Category ముఖ్యాంశాలు

సిగాచీ యాజమాన్యంపై సిఎం ఫైర్‌

బాథ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇప్పిస్తామని ప్రకటన సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 1: పాశమైలారం ఘటన మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇప్పిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. అదేవిధంగా తీవ్రంగా గాయపడి ఎలాంటి పని చేసుకోలేని స్థితిలో ఉన్న బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు,…

బాధిత కుటుంబాలకు ఫోన్‌ నంబరు ఇచ్చిన దామోదర

ధ్రువ మాస్పిటల్‌లో క్షతగాత్రులకు పరామర్శ హైదరాబాద్‌, ప్రజాంత్ర, జూలై 1: పాశమైలారం దుర్ఘటనలో గాయపడి ధ్రువ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి, మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్‌తో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. ఈ క్షతగాత్రుల కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రితోపాటు మంత్రి దామోదర మాట్లాడారు. బాధితుల కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాలను…

ఇది అత్యంత విషాదకరమైనది

ఇలాంటి ఘటన ఇంతకుముందెన్నడూ జరగలేదు పాశమైలారం ఘటనాస్థలి వద్ద మీడియాతో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 1: సపంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం జరిగిన దుర్ఘటన అత్యంత విషాదకరమైనదని, ఇప్పటివరకు ఇంతటి దుర్ఘటన రాష్ట్రంలో జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఘటనా స్థలిని మంగళవారం ఉదయం పలువురు…

‘పాశమైలారం‘పై సమగ్ర నివేదిక ఇవ్వండి

అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం 36కు పెరిగిన మృతుల సంఖ్య మృతదేహాలకు పటాన్‌చెరు ఏరియా హాస్పిటల్‌లో పోస్టుమార్టం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 1 : సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో మృతుల సంఖ్య 36కు పెరిగింది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఫోరెన్సిక్‌ డాక్టర్ల…

కేంద్ర కమిటీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30 : సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌, జీడబ్ల్యూడీటీలు పరిశీలించకుండా గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులిచ్చేది లేదని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఇది బీఆర్‌ఎస్‌ పోరాటం ఫలితమని, తెలంగాణ ప్రజల విజయం అని అన్నారు. బనకచర్ల పేరిట…

ఉద్యమ పతాకకు కాషాయ కిరీటం

రాడికల్స్‌ను ఎదురొడ్డి ఉస్మానియాలో ఏబీవీపి జెండా ఎగరేసిన రామచంద్రరావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: విద్యార్ధి దశలోనే ఏబీవీపీ పక్షాన పోరాడి పలుమార్లు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న నాయకుడు ఎంతోమంది పేదల, బీజేపీ నేతల పక్షాన న్యాయ పోరాటం చేసిన న్యాయవాది .. అందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం రామచంద్రరావు సొంతం. హైకమాండ్‌ నిర్ణయంపట్ల సీనియర్ల…

బీజేపీ రాష్ట్ర సారథిగా రామచందర్‌రావు ఏకగ్రీవం

~ ఏడాదిన్నర ఉత్కంఠకు తెర ~ అంతకుముందు పలువురి నిరసనలు ~ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజాసింగ్‌ రాజీనామా (మండువ రవీందర్‌రావు) ఏడాదిన్నర కాలంగా బిజెపి అధ్యక్షుడి ఎన్నిక విషయంలో నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడిరది. పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రామచందర్‌రావు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఆయన ఎన్నికకు ముందు పార్టీలో…

సహాయక చర్యల పర్యవేక్షణకు కమిటీ

పాశమైలారం ఘటనపై సీఎం సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సహాయక చర్యల గురించిన వివరాలను అక్కడున్న మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌లనుంచి ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సెట్రేరియట్‌లో డీజీపీ, సీఎస్‌లతో సమీక్ష నిర్వహించారు.…

స్వేచ్ఛ మరణాన్ని సంచలనం చేయొద్దు

– ఆమె కుమార్తె వీడియోలను యూట్యూబ్‌ల నుంచి తొలగించాలి – మీడియా సంస్థల యాజమాన్యాలకు మహిళా జర్నలిస్టుల వినతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30 : జర్నలిస్టు స్వేచ్ఛ మరణాన్ని చాలా న్యూస్‌ ఛానెల్స్‌, యూట్యూబ్‌ ఛానల్స్‌, సోషల్‌ మీడియాలో సంచలనం చేసే ప్రయత్నం చేస్తున్నాయంటూ పలువురు మహిళా జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు…