prajatantra_news

prajatantra_news

రేపు పొన్నం సత్తయ్య గౌడ్‌ పురస్కార ప్రదానోత్సవం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర సెప్టెంబర్‌ 12: రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్‌ స్మారకార్థం ఏర్పాటు చేసిన పొన్నం సత్తయ్య గౌడ్‌ జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవ సభ హైదరాబాదులోని రవీంద్ర భారతిలో శనివారం సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించనున్నట్లు అవార్డుల జ్యూరీ సభ్యుడు పొన్నం రవిచంద్ర…

మహిళలు వ్యాపార రంగంలో రాణించాలి

– కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: దేశ జీడీపీ పెరగాలంటే మహిళలు వ్యాపార రంగంలో ముందుకొచ్చి రాణించాలని కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్‌ వివేక్‌ వెంకటస్వామి పిలుపునిచ్చారు. హైటెక్‌ సిటీ టెక్‌ మహీంద్రాలో శుక్రవారం జరిగిన సీఐఐ ఇండియన్‌ ఉమెన్‌ అప్‌లిఫ్ట్‌ -వాయిస్‌ ఫర్‌ ఛేంజ్‌ కార్యక్రమంలో…

ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం

– ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము – హాజరైన ప్రధాని మోదీ, జగదీప్‌ ధన్‌ఖడ్‌, వెంకయ్య, పలువురు ప్రముఖులు న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 12: భారత నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో శుక్ర‌వారం ఉద‌యం ప్రమాణం చేయించారు.…

16న హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ సమస్యలపై వర్క్‌షాప్‌

– తెలంగాణ మీడియా అకాడమీ, ఐజేఎంల ఆధ్వర్యంలో.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: హ్యూమన్‌ ట్రాఫికింగ్‌, బాండెడ్‌ లేబర్‌ అంశాలపై తెలంగాణ మీడియా అకాడమీ, ఇంటర్నేషనల్‌ జస్టిస్‌ మిషన్‌ (ఐజేఎం) సంయుక్తంగా ఈనెల 16న ఉదయం 10 గంటలకు మీడియా వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ నేరాల తీవ్రతను అర్థం చేసుకుని అవగాహన పెంపొందించేలా, బాధితుల పట్ల…

17న బీజేపీ కార్యాలయాల్లో విశ్వకర్మ య‌జ్ఞం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని జాతీయ పండుగగా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తూ బీజేపీ ప్రతి జిల్లా కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ఆదేశాలు ఇచ్చారు. ఈమేరకు ఈనెల 17న విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరపడంపై విధివిధానాలు చర్చించేందుకు శుక్రవారం సమావేశం ఏర్పాటు…

మధ్యాహ్న భోజనం కార్మికుల గోడు పట్టించుకోండి

– ఏడాదిగా బిల్లులు, వేతనాలు చెల్లించకపోవడం దారుణం – మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: కాంగ్రెస్‌ ప్రభుత్వం నరకం చూపిస్తున్నదని ఆవేదన, ఆందోళన చెందవద్దని, మీ డిమాండ్లు నెరవేరే వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని మధ్యాహ్న భోజన కార్మికులకు బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి..హరీష్‌రావు భరోసా ఇచ్చారు.…

దక్షిణ భారత కుంభమేలా గా గోదావరి పుష్కరాలు

– గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు – తీరప్రాంత ఆలయాల అభివృద్ధికి తక్షణ చర్యలు – పుష్కరాలపై స‌మీక్షించిన‌ సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌12: ‌గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేలా గా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు…

పరిశమ్రల్లో భద్రతపై అధికారులు దృష్టి పెట్టాలి

– పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమల్లో భద్రతపై శిక్షణ  – ప్రారంభించిన కార్మిక మంత్రి వివేక్‌ వెంకటస్వామి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ఘటన పరిశ్రమల యజమానులకు ఇది ఒక కేస్‌ స్టడీ వంటిదని కార్మిక, ఉపాధి కల్పనల శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు. డైరెక్టరీస్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీ…

పేద విద్యార్థులకు 100శాతం స్కాలర్‌షిప్‌లు

– ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు పెంచాలి – కేంద్రాన్ని కోరిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ప్రీ, ప్రీమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లను ఇప్పటి 60 శాతం నుంచి 75 శాతానికి పెంచాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ కేంద్రాన్ని కోరారు. తెలంగాణలోని ఎస్సీ,…

ఉప‌రాష్ట్రప‌తిగా రాధాకృష్ణన్‌ ‌నేడు ప్రమాణస్వీకారం

– మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి రాజీనామా – ‌రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు – హాజరుకానున్న ప్రధాని మోదీ, తదితరులు న్యూదిల్లీ,ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్‌11: ఉపరాష్ట్రపతిగా ఘన విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్‌ ‌శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు  రాధాకృష్ణన్‌ 15‌వ భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉపరాష్ట్రపతి చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ…