prajatantra_news

prajatantra_news

రైతు సమస్యలు ప్రస్తావిస్తే కేసులా

– మాజీ మంత్రి హరీష్‌ ‌రావు విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 12: ‌రైతుల యూరియా కష్టాలను చూపిస్తే మీడియాపై కేసులు పెడతారా? అణచివేతలు, ఆంక్షలతో జర్నలిస్టులను భయపెడుతారా? అని కాంగ్రెస్‌ ‌సర్కార్‌ను మాజీ మంత్రి హరీష్‌ ‌రావు నిలదీశారు. రైతులు పడుతున్న యూరియా కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఖమ్మం రిపోర్టర్‌ ‌సాంబశివరావుపై పోలీసులు అక్రమ…

సుప్రీం కోర్టు ఆవరణలో నిషేధాజ్ఞలు

 ప్రజల నడ్డి విరుస్తున్న మోదీ ఆర్థిక విధానాలు రాజకీయ నేరాలకు అడ్డుకట్ట పడాలి ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించాలి అపహాస్యం అవుతోన్న  ప్రజాస్వామ్యం

– రీల్స్ ‌తదితర కార్యకలాపాల నిషేధం న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 12(ఆర్‌ఎన్‌ఎ): ‌సుప్రీంకోర్టు ప్రాంగణంలోని హై సెక్యూరిటీ జోన్‌లో ఫొటోలు, రీల్స్ ‌చేయడం, వీడియోలు తీయడంపై సర్వోన్నత న్యాయస్థానం నిషేధం విధిస్తూ సర్క్యులర్‌ ‌జారీ చేసింది. సెప్టెంబరు 10న జారీచేసిన ప్రకటనలో డియా సిబ్బంది ఇంటర్వ్యూలు, వార్తలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను కేవలం భద్రతా ప్రమాణాలకు అనుగుణమైన జోన్‌లో…

ఉపరితల ఆవర్తనం.. బంగాళాఖాతంలో అల్పపీడనం

– పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం – మానేరు వాగులో చిక్కుకుపోయిన ట్రాక్టర్లు – హైదరాబాద్‌ ‌మూసీకి వరదపోటు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌12: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న రెండురోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని…

భారీ వర్షాల హెచ్చరిక.. కాంగ్రెస్‌ ‌సభ వాయిదా

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 12: ‌కామారెడ్డిలో ఈనెల‌ 15న జరగనున్న సభను టీపీసీసీ వాయిదా వేసింది. భారీ వర్షాల సూచనతో సభను వాయిదా వేసినట్లు తెలిపింది.  సభ తిరిగి ఎపుడు నిర్వహిస్తామనేది త్వరలో చెబుతామని ప్రకటించింది. బీసీ డిక్లరేషన్‌ ‌ప్రకటించిన కామారెడ్డి గడ్డ మీద నుంచే రిజర్వేషన్లకు అడ్డుగా ఉన్న బీజేపీ సర్కారు మీద సమర శంఖం…

కేబుల్‌ ఆపరేటర్స్‌ను ఆదుకోవాలి

– బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచందర్‌రావ – రేపటి వారి ధర్నాకు మద్దతు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: కేబుల్‌ ఆపరేటర్స్‌ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు హామీ ఇచ్చారు. తెలంగాణ ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, చిన్నస్థాయి కేబుల్‌ ఆపరేటర్స్‌ తాము…

ఆదాయ లక్ష్యాలు అందుకోవాలి

– క్షేత్రస్థాయిలో అన్నింటా పర్యవేక్షణ పెరగాలి – వాణిజ్య పన్నుల శాఖాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష= హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు కమర్షియల్‌ ట్యాక్స్‌ యంత్రాంగం యావత్తు కృషిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ఆ శాఖ అధికారులతో శుక్రవారం సమీక్షా…

‌పూర్తి కావొస్తున్న బతుకమ్మ కుంట పనులు

– ఈసారి అక్కడే బతుకమ్మ ఉత్సవాలకు ప్లాన్‌ ‌- యాకుత్‌పురా ఘటనపై బాధ్యులపై చర్యలు – హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌స్పష్టీకరణ హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 12:  ‌బతుకమ్మ కుంట పనులు పూర్తి కావొస్తున్నాయని, త్వరలో సీఎం ఆధ్వర్యంలో బతుకమ్మ కుంట ప్రారంభిస్తాం అని హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ అన్నార. ఈసారి బతుకమ్మ పండుగ అక్కడే నిర్వహించేలా…

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను పునరుద్ధరించాలి

– నాలుగు రోజుల్లో 27,650 మెట్రిక్‌ టన్నుల యూరియా – గత రెండు రోజుల్లో 23 వేల మెట్రిక్‌ టన్నులు సరఫరా – యూరియా సరఫరాపై అధికారులతో సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: రాష్ట్రంలోని ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించేలా మరోసారి కేంద్రాన్ని కోరాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.…

ఎమ్మెల్యేల ‘చోరీ’పై రాహుల్‌ సిగ్గుపడాలి

– జాతీయస్థాయి వోట్‌ చోరీ కంటే తీవ్రమైన నేరం -బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్యేల ‘చోరీ’పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మాట్లాడకపోవడాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది రాహుల్‌ గాంధీ జాతీయ స్థాయిలో లేవనెత్తుతున్న వోట్‌ చోరీ కంటే దారుణమైన…

ట్రైబ‌ల్ వెల్ఫేర్‌లో పెండింగ్‌ బిల్లులు రూ.11 కోట్లు విడుదల

– యంగ్‌ ఇండియా స్కూల్స్‌ నిర్మాణ పనులు మొదలయ్యాయి – గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: టీజీటిబ్ల్యుఆర్‌ఈఐ సొసైటీకి చెందిన కాంట్రాక్టు, ఔట్‌సోర్స్‌, పార్ట్‌టైమ్‌ సిబ్బందికి, సబ్జెక్ట్‌ అసోసియేట్స్‌, ప్రధాన కార్యాలయంలోని సిబ్బందికి, స్వీపింగ్‌, శానిటేషన్‌, కేటరింగ్‌ సేవలకు సంబంధించి రెమ్యునరేషన్‌, సర్వీస్‌ చార్జీలు విడుదల చేశామని…