prajatantra_news

prajatantra_news

సంక్షేమం, అభివృద్ధి ఆగవు

భూపాలపల్లిలో డిప్యూటీ సీఎం భట్టి భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 17: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి ఘోరి మండలం చెన్నాపూర్‌లో నిర్మించిన 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ మంగళవారం పారంబోత్సవం జరిగింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభోత్సవం చేశారు. జిల్లాలో రూ.8.70 కోట్ల విలువైన…

స్థిరంగా భారత్‌ ఎగుమతులు

బంగారం దిగుమతులపై పెరిగిన ఖర్చు సోమవారం విడుదలైన వాణిజ్య గణాంకాలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: తిరుగులేని దిగుమతి-ఎగుమతుల యుద్ధం వ్యాపారాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందన్న ఆందోళనల మధ్య ఇప్పటివరకు భారతదేశపు సరకుల ఎగుమతులు స్థిరంగా ఉన్నాయి. సోమవారం విడుదలైన మే నెలకు చెందిన వాణిజ్య గణాంకాల ప్రకారం భారత్‌ ఎగుమతులు గతేడాది మే నెలలో ఉన్న…

భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి

జిల్లా కలెక్టర్లకు మంత్రి పొంగులేటి దిశానిర్దేశం   హైదరాబాద్‌ : తెలంగాణ సమాజంలో భూమి కీలకమైన అంశమని, గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌తో చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో వందల కుటుంబాలు భూ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నాయని భూ భారతి చట్టం ద్వారా ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలని రెవెన్యూ హౌసింగ్‌ సమాచార…

ప్రతి ఎకరాకు రైతు భరోసా

తొమ్మిది రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా జమ కాంగ్రెస్‌కు, వ్యవసాయానికి విడదీయరాని అనుబంధం బిఆర్‌ఎస్‌ నేతలు పదేళ్లు పంట నష్టం పరిహారం పట్టించుకోలేదు రైతు నేస్తం సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క    హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 16 : రానున్న తొమ్మిది రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలోని అన్నదాతల అందరి ఖాతాల్లోకి రైతు…

జనగణనపై నోటిఫికేషన్‌ జారీ

కులగణన కూడా చేపట్టనున్న కేంద్రం   న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 16: జనగణనకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వశాఖ సోమవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. పదిహేనేళ్ల తర్వాత నోటిఫికేషన్‌ జారీతో జనగణన ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్టయింది. మొత్తం రెండు దశల్లో జనగణన చేపడతారు. 2027 మార్చి 1వ తేదీనాటికి జనగణన ప్రక్రియ పూర్తవుతుంది. మంచు ఎక్కువగా…

జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్‌ టెన్షన్‌

కార్యాలయం వద్ద బీజేపీ నేతల ఆందోళన   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 16: నగరంలోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం ఉదిక్త్ర వాతావరణం నెలకొంది. నగర సమస్యలపై అధికారులను నిలదీసేందుకు బల్దియా కార్యాలయానికి భారీగా తరలివచ్చిన బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. తరలివచ్చారు. వీధి దీపాలు, రోడ్ల సమస్యలతో పాటు డివిజన్‌లోని సమస్యలు పరిష్కరించాలంటూ…

స్కిల్‌ వర్సిటీ అభివృద్ధికి సహకరించండి

కేంద్ర మంత్రి జయంత్‌ చౌదరికి విజ్ఞప్తి నైపుణ్యాభివృద్ధికి కేంద్రంతో కలిసి పని చేసేందుకు సిద్ధం మెగా జాబ్‌/స్కిల్‌ లోన్‌ మేళా ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 16:  తెలంగాణను ‘స్కిల్‌ కేపిటల్‌ ఆఫ్‌ ది గ్లోబల్‌’గా మార్చాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ…

రైతును రాజును చేయ‌డ‌మే ల‌క్ష్యం

ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా రైతుభ‌రోసా ఆప‌బోం దేశంలో మొట్ట‌మొద‌టిసారి స‌న్న‌బియ్యం ఇస్తున్నాం రైతు నేస్తం కార్యక్రమంలో  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 16:  రైతును రాజుగా చేయడమే కాదు, వ్యవసాయాన్ని పండగ చేసేందుకు ఉక్కు సంకల్పాన్ని తీసుకున్నాం. రాష్ట్రంలో, దేశంలో నాయకులు ఏ పదవి చేపట్టాలన్నా రైతుల అండ ఉండాలని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి…

తెలంగాణ ప్రతిష్టను పెంచాను

KTR

తలదించుకునే పనేం చేయలేదు అవినీతి జరగని కేసులో ఏసీబీని రంగంలోకి దించడమేంటి? అరెస్ట్‌ చేయాలనుకుంటే చేసుకోవచ్చు కాళేశ్వరం గొప్పతనాన్ని రాష్ట్రమంతటా చాటాలి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 16: తెలంగాణ ప్రతిష్టను ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయే పని చేశానే కానీ తలదించుకునే పని చేయలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు…

’డబుల్‌‘ ఇండ్లు లబ్దిదారులే పూర్తిచేసుకోవచ్చు

ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల సహాయం 2.65 లక్షల మంది లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 16 : అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను పూర్తిచేయడానికి కాంట్రాక్టర్‌ ముందుకు రాని పక్షంలో లబ్దిదారులే వాటిని పూర్తిచేసుకోవడానికి ప్రభుత్వం రూ.5…