prajatantra_news

prajatantra_news

మిమ్మల్ని చూసి భారత్‌ గర్విస్తోంది

అంతరిక్షంలోకి ప్రయాణిస్తున్న భారతీయుడు శుభాన్షు శుక్లా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అభినందన న్యూధిల్లీి, జూన్‌ 26: ‘ఆగ్జియోమ్‌ మిషన్‌ 4’లో భాగంగా 140 కోట్ల మంది భారతీయుల తరపున అంతరిక్షంలోకి వెళ్తున్న శుభాన్షు శుక్లాకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 41 ఏళ్ల క్రితం రాకేశ్‌శర్మ తర్వాత…

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు

ఇద్దరు మహిళా నక్సల్స్‌ మృతి భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్‌ 26 : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్‌ జిల్లాలోని అబుజ్‌మద్‌ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య గురువారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఇద్దరు మహిబళా మావోయిస్టులు మృతిచెందారు. సంఘటనా స్థలం వద్ద 315 బోర్‌ రైఫిల్స్‌, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన…

మోదీ ఆశీస్సులతో నిజామాబాద్‌కు పసుపు బోర్డు

29న కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ప్రారంభం అదేరోజు స్వర్గీయ డీఎస్‌ విగ్రహావిష్కరణ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి నిజామాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: పసుపు పండిరచే రైతుల ఆకాంక్ష మేరకు పసుపు బోర్డు కోసం ఎంతోకాలంగా పోరాటాలు కొనసాగాయని, పలు పార్టీలు పసుపు రైతులకు పలు హామీలు ఇచ్చినా అమలు జరగలేదని కేంద్ర బొగ్గు…

విలేకరి శ్రీకాంత్‌ రెడ్డిపై దాడిని ఖండించిన మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: ములుగు జిల్లా తాడ్వాయి మండల విలేకరి శ్రీకాంత్‌ రెడ్డిపై జరిగిన దాడిని పంచాయతీరాజ్‌ , గామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ సీతక్క తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు స్థానం లేదని స్పష్టం చేశారు. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే జిల్లా…

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు

-పెండిరగ్‌లోని రూ.80.38 కోట్ల మెడికల్‌ రీయింబర్స్మెంట్‌ బిల్లులు ఒకేసారి క్లియర్‌ -26,519మందికి ఊరట -గత ప్రభుత్వంలోని పెండిరగ్‌ బిల్లులను సైతం క్లియర్‌ చేసిన డిప్యూటీ సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్‌ రియంబర్స్మెంట్‌ పెండిరగ్‌ బిల్లుల మొత్తం రూ.180.38…

బనకచర్లను అడ్డుకుంటాం

నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: తెలంగాణ రైతాంగం ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చూడడమే తమ ముందున్న కర్తవ్యమని నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు ఏవిధంగా దెబ్బతింటాయోనన్న…

అసంపూర్తి ప‌నుల‌ను వేగంగా పూర్తిచేయాలి

భ‌విష్య‌త్  ప్ర‌ణాళిక‌లు రూపొందించుకోవాలి అధికార్ల‌కు సీఎం రేవంత్ ఆదేశాలు  అభివృద్ధి ప‌నుల‌ను ముఖ్య‌మంత్రికి వివ‌రించిన అధికారులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 25:  అసంపూర్తిగా ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బుధ‌వారం  మున్సిపల్ అడ్మినిస్టేషన్ అండ్ అర్బన్ డెవెలప్ మెంట్  అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా…

పర్యాటకం అభివృద్ధికి అవకాశాలు పుష్కలం

పర్యాటక, ఎక్సైజ్‌ శాఖల మంత్రి జూపల్లి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నాయని, టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తూ ఈ రంగం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమశిల వెల్‌నెస్‌, స్పిరిచ్యువల్‌…

రైతు భరోసాపై సంబరాలు ఎందుకో?

కాంగ్రెస్‌ను నిలదీసిన బీజేపీ ఎంపీ డీకే అరుణ  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ధైర్యం కాంగ్రెస్‌కు లేదని బీజేపీ మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు. రెండెకరాలు ఉన్నవారికి కూడా రైతు భరోసా ఇంకా రాలేదని, అలాంటప్పుడు రైతు భరోసా పేరుతో సంబురాలు ఎందుకు చేసుకుంటున్నారో కాంగ్రెస్‌ నేతలకే తెలియాలని…

ఐఏఎస్‌లు పాఠశాలలు సందర్శించాలి

– విద్యార్థుల సంఖ్యకనుగుణంగా వసతులు – పాఠశాలల్లో సోలార్‌ కిచెన్లు ఏర్పాటు చేయాలి – పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరూ ఇంటర్‌లో చేరేలా చూడాలి – విద్యా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అధికారులను…