prajatantra_news

prajatantra_news

వైభవంగా గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవం

పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి సందడి చేసిన సినీ ప్రముఖులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14 : గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవం నగరంలోని హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌, నిర్మాత దిల్‌రాజు, ఎఫ్‌డీసీ ఎండీ…

బనకచర్లపై  ప్రతిఘటించింది కాంగ్రెస్‌ సర్కారే

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14: బనకచర్ల-గోదావరి ప్రాజెక్టును గట్టిగా ప్రతి ఘటించింది కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమేనని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీష్‌ రావు ప్రకటనపై తీవ్రంగా స్పందించారు. ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నిధుల కోసం రాసిన లేఖపై…

67 అంతస్తుల దుబాయ్‌ స్కైస్క్రాపర్‌లో భారీ అగ్నిప్రమాదం

3,820 మంది సురక్షితంగా తరలింపు దుబాయ్‌: మెరీనాలోని 67 అంతస్తుల మెరీనా పినాకిల్‌లో శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దీంతో అత్యవసర సిబ్బంది స్పందించి 764 అపార్ట్‌మెంట్ల నుండి 3,820 మంది నివాసితులను సురక్షితంగా తరలించారు, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆరు గంటల తర్వాత దుబాయ్‌ సివిల్‌ డిఫెన్స్‌ మంటలను నియంత్రించగలిగింది. టైగర్‌ టవర్‌ అని…

ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాలో ఘటన భోపాల్‌, జూన్‌ 14: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాలో శనివారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇందులో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీస్‌ ఉన్నతాధికారులు వెల్లడిరచారు. బాలాఘాట్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం నిఘా వర్గాల నుంచి పోలీసులు, భద్రతా దళాలకు అందడంతో వారు సంయుక్తంగా కూంబింగ్‌…

డీఎన్‌ఏ గుర్తింపు ఆలస్యం

బాధిత కుటుంబాల ఆందోళన ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాల్లో నిరాశ నెలకొంది. డీఎన్‌ఏ పరీక్షల ప్రక్రియలో ఆలస్యం కావడం, మృతదేహాలను గుర్తించడంలో జాప్యం జరుగుతుండడం బాధిత కుటుంబాలకు మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా డీఎన్‌ఏ పరీక్షల ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటం వారిని మానసికంగా కుంగదీస్తోంది.…

నాణ్యమైన విద్యతోనే బంగారు భవిష్యత్తు

శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి మహేశ్వరం రూరల్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14: పోటీ ప్రపంచంలో విజయాలు సాధించాలంటే నేటి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ఎంతో అవసరమని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీలో శ్లోక ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను ఎంపి రఘునందన్‌ రావు, ఎమ్మెల్సీ దయానందన్‌ గుప్తా, మాజీ ఎమ్మెల్యే…

కేటీఆర్‌పై మరో కేసు నమోదు

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి ఫిర్యాదు నేపథ్యంలో..   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌పై సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్ల కేటీఆర్‌ మాట్లాడిన మాటలు అవమానకరంగా ఉన్నాయని, అవి సీఎం ప్రతిష్టను దెబ్బతీసేవిగా ఉన్నాయంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌…

గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి కేసీఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కొద్ది రోజులుగా జలుబుతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరీక్షల కోసం శనివారం ఉదయం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. శుక్రవారం కూడా అదే ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్న కేసీఆర్‌ను ఈరోజు కూడా రావాల్సిందిగా వైద్యులు సూచించారు. కాగా, ప్రతీ…

విమానం తోక భాగంలో మృతదేహం

ప్రమాదంపై చురుకుగా కొనసాగుతున్న దర్యాప్తు న్యూదిల్లీ : అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరో మృతదేహాన్ని సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది శనివారం గుర్తించారు. అటు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తుండగా ఇటు శిథిలాలను సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది తొలగిస్తుండగా శనివారం ఉదయం తోక భాగంలో…

మాన్‌సూన్‌ రెగట్టాలో యువ సెయిలర్లకు బహుమతులు

అందజేసిన గురుకుల పాఠశాలల కార్యదర్శి సైదులు, జాయింట్‌ సెక్రటరీ తిరుపతి   ఖైరతాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14 : ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 16వ మాన్‌సూన్‌ రెగట్టాలో ఐదో రోజు పోటీలు నిలిచిపోయాయి. దీంతో ప్రస్తుతం లీడర్‌ బోర్డులో అగ్రస్థానంలో ఉన్న సెయిలర్లు తమ స్థానాలను నిలుపుకునే అవకాశం ఉంది. 12 రేసుల సిరీస్‌లో…