prajatantra_news

prajatantra_news

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ఉధృతి

శ్రీశైలం, ప్రజాతంత్ర, జులై 2: శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. జూరాల నుంచి శ్రీశైలానికి 83.224 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. అదే విధంగా జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం ప్రస్తుత నీటిమట్టం 875.2 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 164.7…

ప్రతీ విద్యార్థి ఇంటర్‌ పూర్తి చేయాలి

– 9-12 తరగతుల విధానంపై అధ్యయనం చేయండి – యంగ్‌ ఇండియాస్కూల్స్‌ ప్రగతిపై నివేదిక సమర్పించాలి – విద్యా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: పదో తరగతిలో ఉత్తీర్ణుడైన ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్‌ పూర్తి చేసేలా చూడాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. పదో తరగతిలో…

మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం

సిగాచి యాజమాన్యం ప్రకటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశామ్రికవాడలో సోమవారం జరిగిన తీవ్ర ప్రమాదంపై ఎట్టకేలకు సిగాచి రసాయన పరిశ్రమ యాజమాన్యం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందిస్తామని ప్రకటించింది. సిగాచి ప్రమాదంపై స్టాక్‌ మార్కెట్లకు కంపెనీ సెక్రటరీ వివేక్‌ లేఖ రాశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు…

పథకాల ఫలితాలు గుడిసె వరకు చేరాలి

– ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి అమలుకు కలెక్టర్లే మార్గదర్శకులు – 8 జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ మంత్రి పొంగులేటి సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం దార్శనికతతో తీసుకొచ్చిన భూభారతి చట్టం, ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసి వాటి ఫలితాలు పేదలకు అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని…

ఖర్గే సభను విజయవంతం చేయండి

పార్టీ నేతలకు డిప్యూటీ సీఎం పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఈనెల 4న ఏర్పాటు చేస్తున్న అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభను విజయవంతం చేయాలని గ్రామ శాఖ అధ్యక్షుడు మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు. ఖర్గే…

చేనేతల రుణ మాఫీకి పరిపాలన అనుమతులు

5691మందికి లబ్ధి : మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు రుణ మాఫీ చేసేందుకు రూ.33 కోట్లకు పరిపాలన అనుమతులు జారీ అయ్యాయని వ్యవసాయ శాఖ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో 5,691మంది చేనేత…

విపత్తు నిర్వహణ సంస్ధ పునర్వ్యవస్ధీకరణ

నదీపరివాహక ప్రాంత నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: ప్రకృతి వైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొని వీలైనంతవరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండేలా తెలంగాణ డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ అథారిటీ (తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్ధ)ని బలోపేతం చేస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్‌,…

రాజకీయ వేధింపులతోనే లఖ్మా అరెస్ట్‌

ఛత్తీస్‌గఢ్‌ మాజీ మంత్రికి మంత్రి సీతక్క పరామర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయపురలో జైలులో ఉన్న ఆ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మాజీ మంత్రి లఖ్మాను తెలంగాణ మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు, అనుచరులకు సంఫీుభావం తెలిపారు.…

యువత రాజకీయాల్లోకి రావాలి

మాక్‌ పార్లమెంట్‌ సెషన్‌లో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, నైతిక విలువలతో కూడిన, నీతిమంతమైన రాజకీయాలను ప్రవేశపెట్టాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష అని, అందుకే దేశవ్యాప్తంగా లక్షమంది యువతను రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రజాస్వామ్య…

విజన్‌-2047లో ఒక చాప్టర్‌గా హెల్త్‌ టూరిజం

ఏఐజీ హాస్పిటల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: తమ ప్రభుత్వం రూపొందిస్తున్న తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌లో హెల్త్‌ టూరిజం ఒక చాప్టర్‌గా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ ను హెల్త్‌ టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని, అందులో భాగంగానే డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడిని క్యాన్సర్‌ కేర్‌ సలహాదారుడిగా…