ఒకసారి విన్నంతనే చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారి .. కవితా ప్రయోగంలో యతి తప్పు

చూపించిన అలనాటి తెలంగాణ కవి!

కాకతీయ కలగూర గంప – 23

అలనాటి నిజాం పాలిత హైదరాబాద్‌ ‌రాష్ట్రంలో తెలుగు కవులున్నారా? అని అపహాస్యం చేసే రోజుల సంఘటన ఇది.ప్రఖ్యాత జంట కవులు, అవధాన పం• •తులైన ‘తిరుపతి వెంకట కవులు’ అంటే ఏ కొద్దిమంది కవులకు మాత్రమే తెలుసు. కాని 1960 -70 లలో విడుదలై శ్రీ కృష్ణ రాయబార సన్నివేశాలను చూపించిన అనేక సినిమాలలో శ్రీ కృష్ణ పాత్రధారి యన్‌ ‌టి రామారావు గారు ఒక చేతిలో మురళిని ఝలిపిస్తూ అద్భుత హావభావాలతో రాగయుక్తంగా చదివిన ఆ గొప్ప పద్యం ‘‘జెండా పై కపి రాజు’’ మరియు ఇతర పద్యాలు రాసింది తిరుపతి వెంకట కవులే అని తెలిస్తే అప్పుడు సామాన్య జనులకు కూడా వారి పాండిత్య ప్రభావం తెలుస్తుంది.

దివాకర్ల తిరుపతి శాస్త్రి (1872-1919), చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి (1870-1950) – ఈ ఇద్దరు కవులు ‘తిరుపతి వేంకట కవులు’ గా ప్రసిద్ధి చెందిన జంట కవులు. వారు రాసిన ‘‘పాండవోద్యోగ విజ యాలు’’ అనే నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా మారు మ్రో గాయి.చాలా మంది చదువురాని వాళ్ళు కూడా ‘‘బావా ఎప్పుడు వచ్చితీవు’’, ‘‘చెల్లియొ చెల్లకొ’’, ‘‘జెండాపై కపిరాజు’’ అనే పద్యాలను పాడ గలిగేవారు. వీరి అవధాన పూరణలు, చమత్కారాలు పండితలోకంలో ప్రసిద్ధములు.

వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత మరియు తెలుగు గ్రంథాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రా శారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలోతరతరాలుగా చెప్పుకొనబ డుతు న్నాయి. వేంకట శాస్త్రి అధ్యాపకునిగా ఉన్నపుడు ఆయన శిష్యులుగా ఉండి, తరువాత సుప్రసిద్ధులై నవారిలో కొందరు – విశ్వనాధ సత్యనారాయణ, వేటూరి సుందరరామ మూర్తి, పింగళి లక్ష్మీకాంతం.మొదటినుండి తిరుపతి శాస్త్రి వాదనా పటిమ అసాధారణంగా ఉండేది. ఇక వేంకట శాస్త్రి పురాణ సాహి త్యాలపై ఉప న్యాసా లివ్వడంలో దిట్ట. జీవి తాంతం ఆ సాహితీ మూర్తులు ఒకరికొకరు తోడు న్నారు. తిరుపతి శాస్త్రి సదా వేంకటశాస్త్రిని తన గురువుగా భావించాడు. తిరుపతి శాస్త్రి మరణానంతరం కూడా వేంకట శాస్త్రి తన రచనలను జంట రచనలుగానే కొనసాగించారు.

image.png
చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి శిష్యుడు పింగళి లక్ష్మికాంతం. ఆయన శిష్యుడు పువ్వాడ శేషగిరి రావు. ఆయన శిష్యుడు పిళ్ళా వేంకట రత్నం. పిళ్ళా కవి రాసిన ‘విజయ కుమారం’ అనే చిన్న కావ్యాన్ని ఆవిష్కరిస్తూ చెళ్లపిళ్ల వారు పైన తెలిపిన శిష్యపరంపర ను పేర్కొని‘ఈ విధంగా నా కవితా వంశం వృద్ధి చెందుతున్నది. నా కింకేం కావాలి?’ అని సంతృప్తిని వెలిబుచ్చారట.
ఇక అసలు విషయానికి వద్దాం. పిళ్ళా కవి 1943 – 44 లలో వరంగల్‌ ‌వచ్చినపుడు కాళోజీ గారింట్లో మకాం. ఆయన ఎప్పుడొచ్చినా రెండు, మూడు నెలలుండేవాడు. ఆయనను తన మిత్రులకు ( పీ వీ నర్సింహా రావు, పాములపర్తి సదాశివరావు, వానమామలై వరదాచార్యులు, గార్లపాటి రాఘవరెడ్డి మున్నగు వారికి) పరిచయం చేసారు కాళోజి. ఈ సాహితీ మిత్రులు అప్పుడప్పుడూ తన ఇంటికి వచ్చి ఫలహారం చేస్తూ, టీ తాగుతూ కవితల ప్రసంగాలు చేయడం తనకు ఒక విధమైన సంతోషం కలిగించేదని పేర్కొన్నారు కాళోజి.ఒకరోజుపిళ్ళావారు ఒక పద్యం చదువుతు న్నప్పుడు ‘అక్కడ యతి తప్పింది’ అని రాఘవరెడ్డి గారన్నారు. ‘యతి తప్పడ మేమిటి? ఇది వేంకటశాస్త్రి గారి ప్రయోగం!’ అని పిళ్ళా జవాబు. రాఘవ రెడ్డి గారు మృదుభాషి. నెమ్మదిగా ‘వేంకట శాస్త్రి గారు చేసినా తప్పే. తిరుపతి శాస్త్రి గారు చేసినా తప్పే. అయినా వేంకటశాస్త్రి గారు యిట్లాంటి ప్రయోగం చేసి వుండక పోవచ్చని’ అని అన్నారు.
చేసినారనికవి పిళ్ళా వాదన. ఆ సాయంత్రం ‘రాజరాజ నరేంద్ర భాషా నిలయం’ (లైబ్రరీ) కు పోయి వెదకి ఆ పద్యం కొందరు మిత్రులకు చూపించాడు పిళ్ళా. మరునాడు రాఘవరెడ్డికి ఈ విషయం తెలిపారు. ఐనా అది తప్పే అని రాఘవరెడ్డి అన్నారు. పిళ్ళా వెంకటరత్నం వేంకటశాస్త్రి గారికి వెంటనే రిప్లై కార్డ్ ‌రాశారు – ‘మీ ఫలానా సంపుటం లోని ఫలానా పద్యం యతి తప్పింది అని ఫలానా ఆయన అంటున్నాడు. నేను ఎంత వాదించినా లాభం లేదు. మీ అభిప్రాయం తెలియ చేయండి’ అని. అప్పటికే వృద్ధులైనవేంకటశాస్త్రి గారు వెంటనే జవాబు రాశారు ‘అవును,యతి తప్పింది’ అని.ఇంకా ‘మూడు, నాలుగు ప్రింట్‌ ‌లు ఐనా ఎవరూ తప్పు పట్ట లేదు. ఇటువంటి వాటిలో వాదన పెట్టుకోవద్దు. తప్పు తప్పే. మళ్లీ పుస్తకం ముద్రిం చినపుడు సరిదిద్దుకో!’ అని సలహా కూడా ఇచ్చారు వేంకటశాస్త్రి గారు.
– శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి
– పాములపర్తి నిరంజన్‌ ‌రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *