొనసాగుతున్న ఆంటీ ఇన్కంబన్సీ ..!

భారత ప్రజాస్వామ్యంలో వోటరు తీర్పు ఎప్పుడూ అనూహ్యంగానే ఉంటుంది. గడిచిన రెండున్నరేళ్ల  ఎన్నికల ఫలితాల  సరళిని నిశితంగా పరిశీలిస్తే, దేశ రాజకీయాల్లో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అది “ప్రభుత్వ  వ్యతిరేకత” (Anti-incumbency). వోటరు కేవలం వాగ్దానాలకో, భావోద్వేగాలకో లోనవ్వకుండా, తమ జీవితాల్లో వొస్తున్న మార్పులకు అనుగుణంగా , పాలనలో వైఫల్యం కనిపిస్తే కనికరం లేకుండా…

‘పకోడీలు’ కూడా వేసుకోలేని దుస్థితి..!

పశ్చిమ బెంగాల్ వంటి కీలక రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కేంద్ర ప్రభుత్వం కమర్షియల్  గ్యాస్ సిలిండర్ ధరను అసాధారణంగా పెంచడం  వెనుక ఉన్న రాజకీయ చతురత ప్రజలకు అర్థం కానిది కాదు. వోట్ల వేట ముగియగానే ధరల బాదుడు మొదలుపెట్టడం అనేది వోటరును కేవలం ఒక సంఖ్యగా పరిగణించడమే. ఇది పరోక్షంగా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే…

సంక్షోభం లో విమానయాన రంగం

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, హార్మోజ్ జలసంధి వద్ద నెలకొన్న అనిశ్చితి ప్రపంచ వ్యాప్తంగా చమురు సెగలను రాజేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, దాని ప్రభావం నేరుగా భారత విమానయాన రంగంపై పడటం అత్యంత ఆందోళనకరం. తాజాగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఎఫ్ఐఏ)  కేంద్ర ప్రభుత్వానికి పంపిన SOS…

బీజేపీ అధికార దాహం

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఒక పండుగ వంటివని చెబుతుంటారు. కానీ, ఆ పండుగ వెనుక ఉండే రాజకీయ క్రీడలో సామాన్యుడి భద్రత, వోటు హక్కు, మరియు వాగ్దానాల విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ప్రస్తుత దేశ రాజకీయాల్లో అటు మణిపూర్ రగులుతున్నా, ఇటు బెంగాల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర పాలక వర్గం నిమగ్నమై ఉండటం చూస్తుంటే..…

25 వసంతాలు చూసిన బిఆర్‌ఎస్‌ ‌…!

25 years of BRS party

బిఆర్‌ఎస్‌ ‌పార్టీ తమ రజ తోత్సవ ముగింపు వేడుకలను సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంది. ఊరూర బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు, నాయకులు పార్టీ జండాను ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ అధినేత కేసిఆర్‌ ‌స్వయంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కార్యవర్గ సభ్యులతో భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమానికి దిశనిర్ధేశం చేశారు. ఈ 25 వసంతాల్లో పార్టీ…

పాడైపోయిన హైదరాబాద్

Hyderabad Records 28.5C Temperature Mild Weather Trend Observed

హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి నమోదైన 28.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, దేశంలోనే అత్యధిక రాత్రి ఉష్ణోగ్రతగా నిలవడం ఆందోళన కలిగించే అంశం. నగర జీవితం ఒకప్పుడు చల్లని సాయంత్రాలకు, ఆహ్లాదకరమైన రాత్రులకు మారుపేరుగా ఉండేది.  1960-70 ల మధ్య  హైదరాబాద్  స్వచ్ఛమైన గాలిని, ప్రశాంతమైన మనసును ప్రసాదించే నగరం. ఆధునికత తక్కువగా ఉన్నా, జీవన…

ఆత్మబలిదానం పరిష్కారం కాదు.. కార్మికులకు విన్నపం..!

తెలంగాణ రాష్ట్ర రవాణా రంగం నేడు ఒక విషాద ఛాయలో మునిగిపోయింది. అహోరాత్రులు ప్రజలను తమ గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ కార్మికుల జీవితాలు నేడు సందిగ్ధంలో పడ్డాయి. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ కోల శంకర్ గౌడ్ మరణం కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, అది వ్యవస్థలో పేరుకుపోయిన నిర్లక్ష్యానికి, నెరవేరని…

కమిషన్ లు కాలయాపనేన కోసమేనా  ..? 

కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలలో ఒకటి. తెలంగాణలో సాగునీటి విస్తరణ, రైతుల సంక్షేమం అనే లక్ష్యాలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు, కాలక్రమేణా రాజకీయ ఆరోపణలు, ఆర్థిక అవకతవకల అనుమానాలు, సాంకేతిక లోపాల చర్చలతో వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తాజా…

రాష్ట్రంలో వేడెక్కుతున్న రాజకీయాలు

Political Heat Rises in Telangana as Power Struggles Intensify

రాష్ట్రంలో  సోమవారం జరిగిన రెండు రాజకీయ పార్టీల బహిరంగ సభలు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. పబ్లిక్‌ ‌మీటింగ్‌లు కాస్తా ఎదురు దాడుల వేదికలుగా మారాయి.  విచిత్రమేమంటే ఈ రెండు సభలు నిర్వహించిన సమయం కూడా ఒకటే. మరో విచిత్రమేమంటే ఈ రెండు సమావేశాల్లో ప్రసంగించిన వారిలో ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాగా, మరొకరు మాజీ…