ఏ పళ్లను అగ్ని కాల్చలేక పోయిందో, ఏ పళ్లను మట్టి తనలో కరిగించు కోలేక పోయిందో, అదే పళ్లను ఇరవై రోజుల పాటు ఏదైనా ఒక కూల్డ్రింక్లో ఉంచి పరిశీలిస్తే అవి పూర్తిగా కరిగిపోతున్నాయి. ఆ పళ్ళు రంగు మారి నొక్కితే పిండిగా అయిపోతున్నాయి. ఒక కూల్డ్రింకులో ఒక పన్ను వేసి ఎనిమిదవ రోజు చూసేసరికి ఆ పన్ను పూర్తిగా కరిగిపోయి మాయమైంది. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే లోపు 50 టన్నుల ఆహారాన్ని అయినా ఈ పళ్లతో నములుతాం. అన్ని టన్నుల ఆహారాన్ని నమిలినా అరగని పళ్లు మాత్రం ఒక కూల్డ్రింక్ నెల తిరగకుండా కరిగించేస్తున్నదంటే అవి తాగే పానీయాల లేక విషపదార్ధాల?
వేసవి వచ్చిందంటే అన్ని అనర్థా లను ప్రజలు ఆహ్వా నిస్తు న్నారు. ప్రజలకు ఎందుకూ పనికిరాని ఐపీఎల్ ప్రసారాలు ఒకవైపు పోరింగ్ పాట్నర్ పేరుతో శీతలపానీయాల అడ్వర్టైజ్మె ంట్ మరోవైపు. ప్రజలు కూల్ డ్రింక్ షాపుల వైపు పరుగె డతారు. ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్ లో కూల్ డ్రింక్ బాటిల్స్ నిండి ఉంటాయి. చాలామంది ప్రతి వారం షాపింగ్ మాల్స్ కు వెళ్లి కార్టూన్ కొద్దీ శీతలపానీయాలు కొని కరువా కాలమా అన్నట్లు కార్ట్ ను బలవంతంగా తోసుకు వస్తుంటారు. వాస్తవానికి కూల్ డ్రింక్స్ చల్లదనాన్ని ఇవ్వవు. ఇవ్వకపోగా మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని అనేక పరిశోధనలలో తేలింది. మన శరీరంలో జరిగే మార్పులు గ్రహించకుండా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన అలవాట్లను మనిషి నేర్చుకున్నాడు.
ముఖ్యంగా ఈ పాశ్చాత్య ఫ్యాషన్ నాగరికతలో భాగంగా కూల్ డ్రింక్స్ కు బాగా అలవాటు పడ్డారు. కూల్ డ్రింక్ లో ఎక్కువ శాతం పురుగుల మందుల అవశేషాలు పుష్కలంగా ఉన్నట్లు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంటల్ ఇండియా దశాబ్దం క్రితం తేల్చి చెప్పింది. మానవ శరీరాలను ప్రమాదకరంగా మారే పదార్థాలు కూల్ డ్రింక్ లో ఉండే పదార్థాలు కార్బోనేటెడ్ వాటర్, కార్న్ సిరప్, పంచదార, ఎస్పిరటం, కారమెల్,పాస్పరిక్ ఆమ్లం, కెఫిన్, సిట్రిక్ ఆమ్లం, పొటాషియం బెంజైట్,పొటాషియం సిట్రేట్ ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.
కూల్ డ్రింక్ లో ఉండే ఆర్గానో క్లోరిన్, ఆర్గానో ఫాస్ఫరస్ పురుగుల మందులైన లిండేన్,డిడిటి, మలాథియాన్ ఉన్నట్లు పరిశోధనలు చెపుతున్న ప్రభుత్వాలు వీటిని బ్యాన్ చేయడం లేదు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కూల్ డ్రింక్ కంపెనీలు ఏటా ఏడు వేల కోట్లు దోచుకుంటున్నాయి. ప్రజల డబ్బుతో హీరోగా, క్రీడాకారులుగా, అవార్డు గ్రహీతలు పెద్దమనుషులు గా చలామణి అవుతున్న వారు కోట్లల్లో డబ్బు తీసుకుని ప్రజా ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేసే వాణిజ్య ప్రకటనలు ఇస్తున్నారు. వారిపై క్రిమినల్ కేసులు బనాయించాల్సిన ప్రభుత్వం వీరిని అవార్డులతో సత్కరించడం సిగ్గుచేటు.
కూల్ డ్రింక్స్ పీహెచ్ శాతం టాయిలెట్ క్లినర్స్ యాసిడ్తో సమానంగా ఉంటుంది. ఇది శరీరానికి చాలా ప్రమాదకరం. స్థూలకాయం, ఊపిరి తిత్తులు, బి. పి, షుగర్, ఎముకల మెత్తబడి పోవడం, కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థను ధ్వంసం చేసి, రీనల్ ఫైల్యూర్ కు దారి తీస్తుంది. గర్భిణీ స్త్రీలు కాల్ డ్రింక్స్ సేవిస్తే పుట్టబోయే పిల్లలు – పిండం పై ప్రభావం ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు, కిడ్నీ, లివర్, క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. తరచుగా అధిక మొత్తంలో చక్కెరతో కూడిన శీతల పానీయాలు మన దైనందిన జీవితంలో పాతుకుపోయాయి, వాస్తవానికి మద్యపానం, సిగరెట్, గుట్కా వంటి పదార్ధాల మాదిరిగా వ్యసనానికి దారితీస్తాయి.
ఒక్క శీతల పానీయం బాటిల్లో ఎంత చక్కెర ఉందో అర్థం చేసుకోవడం కళ్లు తెరిపిస్తుంది. కొన్ని శీతల పానీయాలు చక్కెర స్థాయిలను కలిగి ఉంటాయి, ఇది రోజువారీ సిఫార్సు చేయబడిన తీసుకోవడం స్థాయిలను మించిపోయింది. అధిక చక్కెర తీసుకోవడం ఊబకాయం, మధుమేహం మరియు దంత సమస్యలతో సహా వివిధ ఆరోగ్య సమస్యలకు దోహదం చేస్తుంది. అంతేకాకుండా, శీతల పానీయాల ప్రతికూల ప్రభావం చక్కెర కంటెంట్కు మించి ఉంటుంది. శీతల పానీయాలలో టాయిలెట్ క్లీనర్లు తో సమానంగా ఆమ్ల లక్షణాలు ఉంటుంది. దంతాలు జీర్ణ ఆరోగ్యం పై వాటి ప్రభావాన్ని చూపుతాయి . ఆమ్ల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పంటి ఎనామిల్ చెరిపి చేయబడుతుంది, జీర్ణశయాంతర అసౌకర్యానికి దారితీస్తుంది.
శీతల పానీయాలు అనేక ఆరోగ్య సమస్యలు ముడిపడి ఉన్నాయి, శీతల పానీయాల వినియోగం దీర్ఘకాలంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. శీతల పానీయాలు తరచుగా కేలరీలు, చక్కెరలో ఎక్కువగా ఉంటాయి, బరువు పెరగడానికి, ఊబకాయానికి దోహదం చేస్తాయి, శీతల పానీయాలలో అధిక చక్కెర కంటెంట్ ఇన్సులిన్ నిరోధకత కు దారితీస్తుంది అలాగే టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది, చక్కెర శీతల పానీయాల అధిక వినియోగం రక్తంలో చక్కెర స్థాయిలు మరియు హృదయనాళ ఆరోగ్యంపై వాటి ప్రభావం కారణంగా రక్తపోటు, కొరోనరీ ఆర్టరీ వ్యాధి స్ట్రోక్తో సహా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. శీతల పానీయాలలో ఉండే ఆమ్లత్వం కృత్రిమ సంకలనాలు కడుపు లైనింగ్ను చికాకుపరుస్తాయి, ఇది యాసిడ్ రిఫ్లక్స్, అజీర్ణం జీర్ణశయాంతర అసౌకర్యం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.
కొన్ని అధ్యయనాలు ఆహార శీతల పానీయాలలో కనిపించే కొన్ని కృత్రిమ స్వీట్నర్లు వినియోగం క్యాన్సర్ వచ్చే ప్రమాదం మధ్య సంభావ్య సంబంధాన్ని సూచించాయి, శీతల పానీయాల రెగ్యులర్ వినియోగం, ముఖ్యంగా ఫ్రక్టోజ్ అధికంగా ఉండేవి, కాలక్రమేణా కొవ్వు కాలేయ వ్యాధి మరియు కాలేయం దెబ్బతినడానికి దోహదం చేస్తాయి.శీతల పానీయాలలో అధిక స్థాయి చక్కెర మరియు కెఫిన్ పురుషులు మరియు స్త్రీలలో పునరుత్పత్తి ఆరోగ్యం, సంతానోత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. సాఫ్ట్ డ్రింక్స్లో ఫాస్పోరిక్ యాసిడ్ ఉంటుంది, ఇది కాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తుంది మరియు ఎముక సాంద్రత నష్టానికి దోహదం చేస్తుంది, ముఖ్యంగా పిల్లలు మరియు పెద్దలలో బోలు ఎముకల వ్యాధి, పగుళ్ల ప్రమాదాన్ని పెంచు తుంది. ప్రజలు వేసవిలో మజ్జిగ, లస్సి, పండ్ల రసాలు, రాగి జావ, తాటి ముంజలు, కర్బుజా, కళిం గర, కీర దోస పిల్ల లకు అలవాటు చేస్తే మంచిది. మ ంచి ఆరోగ్య అల వాట్లు ఇంటి నుండే ప్రారంభం కావాలి. పెళ్లిళ్లలో, శుభకా ర్యాలలో ఆరోగ్యాన్ని హానికలిగించే అన్ని రకాల కూల్ డ్రింక్ నిలుపుదల చేయాలి. ప్రభుత్వం దీనిని నిషేధించే వరకు ప్రజలు పౌర సంఘాలు ఉద్య మించాలి. స్వ లాభం కోసం వాణిజ్య ప్రకటనలు ఇచ్చే హీరోలు, హీరోయిన్లు, క్రీడా కారులపై కేసులు బనాయించాలి. మనం చనిపోయిన తర్వాత దహన సంస్కారం చేస్తే శవం పూర్తిగా కాలిపోతుంది. ఎముకలు పూర్తిగా కాలిపోతాయి. కానీ నోటిలోని పళ్లు మాత్రం కాలిపోవు. శవాన్ని కాల్చడానికి బదులుగా భూమిలో పాతి పెడితే శరీరం మొత్తం మట్టిలో కలిసి పోతుంది. 20 సంవత్సరాల తర్వాత ఆ మట్టి భాగాన్ని తవ్వి తీస్తే పళ్ళు మాత్రం చెక్కు చెదరకుండా ఉంటాయి. అంత గట్టిగా మన పళ్లు తయారు చేయబడ్డాయి.
ఏ పళ్లను అగ్ని కాల్చలేక పోయిందో, ఏ పళ్లను మట్టి తనలో కరిగించు కోలేక పోయిందో, అదే పళ్లను ఇరవై రోజుల పాటు ఏదైనా ఒక కూల్డ్రింక్లో ఉంచి పరిశీలిస్తే అవి పూర్తిగా కరిగిపోతున్నాయి. ఆ పళ్ళు రంగు మారి నొక్కితే పిండిగా అయిపోతున్నాయి. ఒక కూల్డ్రింకులో ఒక పన్ను వేసి ఎనిమిదవ రోజు చూసేసరికి ఆ పన్ను పూర్తిగా కరిగిపోయి మాయమైంది.
మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే లోపు 50 టన్నుల ఆహారాన్ని అయినా ఈ పళ్లతో నములుతాం. అన్ని టన్నుల ఆహారాన్ని నమిలినా అరగని పళ్లు మాత్రం ఒక కూల్డ్రింక్ నెల తిరగకుండా కరిగించేస్తున్నదంటే అవి తాగే పానీయాల లేక విషపదార్ధాల? విషపదార్థాలే, కాకపోతే ఎక్కువ నీటి శాతం ఉండబట్టి మెల్లగా చంపే విషం లా పనిచేస్తాయి. అలాంటి గట్టి పళ్లనే నాశనం చేసే డ్రింక్స్కి మన లోపలి పేగులు, నరాలు, కణాలు ఒక లెక్కా ఏమిటి. ప్రభుత్వం సత్వరమే శీతలపానీయాలు బ్యాన్ చేయాలి. అమ్మకం దారులను తక్షణమే అరికట్టాలి.
డా।। యం. అఖిల మిత్ర
ప్రకృతి వైద్యులు





