దయాల్బాగ్ (ఆగ్రా), సెప్టెంబర్ 3: రాధాస్వామి మత ప్రవర్తకులు, మొదటి సంత్ సత్గురువు అయిన పూరన్ ధనీ హుజూర్ స్వామీజీ మహారాజ్ జయంతి సందర్భంగా శుక్రవారం జన్మాష్టమిని పురస్కరించుకొని పవిత్ర భండారా ఉత్సవాన్ని ఆగ్రాలోని దయాల్బాగ్ లో భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్టు మీడియా అధికారి జితేంద్ర కాంత్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. హుజూర్ స్వామీజీ మహారాజ్ 1818 ఆగస్టు 24-25 మధ్య పవిత్ర జన్మాష్టమి రాత్రి ఆగ్రాలోని పన్నీ గలీలో సేఠ్ శివ్ దయాల్ సింగ్ జీ గా అవతరించారు. ఆయన జీవుల ఉద్ధరణకు నిజ్ ఘర్ ప్రాప్తికి ప్రత్యక్ష మార్గమైన సూరత్-శబ్ద-యోగాన్ని ప్రకాశింపజేసి, 1861 ఫిబ్రవరి 15 వసంత పంచమి రోజున సర్వసాధారణ సత్సంగీయులకు రాధాస్వామి సత్సంగ ద్వారాలను తెరిచారు. కాగా సెప్టెంబర్ 2 నుండి 6 వరకు భండారా వారం జరుపుకుంటారు. సెప్టెంబర్ 4న దేశవిదేశాల్లోని వివిధ శాఖలలో కూడా అత్యంత భక్తితో నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తూర్పు రాష్ట్రాలు మరియు యూరప్ నుండి అనుమతించబడిన శాఖల సత్సంగీ సోదర సోదరీమణులు మరియు రిజిస్టర్డ్ జిజ్ఞాసులు దయాల్బాగ్కు విచ్చేయనున్నారు. శుక్రవారం ఉదయం పవిత్ర ఆరతి మరియు రెండవ సెషన్లో పొలాలలో పవిత్ర భండారా నిర్వహించబడుతుందని జితేంద్రకాంత్ శర్మ వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



