Category ముఖ్యాంశాలు

ప్రకృతి, ప్రజల సమన్వయం అవసరం

– అప్పుడే సుస్థిర మైనింగ్‌ సాధ్యం – వరల్డ్‌ మైనింగ్‌ కాంగ్రెస్‌ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 4: మైనింగ్‌ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చాలా అవసరం అని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ…

రోశయ్య విగ్రహం ఆవిష్కరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 4: నగరంలోని లక్డీకాపూల్‌లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి శుక్రవారం ఉదయం ఆవిష్కరించారు. రోశయ్య జయంతి సందర్భంగా నేతలు ఆయనకు నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆయన వివిధ హోదాల్లో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క,…

బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి దక్షిణాది మహిళ నేత ?

 ట్రేండింగ్ లో పురంధేశ్వరి పేరు బీజేపీ జాతీయ స్థాయిలో ఓ కీలక మార్పు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న జేపీ నడ్డా పదవీ కాలాన్ని గత ఏడాది పొడిగించినా, ఇప్పుడా స్థానం మళ్లీ ఖాలీ కావొచ్చని ఊహాగానాలు ..!. ముఖ్యంగా ఈసారి పార్టీ అధినాయకత్వ బాధ్యతలు ఒక మహిళ నేతకు అప్పగించే…

9న అఖిల భారత సమ్మె

సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3 : మోదీ ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 9న దేశవ్యాప్త సమ్మెకు కార్మిెక సంఘాల ఐక్య వేదిక, సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచిచ్చాయి ఈ మేరకు రైతు ఉద్యమ వేదిక సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) నాయకులు విలేకరుల…

హైదరాబాద్‌ చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే

~ ఎల్బీ స్టేడియంలో రేపు భారీ బహిరంగ సభ ~ గాంధీ భవన్‌లో కీలక సమావేశాలు ~ ఘన స్వాగతం పలికిన పీసీసీ అధ్యక్షుడు, సీఎం తదితరులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3: తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే గురువారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు సీఎం…

మాజీ సీఎం కేసీఆర్‌కు అనారోగ్యం

‌చికిత్స కోసం యశోదాలో చేరిక హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై 3: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో గురువారం ఆయన సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.  కొద్ది రోజులుగా కెసిఆర్‌ ‌సీజనల్‌ ‌జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. గురువారం ఎర్రవల్లిలోని ఫామ్‌ ‌హౌస్‌…

విభజన అంశాలపై మౌనం ఎందుకో?

రాహుల్‌పై కేటీఆర్‌ విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఏడాది పూర్తి చేసుకుంటున్న రాహుల్‌ గాంధీ సాధించిందేమీ లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. 2014 విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని ఏ రోజూ మోదీ ప్రభుత్వాన్ని రాహుల్‌ నిలదీయలేదని, తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశారని అన్నారు. తెలంగాణ…

అంగన్వాడీల బలోపేతంపై దృష్టి

–  ఎస్‌హెచ్‌జీలకూ భాగస్వామ్యం – త్వరలో సరికొత్త బాలామృతం పంపిణీ – మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 3: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అంగన్వాడీల బలోపేతంపై మహిళా శిశు సంక్షేమ శాఖ దృష్టి సారించింది. చిన్నారుల పోషకాహరాన్ని మెరుగుపరిచేందుకు మహిళా స్వయం సహాయక బృందాలు, స్వచ్చంద…

ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా హైదరాబాద్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి మహేశ్వరంలో మలబార్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ తయారీ యూనిట్‌ ప్రారంభం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3: హైదరాబాద్‌ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నామని, దీనిని డిసెంబర్‌ 9న ఆవిష్కరించబోతున్నామని…