రాష్ట్ర వ్యాప్తంగా భానుడి భగభగ

గరిష్ట ఉష్ణోగ్రతల నమోదు.. ఆదిలాబాద్‌ ‌జిల్లాలో అత్యధికంగా 45.7 డిగ్రీలు
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌భానుడు భగభగమంటూ నిప్పులు చెరుగుతున్నాడు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్‌ ‌జిల్లా జైనద్‌లో 45.7, జగిత్యాల జిల్లా ఐలాపూర్‌లో 45.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇవేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మరో పది జిల్లాల్లో 44.8 నుంచి 43.9 డిగ్రీల వరకు నమోదయ్యాయని అన్నారు. గురు, శుక్ర వారాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ప్రజలు అమ్రత్తంగా ఉండాలని సూచించింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రాష్ట్రంలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా 48 గంటల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page