prajatantra_news

prajatantra_news

రేర్‌ ఎర్త్‌ ఎగుమతులపై ప్రత్యామ్నాయం చూడండి

– చైనా ఆంక్షల ప్రభావంతో పలు కంపెనీల ఉత్పత్తికి ముప్పు – తెలంగాణ తయారీ రంగం సంక్షోభం ఎదుర్కొంటోంది – కేంద్ర మంత్రులు పీయుష్‌ గోయల్‌, అశ్వినీ వైష్ణవ్‌లకు మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి న్యూదిల్లీ, జూన్‌ 25: రేర్‌ ఎర్త్‌ ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించిన దరిమిలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ…

లంచం తీసుకునేంత దారిద్య్రం లేదు

కర్నాటక మంత్రి జమీర్‌అహ్మద్‌ఖాన్‌ బెంగళూరు, జూన్‌ 25: పేదలకు కేటాయించే ఇళ్ల లబ్ధిదారులనుంచి లంచం తీసుకునేంతటి దరిద్రం తనకు లేదంటూ కర్నాటక గృహ నిర్మాణ శాఖ మంత్రి జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ మండిపడ్డారు. బెంగళూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లబ్ధిదారుల నుంచి తాను లంచం తీసుకున్నట్టు నిరూపిస్తే తన మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానన్నారు.…

కొనసాగుతున్న ‘ఆపరేషన్‌ సింధు’

న్యూదిల్లీి, జూన్‌ 25 : ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని రప్పించేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్‌ సింధు’ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌ ద్వారా ఇజ్రాయెల్‌, ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తీసుకొస్తోంది. పొరుగు దేశాలకు చెందిన పౌరులకు కూడా భారత్‌ ఆపరేషన్‌ సింధు ద్వారా సాయం చేస్తోంది. ఈ ఆపరేషన్‌…

ఎమర్జెన్సీ  అనుభవాలపై పుస్తకం

ఎక్స్ ‌వేదికగా వెల్లడించిన ప్రధాని మోదీ  న్యూ దిల్లీ, జూన్‌ 25: ‌దేశంలో ఎమర్జెన్సీ విధించి జూన్‌ 25‌తో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆనాడు ఎదురైన పరిస్థితులు, ఇబ్బందులపై ’ది ఎఎమర్జెన్సీ డైరీస్‌’ ‌పేరుతో ప్రత్యేక పుస్తకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ ‌ద్వారా మోదీ  వెల్లడించారు. అత్యవసర పరిస్థితి…

టీటీపీ దాడిలో పాక్‌ మేజర్‌ హతం

భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను బంధించింది ఈయనే ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ దక్షిణ వజీరిస్తాన్‌లోని సర్గోధాలో తెహ్రిక్‌-ఇ తాలిబన్‌ పాకిస్థాన్‌(టీటీపీ) జరిపిన దాడిలో మేజర్‌ మోయిజ్‌ అబ్బాస్‌ షా అనే అధికారి మరణించారు. 2019లో బాలకోట్‌ దాడిలో భారత వైమానిక దళ అధికారి వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను బంధించింది మేజర్‌ మోయిజ్‌ అబ్బాస్‌ షా.…

నగదు రహిత చికిత్సపై పొన్నం సమీక్ష

అధికారులకు పలు సూచనలు చేసిన రవాణా మంత్రి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్‌ 162 ప్రకారం భారత ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకం 2025ను ప్రారంభించింది. ఈ పథకం తెలంగాణలో అమలుపై రవాణా, పోలీస్‌, హెల్త్‌, ఇన్సూరెన్స్‌, ఎన్‌ఐసీ విభాగాల అధికారులతో సచివాలయంలోని…

కేంద్ర సంస్థల భూముల సమస్యలు పరిష్కరించాలి

ఐటీ, పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు గతంలో కేటాయించిన భూములపై నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈమేరకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్‌ బాబు న్యూధిల్లీిలో కేంద్ర…

కుటీర పరిశ్రమలను ప్రోత్సహిస్తాం

ఆరోగ్య తెలంగాణను నిర్మిస్తాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25:పెద్ద ఎత్తున ఉపాధి, ఆదాయాన్ని సృష్టించే కుటీర పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ట్యాంక్ బండ్ పై బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన బిసి చేతి వృత్తి కళాకారుల…

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో వెలుగులోకి కొత్త విషయాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25 : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రోజురోజుకూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా 2023 నవంబర్‌ 15 నుంచి నవంబర్‌ 30 వరకు భారీగా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఏకంగా 4013 పోన్‌ నెంబర్లను ట్యాపింగ్‌ చేసినట్లు ప్రణీత్‌రావు అండ్‌ టీమ్‌ అంగీకరించింది. అందులో 618మంది…

కేసీఆర్‌ దమ్ముపై మాట్లాడే అర్హత రేవంత్‌కు లేదు

మహిళలకు పెన్షన్ల పెంపుపై ఎమ్మెల్సీ కవిత పోస్టుకార్డు ఉద్యమం హైదరాబాద్‌,జూన్‌25 (ప్రజాతంత్ర): మాజీ సీఎం కేసీఆర్‌ దమ్ము గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్‌రెడ్డికి లేదని, ఆయన దమ్మేంటో కాంగ్రెస్‌ పెద్దలకు తెలుసునని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళలకు రూ.2500 పెన్షన్ల మొత్తం పెంపుపై ఆమె పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా కవిత…