Category శీర్షికలు

‘నవరత్న పాకెట్ లా నడిచిపోయాడు’

రెడ్డి రామకృష్ణ కవిత్వం అంటే అర్థంకాని గందరగోళం అనుకునే కాలం దాదాపుగా గతించిపోయింది. సున్నితమైన అంశాలను కూడా స్పృశిస్తూ గొప్ప భావుకతతో చెప్పగలుగుతున్నారునేటి కవులు. కొందరు కొన్నికొన్ని కవితల్లో తేలిపోతున్నా కొన్నికొన్ని కవితలు బాగా రాస్తున్నారు. కొంతమంది మాత్రం అద్భుతమైన కవిత్వం రాస్తున్నారు. మంచి కవిత్వాన్ని సరళమైనభాషలోనే వ్యక్తీకరిస్తున్నారు. అలాంటి మంచికవిత్వం రాస్తున్న వారిలో మొయిద…

మెరుపు తీగెలు కాన!

బమ్మిడి జగదీశ్వరరావు నేనూ మా పాపా యానిమల్ ప్లానెట్‌ చూస్తున్నాం. సింహం వొకటి లేడిని వెంటాడుతోంది. ఆ లేడిపిల్ల చెంగుచెంగున దూకి పరుగులు తీస్తోంది. క్షణాల్లో దొరుకేస్తోంది అనేలోపు వెంట్రుకవాసిలో తప్పించుకొని పరుగులు తీస్తోంది. ఊపిరి బిగబట్టి చూస్తున్న మా పాపని గమనించి వీడియోని పాజ్ చేశాను. తను నా ముఖంలోకి చూసింది. ‘ప్చ్’ విచారించింది.…

వాయులీనం

వీరేశ్వరరావు మూల నాన్న చెప్పిన కధే మళ్లీ చెప్తాడు నాకు ఒక రాత్రి తెలిసిపోతుంది నాన్న దగ్గర కథలు లేవని వ్యధలు మిగిలాయని నాన్నేది దాచుకోడు నాన్న చొక్కాకి జేబు అందుకే లేదేమో నాన్న కన్నీళ్లు కడుపులోకి పోతాయేమో దాహం కూడా వెయ్యదంటాడు నాన్న దగ్గర ఏదో మంత్ర దండం ఉంది అందుకే అన్ని వేళల…

స‌మాజ‌ ప్రతిబింబం సాహిత్యం

Social issues in literature, Literature as a reflection of society, Role of literature in social change, Social themes in modern literature, Literature and society relationship, Literature mirrors society, Social realism in literature, Impact of literature on society, Contemporary literature social commentary, Authors reflecting social issues

న‌న్న‌యనుండి నేటివ‌ర‌కు వ‌చ్చిన సాహిత్యంలో ఏదో ఒకరూపంలో సామాజిక అంశాల ప్ర‌స్తావ‌న ఉంది. ప్రాచీన కాలంలో రాజ‌నిష్టంగా సాహిత్య వ్యాసంగాన్ని క‌వులు కొన‌సాగించినా సంఘస్ప‌ర్శ‌ను వీడ‌లేద‌న‌డానికి ఉదాహ‌ర‌ణ‌లు కోకొల్ల‌లుగా ఉన్నాయి. క‌వి, ర‌చ‌యిత‌, సంఘజీవిగా ఉండ‌డ‌మే ప్ర‌ధాన‌మైన కార‌ణం. సామాజికవిష‌యాలను త‌మ ర‌చ‌న‌ల‌లో ప్రాచీనక‌వులు ఏదో ఒకరూపంలో వెల్ల‌డించి సామాజికస్పృహ‌ను ప్ర‌క‌టించారు. రాజభ‌క్తి, దైవానుర‌క్తి, మ‌తానుకూల‌త‌,…

కొరత!

ఏడుపు! కంటికిమంటికి యేకధార! ఎందరు నచ్చజెప్పినా లేదు, ఎందరు వోదార్చినా లేదు! ఆ పిల్ల దుఃఖం తీరేట్టులేదు, చూస్తుంటే కడుపులో దేవేస్తోంది! ‘కన్నా మీ అమ్మని చెపుతున్నాను విను, నిన్ను యెవ్వరూ యేమీ అనడం లేదు.’ తల్లి బుజ్జగించినా లేదు! ‘నాన్నా మీ నాన్నని చెపుతున్నాను విను, యిందులో నీ తప్పేమీలేదు, కొన్నిసార్లు అలా జరిగిపోతుంది…

ఇట్లు..నీ ప్రేయసి

ఒక మొరటబ్బాయిని ప్రేమించి, ప్రేమలో తనే ముందడుగు వేసి, ఉత్తరాల ద్వారా దానిచుట్టూ ఒక మిస్టరీ సృష్టించి, రక్తి కట్టించి, పెళ్ళి చేసుకుని శుభం కార్డు వేయించుకుని, జీవితాన్ని మనసారా ఆహ్వానిస్తూ, తనువారా అనుభవిస్తూ, వొచ్చే అవాంతరాలను, కల్లోలాలను ఛాతీ ఒడ్డి ఎదుర్కొంటూ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ తన వైవాహిక బంధానికి మరక అంటకుండా కాపాడుకున్న…

ఇంటిముందే రెండు పూలదండలతో…

తొలి మలి దశల తెలంగాణ ఉద్యమానికి అందివచ్చిన చైతన్యశీలి ఆమె. సామాజిక సాహిత్య రంగాల మీద ప్రేమ, వాటి మేలు కోసం గట్టిగా పని చేయాలనే పట్టుదల ఆమె స్వభావం. నిర్భీతి ఆమెలోని మరొక సుగుణం. తెలంగాణ సమాజం మీద తనదైన సంతకం చేసిన రచయిత, సామాజిక కార్యకర్త తిరునగరి దేవకీదేవితో ముఖాముఖి.. -కె.ఎన్‌.మల్లీశ్వరి  …

మధురమైన కవన చంద్రికలు

-కోట దామోదర్‌ కవిత్వం చదివితే పాఠకుని మనస్సులో అంతవరకూ అలుముకున్న అస్పష్టత చెరిగిపోయేలా ఉండాలి. అలాంటి కవిత్వం పురుడు పోసుకొని మహోజ్వలంగా విరబూసేందుకు కవి మనుసులో క్షీరసాగరమధనం జరిగినట్లుగా భావమథనం జరిగితేగానీ ఆ కవిత్వం పాఠకులను నూరు శాతం మెప్పించి తీరుతుంది. ఇటీవల ‘‘మహతీ  సాహితీ కవిసంగమం’’, కరీంనగరం వారి ‘‘ధనుర్మాస కవితోత్సవం 2024-25’’ సందర్భంగా…

శబ్ద విస్ఫోటనం

నిఖార్సైన నిశ్శబ్దంలో ఏ నిశ్శబ్దపు తునకా రాలిపడలేని శూన్య వాతావరణంలో నన్ను నేను వింటాను ఒడ్డును ఒరుసుకునే సముద్రపు అలల రాపిడి వింటాను చెట్టు కొమ్మపై వాలే పిట్ట చప్పుడు వింటాను లేత సూర్య కిరణాలు ఇంట్లోకి జొరబడే అలికిడి వింటాను సవన్నా మైదానంలో పరుగులు పెట్టే బాల్యం కేరింతలు వింటాను ధార కట్టిన కన్నీళ్లను…