Tag Special Articles

కూల్‌ ‌డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం

ఏ ‌పళ్లను అగ్ని కాల్చలేక పోయిందో, ఏ పళ్లను మట్టి తనలో కరిగించు కోలేక పోయిందో, అదే పళ్లను ఇరవై  రోజుల పాటు ఏదైనా ఒక కూల్‌‌డ్రింక్‌లో ఉంచి పరిశీలిస్తే అవి పూర్తిగా కరిగిపోతున్నాయి. ఆ పళ్ళు రంగు మారి నొక్కితే పిండిగా అయిపోతున్నాయి. ఒక కూల్‌‌డ్రింకులో ఒక పన్ను వేసి ఎనిమిదవ రోజు చూసేసరికి…

1960 ‌వ దశకం వరంగల్‌ ‌పత్రికా రంగంలో అనేక పత్రికలు ఉద్భవించిన ఒక ఉన్నత దశ

కాకతీయ కలగూర గంప – 21  కాకతీయ యూని వర్సి టీలో 25-1-2017 నా డు అలనాటి ‘కాకతీయ పత్రిక’ సంపా దకుడు శ్రీ పాములపర్తి సదాశివ రావు గారి 8 వ సంస్మరణ సభలో అప్పటి ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకుడు, సీనియర్‌ ‌జర్నలిస్టు మరియు ప్రఖ్యాత పత్రికా రచయిత డాక్టర్‌ ‌కె. శ్రీనివాస్‌ ‌గారు ముఖ్య…

పాల్వంచలో’ కేటిపీఎస్‌ ‌సాంస్కృతిక సంస్థ సమావేశంలో ‘సురవం ప్రతాప రెడ్డి జీవిత విశేషాల’పై ఇందుర్తి ప్రభాకర రావు ప్రసంగం

నేను బిహెచ్‌ఇఎల్‌ ‌లో జాయిన్‌ ‌కాకముందు హైదరాబాద్‌ ‌చిక్కడ్‌ ‌పల్లి లో వుండే వాడిని. నా రూం ప్రక్కనే ఇందుర్తి ప్రభాకరావు గారు వుండే వారు. ఆయన ఒక రచయిత, జర్నలిస్ట్, ‌మంచి రాజకీయ విశ్లేషకుడు. ఆయన అప్పుడు ‘ఆంధ్ర భూమి ‘ దిన పత్రిక ఎడిటోరియల్‌ ‌బోర్డ్ ‌లో పనిచేసే వారు. ఒక సాయంత్రం…

‘బొంబై పట్నం చూడరా బాబు’ పాల్వంచ నుండి బొంబై విక్టోరియా టర్మినస్‌ కు పయనం

ఖమ్మం రైల్వే స్టేషన్‌ అంటే ఒక విచిత్ర సంఘటన జ్ఞాపకం వస్తుంది. నేను, అయ్యర్‌ ఒక రోజు హైదరాబాద్‌ రావల్సివచ్చింది. ఒక కారు తీసుకొని సాయంత్రం 5 గంటలకు బయల్దేరాం. విజయ రాఘవన్‌ అనే మా మిత్ర ఇంజినీర్‌ మాతో ఖమ్మం దాకా కారులో వస్తాననీ, అక్కడ నుండి రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌ ‘మద్రాస్‌…

కొలువుల తెలంగాణా’ కావాలి

కొలువుల కోసం “కాంగ్రెస్ “పై కోటి ఆశలతో నిరుద్యోగులు! మన దేశంలో మిగతా రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడితే, తెలంగాణ ఒక భావోద్వేగా రాష్ట్రం,కదిలిస్తే ఇక్కడ అమరవీరుల తల్లుల కన్నీళ్లు కన్పిస్తాయి.నీళ్లు,నిధుల కోసం నాయకులు కొట్లాడితే కొలువులే కొలమానంగా తొలి నుండి తుది తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది విద్యార్థులే.తెలంగాణ వొస్తే కోరుకున్న కొలువు వొస్తదని,గొప్పగా బతుకుతాం అని విద్యార్థులు తమ జీవితాలని లెక్క చేయకుండా,ప్రాణాలని పణంగా పెడితే ఆ త్యాగల పునాదులపై తెలంగాణ పురుడుపోసుకున్నది.తెలంగాణ రాష్ట్రము ఏర్పడితే తొలి ఫలితం విద్యార్థులకే దక్కాలి,అది వారి హక్కు కూడా.కానీ ఈ పదేండ్లలో సొంత రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగుల నిరాశ,అసంతృప్తి,అందోనళ నను ప్రభుత్వం అర్ధం చేసుకొవాలి.ప్రజా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీనీ అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించి, ఉద్యోగాల భర్తీ వైపు అడుగులు పడాలని నిరుద్యోగులు ప్రజాప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోతో మళ్ళీ చిగురించిన ఆశలు? కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో నిరుద్యోగులదే కీ రోల్ అని ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కూడా ప్రభుత్వం గుర్తించడం నిజంగా గొప్ప విషయం,ఇది నిరుద్యోగుల గౌరవాన్ని పెంచింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే మాది నిరుద్యోగుల ప్రభుత్వం అని, మా ప్రజా ప్రభుత్వం నిరుద్యోగుల భాధలు,సమస్యలు వినడానికి సిద్ధంగా ఉన్నదని ప్రకటించడం అంటే ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై సీరియస్ గా ఉందనే విశ్వాసాన్ని నిరుద్యోగులకి కల్పించారు.కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన 2లక్షల ఉద్యోగాలు,జాబ్ క్యాలెండరు అనేది ఒక సంచలనం.పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలని శరవేగంగా భర్తీ చేసి కొత్త సంవత్సరంలో పకడ్బoదిగ జాబ్ క్యాలెండరు అమలు చేసే దిశగా ప్రజా ప్రభుత్వం అడుగులు పడుతున్నాయి.టీజీపిఎస్సీ చైర్మన్ పదవి కాలం పూర్తి కాకముందే కొత్త ఛైర్మన్ ని నియమించడం మంచి పరిణామం.కోచింగ్ సెంటర్ల దోపిడీ నుండి గ్రామీణ పేద విద్యార్థలకీ విముక్తి కల్పించి, తల్లిదండ్రులకి లక్షల రూపాయల కోచింగ్ ఫీజు భారం తగ్గించేలా అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తాం అని ప్రభుత్వం ప్రకటించింది.ప్రస్తుత జాబ్ క్యాలెండర్ అమలుకు ముందే అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లని ఏర్పాటు చేసి అనుభవజ్ఞ్యులైన అధ్యాపకుల చేత ఖరీదైనా కోచింగ్ ని ఉచితంగా అందించడంతో పాటు వసతి సౌకర్యం కల్పించాలి. నిరుద్యోగులకి ఇచ్చిన ప్రతి హామీని నిరవేర్చాలి? నిరుద్యోగుల బాధలను స్వయంగా చూడటానికి కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధి అశోక్ నగర్ వొచ్చి, నిరుద్యోగుల బాధలను కళ్లారా చూసి చలించిపోయి మా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన వెంటనే 2లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తుందని ఇది నా గ్యారెంటీ అని హామీ ఇవ్వడంతో, నిరుద్యోగులు ప్రజా ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో మళ్ళీ పుస్తకాలని పట్టుకున్నారు.తమ జీవితం ఆగమైపోయిందని అనుకున్న నిరుద్యోగులలో జాబ్ క్యాలెండరు,2లక్షల ఉద్యోగాల హామీ ఆనందాన్ని ఇచ్చింది.యేండ్లకేండ్లు ఉద్యోగాల భర్తీ జరగకుండా, ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ కోర్ట్ మెట్లు ఎక్కకుండా, ఎటువంటి పొరపాట్లు లేకుండా, స్పష్టంగా జాబ్ క్యాలెండరులో పెట్టిన తేదీల ప్రకారం వేగంగా ఉద్యోగాలని భర్తీ చేయాలి.అదేవిధంగా నిరుద్యోగులకి ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగభృతి 4000 రూపాయలని వెంటనే ప్రభుత్వం అందివ్వాలి. ప్రభుత్వం తండ్రిలా నిరుద్యోగబిడ్డలకి గౌరవప్రదమైన జీవితం దక్కేలా భరోసా కల్పించడం అనేది ప్రభుత్వం బాధ్యత. అప్పులతో నిరుద్యోగుల జీవితాలని ముడిబెట్టడం న్యాయమేనా? నిరుద్యోగులంటే అంత చిన్నచూపా, అవమానకారంగా అప్పులతో నిరుద్యోగుల జీవితాలని తీసిపడేయడం ఇది ఏ విధంగా ప్రజా ప్రభుత్వ గౌరవాన్ని పెంచుతుంది. మేం ఎన్నో కలలు కన్నాం, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వొస్తే 2లక్షల ఉద్యోగాలని,జాబ్ క్యాలెండరు ద్వారా భర్తీ చేస్తుందని అనుకున్నాం.ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు 10యేండ్లు అధికారంలో లేరు తప్పకుండ వారికి మా బాధలు తెలుసు కాబట్టి ఉద్యోగాల భర్తీనే ప్రధాన ఎజెండాగా ప్రజా ప్రభుత్వం శరవేగంగా కొలువుల భర్తీ చేయాలనీ నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రార్ధిస్తున్నారు.అంతేకాని అప్పులతో నిరుద్యోగుల జీవితాలని ముడివేయడం నిజంగా బాధాకరం.ప్రస్తుతం ఉన్న అప్పులు గత ప్రభుత్వం చేసిన అప్పులే,అయినా అప్పటి ప్రభుత్వం మీద ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు అని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు పోరాడారు కదా,కొట్లాడారు కదా?అప్పుడు మీరు అప్పులుతో ఉద్యోగాలని ఏందుకు ముదిపెట్టలేదు?మేనిఫెస్టోలో పెట్టిన రెండు లక్షల ఉద్యోగాలని భర్తీ చేయాలనీ నిరుద్యోగులంతా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నిరుద్యోగమే లేని తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేయాలి ఎప్పటికప్పుడు ఖాలీ అయ్యే ప్రతి ఉద్యోగాన్ని ముందు రోజు వరకే ఆ ఉద్యోగం భర్తీ అయ్యేలా ప్రభుత్వం కృషి చేయాలి.ప్రభుత్వ ఉద్యోగాలు పరిమితంగానే ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ప్రయివేట్ ఉద్యోగాల భర్తీపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి.తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు ప్రభుత్వం రాయితీలని, ప్రోత్సహాకాలని అందించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నియామకాల కోసం కాబట్టి, ప్రయివేటు ఉద్యోగాలలో 75% ఉద్యోగాలు స్థానికులకి దక్కేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలి.పరిశ్రమలకి కావాల్సింది నైపుణ్యం ఉన్న మానవ వనరులే కాబట్టి పరిశ్రమలకి అవసరమయినా సాంకేతిక నైపుణ్యలని ప్రభుత్వమే అందివ్వాలి.పరిశ్రమలు కోరుకుంటున్న, పారిశ్రామిక అవసరాలు తీర్చేలా విద్య వ్యవస్థని మార్చాలి.అదేవిధంగా బిజినెస్ చేసుకునేందుకు తెలంగాణ బిడ్డలకి ఉదారంగా రుణాలు ప్రభుత్వం అందించినప్పుడే కొలువుల తెలంగాణ అవతరిస్తుంది. -:శ్రవణ్ కుమార్ నల్ల నిరుద్యోగి

కొలువుల కోసం “కాంగ్రెస్ “పై కోటి ఆశలతో నిరుద్యోగులు! మన దేశంలో మిగతా రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడితే, తెలంగాణ ఒక భావోద్వేగా రాష్ట్రం,కదిలిస్తే ఇక్కడ అమరవీరుల తల్లుల కన్నీళ్లు కన్పిస్తాయి.నీళ్లు,నిధుల కోసం నాయకులు కొట్లాడితే కొలువులే కొలమానంగా తొలి నుండి తుది తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది విద్యార్థులే. తెలంగాణ వొస్తే కోరుకున్న కొలువు వొస్తదని,గొప్పగా బతుకుతాం అని విద్యార్థులు తమ జీవితాలని…

జయుడు చెప్పిన విజయుడి గాథ నకిలీ జ్యోతిష్కుడి గుట్టు రట్టు

 కాకతీయ కలగూర గంప – 13 ఒక సారి దక్షిణాది నుండి నాడీ జ్యోతిష్యం చెప్పే ఒక జ్యోతిష శాస్త్రవేత్త సికిందరాబాదుకు రావడం జరిగింది (ఇది1958 లో శ్రీ పీ వీ గారు ఎం. ఎల్‌. ఏ ‌గా వున్నప్పుడు జరిగింది.). ఈయన స్పెషాలిటీ ఏమిటంటే తన దగ్గరకు వచ్చే జనాలను అనేక ప్రశ్నలడిగి సమాధానాలు…

నామమాత్రంగా వృద్ధుల ఆరోగ్యభద్రత!

అరవై ఏళ్లు దాటిన వృద్ధులపై ‘ఇండియా ఏజింగ్‌ రిపోర్టు 2023’ వెల్లడిరచిన ఆసక్తికరమైన విషయాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. దేశంలో వృద్ధుల జనాభా గణనీయంగా పెరుగుతోంది. అరవై ఏళ్లు దాటిన వారు 2021 నాటికి మొత్తం జనాభాలో 10.1 శాతం ఉండగా, 2036 నాటికి 15 శాతానికి, 2050 నాటికి 20.8 శాతానికి పెరుగుతుందని…

ఆధునికత మాయలో యువత!

ఆధునికత మాయలో 5జీ ప్లస్‌గా అప్డేట్‌ అవుతూ అన్ని రంగాల్లో వేగంగా వెళ్ళడం తప్పని పరిస్థితి. శాస్త్రసాంకేతిక రంగాల్లో వొచ్చిన ఇంటర్‌ నెట్‌ విప్లవాత్మక మార్పుల వల్ల ప్రపంచపు అన్ని దిక్కులా ‘వేగం’ నేటియువతరపు తారక మంత్రం అయ్యింది. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఆఫీస్‌ కు వెళ్లాలని, కాలేజ్‌…

ధరలు స్వారీ చేస్తున్నాయి…!

India deteriorating economy day by day

ద్రవ్యోల్బణ పరిస్థితులను నివారించడంలో పటిష్టమైన చర్యలెవీ? నానాటికీ దిగజారుతున్న భారత ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణ పరిస్థితులను నివారించడంలో పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు. రూపాయి మారకం విలువ నానాటికి దిగజారుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం 84 రూపాయలు దాటింది. ధరలు స్వారీ చేస్తున్నాయి. ప్రధానంగగా బియ్యం,ఉప్పు, పప్పుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా అజమాయిషీ చేయడంలేదు.…

You cannot copy content of this page