– ప్రశ్నిస్తున్న పోలీసులు
– నేటితో ముగియనున్న పోలీస్ కస్టడీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 6: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని ఉమెన్ సేప్టీ వింగ్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటల వరకు కస్టడీ కొనసాగనుంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉమెన్ సేప్టీ డీసీపీ లావణ్య నాయక్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో డీసీపీ .. అత్తాపూర్ పీఎస్కు చేరుకున్నారు. కృష్ణారెడ్డిని డీసీపీ పర్యవేక్షణలో సీఐ జ్యోత్స్న విచారిస్తున్నారు. కస్టడీలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. విచారణలో కీలక ఆధారాలు సేకరించే దిశగా పోలీసులు దృష్టి సారించారు. ప్రధానంగా మిస్సైన మొబైల్ ఫోన్పై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఉదయ్ కృష్ణారెడ్డి రెండో మొబైల్ పైన ఆరా తీస్తున్నారు. మిస్సైన రెండో మొబైల్ దొరికినట్లయితే మరికొన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఉదయ్కు సంబంధించిన ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ను పోలీసులు సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్కు పంపించారు.హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడలో మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపుల కేసులో ఉదయ్ కృష్ణారెడ్డిని గత నెల 28న పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ఉమెన్స్ సేప్టీ వింగ్ అధికారులు ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా రెండు రోజులపాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్తో పరిచయం, లైంగిక వేధింపులు, తదితర అంశాలపై పోలీసుల విచారణ కొనసాగనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు