హైదరబాద్, ప్రజాతంత్ర,నవంబర్ 26: తెలంగాణ సామాజికవేత్తలతో ఆదివారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, యువత ఆశయాలను నెరవేర్చడానికి కావలసిన సూచనలు, సలహాల గురించి సమావేశంలో చర్చించారు.ఈ కార్యక్రమంలో శ్రీమతి దీప దాస్ మున్షీ , జస్టిస్ చంద్ర కుమార్ , డాపప గోపీనాథ్ , ఆకునూరి మురళి , సొహర బేగం, ప్రో. హరగోపాల్ , రామచంద్ర మూర్తి , శ్రీనివాస్ , మోహన్ గురు స్వామి , ప్రో. వెంకట్ నారాయణ, ప్రో. సాంట సింహ , ప్రో. కోదండ రామ్ , సందేశ్ సింగల్కర్ మరియు విఠల్ పాల్గొన్నారు.