Day August 24, 2026

ఏసీబీ వ‌ల‌లో నలుగురు అధికారులు

– నిర్మల్‌లో ఇద్దరు, యాదాద్రిలో ఇద్దరు నిర్మల్‌/‌యాదాద్రి భువనగిరి, ప్ర‌జాతంత్ర, ఆగస్ట్  24: ‌వేర్వేరుచోట్లు నలుగురు అధికారులు ఏసీబీకి చిక్కారు. వ్యాపారి నుంచి లంచం తీసుకుంటూ నిర్మల్‌ ‌జిల్లా కేంద్రంలో ఇద్దరు వాణిజ్య‌ పన్నుల శాఖాధికారులు ఏసీబీకి సోమవారం పట్టుబడ్డారు. ఫిర్యాదుదారు నుంచి రూ. 50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ ఆదిలాబాద్‌ ‌రేంజ్‌ అధికారులు దాడులు…

డీఎస్పీగా చ‌లామ‌ణి.. రూ.1.20 కోట్లు వసూళ్లు

– వల పన్ని అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: నగరంలో డీఎస్పీగా అవతారమెత్తి అమాయకులను మోసం చేస్తున్న కేవీపీ రాజు అలియాస్ డీఎస్పీ రాజును హైదరాబాద్ సీసీఎస్ ఈఓడబ్ల్యూ బృందం అరెస్ట్ చేసింది. తిరుపతి డీఎస్పీ పేరును ఉపయోగించుకుంటూ తనకు ఉన్నతస్థాయి పరిచయాలు ఉన్నాయని నమ్మిస్తూ పలువురి నుంచి భారీగా డబ్బులు…

ప్రజా ప్రయోజనాలకే ప్రభుత్వ భూములు వినియోగించాలి

– కేపీహెచ్ బీ స్థలాల వేలాన్ని నిలిపివేయాలి – ఎంపీ ఈటల డిమాండ్ కూకట్ పల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 24: కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్ బీ) పరిధిలోని ప్రభుత్వ స్థలాల వేలాన్ని ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ డిమాం డ్ చేశారు. కేపీహెచ్ బీలోని రమ్య గ్రౌండ్స్…

అధిష్ఠానం పరిశీలనలో సుష్మిత వ్యవహారం

– కాంగ్రెస్ పెద్దలు తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నాం – సోషల్ మీడియాతో బతికేస్తున్న కేటీఆర్ – మెదక్ లో కాంగ్రెస్ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మెదక్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత చేసిన‌ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించిన తీరు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.…

అటవీ శాఖలో పలువురు అధికారుల డిప్యూటేషన్లు రద్దు

– పీసీసీఎఫ్ కార్యాలయంలో వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశం – మంత్రి సురేఖకు తెలియకుండానే జీవో వెలువడిందంటూ కలకలం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ప్రభుత్వం అటవీ శాఖలో ఒక కీలకమైన పరిపాలనా నిర్ణయం తీసుకుంది. శాఖ పరిధిలో తీవ్ర కలకలం రేపుతూ పలువురు ఐఎఫ్ఎస్ అధికారులు, ఇతర ఉన్నతాధి కారుల డిప్యూటేషన్లను రద్దు…

రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి పనులు

– కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభం – 5.87.53 నిర్మాణం 4,235 ఎకరాలకు సాగునీరు – గిరిజనుల ఆకాంక్ష మేరకు సంత్ సేవాలాల్ పేరు పెట్టేందుకు చర్యలు – మంత్రి కోమటిరెడ్డి – పిల్లలను డ్రగ్స్ కు దూరంగా ఉంచాలి: మంత్రి జూపల్లి వనపర్తి, ప్రజాతంత్ర, ఆగస్టు 24 : రాష్ట్రంలో సంక్షేమ,…

జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్!

– మద్యం బ్రాండ్ల‌కు నోటిఫికేషన్‌పై హరీష్‌రావు ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24 : రాష్ట్రంలో లక్షలాదిమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందని అసెంబ్లీలో బీఆర్ఎస్ ఉప నాయ‌కుడు హరీష్‌రావు విమర్శించారు. కానీ 121 మద్యం బ్రాండ్ల నోటిఫికేషన్లు…

సెప్టెంబరు 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు

– నీటిపారుదల ప్రాజెక్టులకు భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేయాలి – ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24 : సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులతో ఆయన సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి…

మహిళలకు తమిళ సీఎం విజయ్‌ ‌వరాలు

– ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల ప్రకటన – ట్రాన్స్ ‌జెండర్లకు కూడా ఉచిత బస్సు సౌకర్యం చెన్నై, ఆగస్ట్ 24 : ‌తమిళనాడు అసెంబ్లీ వేదికగా మహిళలపై ముఖ్యమంత్రి జోసెఫ్‌ ‌విజయ్‌ ‌వరాల జల్లు కురిపించారు. ఎన్నికల హామీ మేరకు పలు సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నట్లు సోమవారం తెలిపారు. బడ్జెట్‌ ‌సమావేశాల సందర్భంగా అర్హులైన…