రాష్ట్రంలో 10,950  ఉద్యోగ నియామ‌కాలకు గ్రీన్ సిగ్న‌ల్‌

ఉగాది నుంచి భూభార‌తి అమ‌లు
సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న సుదీర్ఘంగా మంత్రి వ‌ర్గ భేటీ
కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం

తెలంగాణ‌ కేబినెట్‌స‌మావేశంలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ ముసాయిదా బిల్లును ఆమోదించిన‌ట్లు రాష్ట్ర రెవెన్యూశాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్ల‌డించారు. తెలంగాణ‌ రెవెన్యూ శాఖ బ‌లోపేతానికి  ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంద‌ని అన్నారు. గురువారం రాష్ట్ర స‌చివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి
అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గ స‌మావేశం సుదీర్ఘంగా సాగింది. ఈ స‌మావేశంలో తీసుకున్న ప‌లు నిర్ణ‌యాల గురించి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ విలేక‌రుల‌కు వెల్ల‌డించారు. రాష్ట్రాన్ని  ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ మ‌ధ్య ఉన్న ప్రాంతాన్ని ఫ్యూచ‌ర్ సిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు నాగార్జున సాగ‌ర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మ‌ధ్య ఫ్యూచ‌ర్ సిటీ ఉంటుంద‌ని తెలిపారు. ఫ్యూచ‌ర్ సిటీ కోసం 90 పోస్టులను భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పారు.హెచ్ఎండీఏ ప‌రిధిని విస్త‌రించాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. 11 జిల్లాలు, 104 మండ‌లాలు సుమారు 1355 గ్రామాలు, 332 రెవెన్యూ గ్రామాల‌తో హెచ్ఎండీఏను విస్త‌రించిన‌ట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.

కోటి మంది మ‌హిళ‌ల‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేసే ఉద్దేశంతో కొత్త‌గా 2025 పాల‌సీని తీసుకువ‌స్తున్నామ‌ని తెలిపారు. రాష్ట్రంలోని ప్ర‌తి గ్రామానికొక క్షేత్ర‌స్థాయిలో అధికారి ఉండేలా క్యాబినేట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు. . ఇదే కాకుండా కొత్త‌గా ఏర్ప‌డిన డివిజ‌న్లు, మండ‌లాల‌కు సైతం కొత్త‌గా పోస్టుల‌ను మంజూరు చేయాల‌ని నిర్ణ‌యించింది. వీటితో పాటు సెల‌క్ష‌న్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ల పోస్టుల‌కు సైతం ఆమోద ముద్ర వేసింది. మ‌హిళాసంఘాల స‌భ్య‌త్వ వ‌య‌స్సును 65కు పెంచిన‌ట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 10,950 గ్రామాల‌కు క్షేత్ర‌ స్థాయి అధికారుల నియ‌మానికి గ్రీన్‌ సిగ్న‌ల్ ఇవ్వ‌డం, కొత్త డివిజ‌న్లు, మండ‌లాల‌కు 217 పోస్టుల మంజూరు, 33 సెల‌క్ష‌న్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌ పోస్టుల‌కు సైతం క్యాబినేట్ ఆమోదం తెలిపింద‌ని పేర్కొన్నారు. అలాగే ఉగాది నుంచి భూ భారతి చట్టం అమలు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *