ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, ఏప్రి
ప్రజలు ఎక్కువగా సన్నబియ్యం ఇష్టపడుతారని, వినియోగం కూడా ఎక్కువగా ఉంటుందని, కాబట్టి సన్నబియ్యం వినియోగాన్ని పెంచడానికి, దొడ్డు బియ్యం రీసైక్లింగ్ ను అరికట్టడానికి చౌక దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీని ప్రభుత్వం ప్రారంభించినట్లు తెలిపారు. 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం దాదాపు రూ.2858 కోట్లు అవుతుందని తెలిపారు. ప్రభుత్వంలో రేషన్ డీలర్లు భాగస్వాములని, ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా సక్రమంగా పంపిణీ చేయాలని, మీ సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని, లబ్ధిదారులకు క్రమం తప్పకుండా సన్న బియ్యం ఇవ్వాలని సూచించారు. నిరుపేదలకు సన్నబియ్యం ఇచ్చేందుకు సన్నరకం ధాన్యానికి 2 వేల కోట్ల బోనస్ ఇచ్చి రైతులకు అండగా నిలిచామని తెలిపారు. ప్రతి వ్యక్తికి 6 కిలోలు చొప్పున పంపిణీ చేస్తున్నామని నలుగురున్న కుటుంబానికి నెలకు దాదాపు 1400 రూపాయలు ఆదా అవుతుందని తెలిపారు.
మంథని నియోజకవర్గంలో 41,045 మంది కార్డుదారులున్నారని ఈ పథకం అమలుతో 1,17,069 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలకు 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. రానున్న 15 రోజుల్లో లబ్ధిదారుల జాబితా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.. ఎలాంటి పైరవీలకు తావులేకుండా నిష్పక్షపాతంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతీ యువకులు స్వయం ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. ఈ పధకానికి దరఖాస్తు చేయడానికి ఈ నెల 14 చివరి తేదీ అని తెలిపారు. గత ప్రభుత్వం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని అయినప్పటికి ఇచ్చిన మాట ప్రకారం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, పౌర సరఫరాల డిఎం రాములు, మండల ప్రత్యేక అధికారి, డిఆర్డీఓ నరేష్, పరిశ్రమల శాఖ జిఎం సిద్దార్థ పాల్గొన్నారు.




