ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు రాధాకిషన్‌ రావుకు ఏడు రోజుల పోలీస్‌ కస్టడీ

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఏప్రిల్‌3: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ టాస్క్‌ ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును ఏడు రోజుల పోలీసు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గురువారం 4వ తేదీ నుంచి ఈనెల 10వ తేదీ వరకు పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. ఈ మేం కు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును ఏడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆయన్ను ఏ4గా చేర్చారు.

ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు ఆదేశాలతో భవ్య సిమెంట్‌ యజమాని ఆనంద్‌ ప్రసాద్‌ నుంచి రూ.70 లక్షలు సీజ్‌ చేసినట్లు రాధాకిషన్‌రావు విచారణలో వెల్లడిరచారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్‌రావు, ఆయన బంధువుల నుంచి రూ.కోటి సీజ్‌ చేశామని అంగీకరించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా  కోమటిరెడ్డి  రాజగోపాల్‌ రెడ్డికి చెందిన రూ.3.50 కోట్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. 2016లో ఓ వర్గానికి చెందిన అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *