జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్..

దిల్లీ మద్యం పాలసీ  స్కాం కేసులో కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్  శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు  నుంచి విడుదలయ్యారు. దాదాపు అయిదున్నర నెలలపాటు ఆయన జైలులో ఉన్నారు. ఎట్టకేలకు సుప్రీం కోర్టు లో శుక్రవారం ఆయనకు ఊరట లభించింది.సీబీఐ,ఈడీ కేసుల్లో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించింది.

కేజ్రీవాల్‌కు బెయిల్ వొచ్చిందనే సంబరాల నడుమ.. ఆప్ నేతలుకార్యకర్తలు తిహార్ జైలుకు భారీగా చేరుకున్నారు. ఆయన బయటకు రాగానే పూలదండలతో స్వాగతం పలికారు. స్వీట్లు పంచుకుని, పటాకులు  పేల్చి సంబరాలు చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *