“నీతిబద్ధమైన రాజకీయాల యుగం గతించింది. ఇప్పుడు మనం కపట నటన యుగంలో ఉన్నాం.దేశభక్తులన్న వాళ్లు నిజాయితీని విడిచి చతురత అలవరచుకున్నారు. ఇక మనమో మనమో తెలివి తెచ్చుకొని వాళ్లును నమ్మడం మానివేశాం’’ అని కౌపర్” — ఈ వాక్యం 1987లో యం.యస్. ఆచార్య రాసిన సంపాదకీయానికి ఆరంభం. దాదాపు నలభై సంవత్సరాల తర్వాత ఈ వాక్యాన్ని చదివితే, అది నేటి భారత రాజకీయాలనే వర్ణిస్తున్నట్లు అనిపించడం యాదృచ్ఛికం కాదు.”
60 జనధర్మో విజయతే
31-12-1987 నాటి యం. యస్. ఆచార్య సంపాదకీయం ఒక చారిత్రక సందర్భంలో రచించారు. ఆ సమయంలో ఆయన ప్రధాన వాదన కాంగ్రెస్ శతాబ్ది ఉత్సవాలను జరుపుకునే హక్కు కాంగ్రెస్(ఐ)కే పరిమితం కాదని, స్వాతంత్ర్యోద్యమ వారసత్వం భారత ప్రజలందరికీ చెందుతుందని. అదే సమయంలో, శతాబ్ది ఉత్సవాల సందర్భాన్ని ఉపయోగించుకుని కాంగ్రెస్ను విమర్శించడం మాత్రమే చేసి, తమ ప్రత్యామ్నాయ దిశను చూపించని ప్రతిపక్షాల వైఖరిని ఆయన ప్రశ్నించారు.
గుత్త హక్కుకాదు
1985లో భారత జాతీయ కాంగ్రెస్ తన శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఆ సందర్భంగా కాంగ్రెస్(ఐ)కు ఆ చారిత్రక వారసత్వాన్ని సొంతం చేసుకునే హక్కు లేదని అనేక ప్రతిపక్షాలు విమర్శించాయి. దానికి సమాధానంగా ఆచార్య ఒక మౌలిక సత్యాన్ని గుర్తు చేశారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న కాంగ్రెస్ ఒక పార్టీ మాత్రమే కాదు; అది ఒక జాతీయ ఉద్యమం. అందువల్ల ఆ వారసత్వం ఏ ఒక్క నాయకుడిదీ కాదు, ఏ ఒక్క వర్గానిదీ కాదు, మొత్తం భారత ప్రజలది.
ఈ ఆలోచన నేటికీ విలువైనదే. అయితే ఒక ప్రశ్నను నేడు మనం కూడా అడగాలి. స్వాతంత్ర్యోద్యమ కాంగ్రెస్కు వారసురాలినని చెప్పుకునే నేటి కాంగ్రెస్, ఆ ఉద్యమం నిలబెట్టిన విలువలకు వారసురాలిగా నిలుస్తోందా?
అంధభక్తి, వ్యక్తి పూజ వద్దు
స్వాతంత్ర్య సమర కాంగ్రెస్కు నాయకత్వం వహించిన గాంధీ, నెహ్రూ, పటేల్, రాజాజీ, ఆజాద్, ప్రకాశం, రాజేంద్ర ప్రసాద్ వంటి నాయకులు వ్యక్తుల కంటే సంస్థలను గొప్పవిగా భావించారు. విభేదాలు ఉన్నా, చర్చను వదల్లేదు. వ్యక్తి పూజకు బదులు సిద్ధాంతాలను నిలబెట్టడానికి ప్రయత్నించారు.
నేటి కాంగ్రెస్లో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. సంస్థ కంటే కుటుంబం, సిద్ధాంతం కంటే ఎన్నికల వ్యూహం, అంతర్గత ప్రజాస్వామ్యం కంటే అధిష్ఠాన నిర్ణయాలే ప్రధానంగా మారాయని విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. రాష్ట్ర నాయకత్వం బలహీనపడటం, స్థానిక నాయకులు ఎదగలేకపోవడం, పార్టీకి ప్రత్యామ్నాయ దిశ కనిపించకపోవడం ఇవన్నీ ఆ విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి.
అయితే ఆచార్య విమర్శ కేవలం కాంగ్రెస్పైనే కాదు. ఆయన ప్రతిపక్షాలను కూడా ప్రశ్నించారు. “మీరు కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం అంటున్నారు. అయితే మీ ప్రత్యామ్నాయం ఏమిటి?” అనే ప్రశ్న అప్పట్లో ఎంత సముచితమో, నేడు కూడా అంతే సముచితంగా ఉంది.
ఇప్పుడు కూడా అనేక రాజకీయ పార్టీలు అధికార పార్టీని విమర్శించడం వరకు మాత్రమే పరిమితమవుతున్నాయి. రాజ్యాంగ పరిరక్షణ, సమాఖ్య వ్యవస్థ, ఎన్నికల సంస్కరణలు, పారదర్శక పాలన, రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం వంటి అంశాలపై స్పష్టమైన ప్రత్యామ్నాయ కార్యాచరణను ప్రజల ముందుంచడంలో విఫలమవుతున్నాయి.
1987లో ఆచార్య రాసిన మరో ముఖ్యమైన వాక్యం మనల్ని ఆలోచింపజేస్తుంది. స్వాతంత్ర్యం తెచ్చిన జాతి పట్ల కృతజ్ఞత ఉండాలి; కానీ ఆ కృతజ్ఞత అంధభక్తిగా మారకూడదు. చరిత్రను గౌరవించడం అంటే చరిత్రను రాజకీయ లాభాల కోసం ఉపయోగించడం కాదు.
నేడు కాంగ్రెస్ తన స్వాతంత్ర్య సమర వారసత్వాన్ని గుర్తు చేస్తుంది. అధికార పార్టీ జాతీయతను తన ప్రధాన రాజకీయ మూలధనంగా ప్రదర్శిస్తుంది. రెండు వైపులా చరిత్ర రాజకీయ ఆయుధంగా మారింది. కానీ చరిత్ర ఒక పార్టీ ఆస్తి కాదు. అది భారత ప్రజల ఉమ్మడి జ్ఞాపకం.
ఆచార్య చివర్లో పేర్కొన్న సామాజిక దుర్గుణాల జాబితా — ఈర్ష్య, కృతఘ్నత, వ్యక్తిపూజ, మానసిక బానిసత్వం, ఆత్మన్యూనత, క్రమశిక్షణా రాహిత్యం — ఇవి నేడు రాజకీయాల్లో మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటికి తోడు సోషల్ మీడియా దుష్ప్రచారం, తప్పుడు సమాచార ప్రచారం, రాజకీయ ధ్రువీకరణ, వ్యక్తి కేంద్రిత రాజకీయాలు కొత్త సవాళ్లుగా చేరాయి.
అయితే 1987తో పోలిస్తే నేటి భారతదేశానికి ఒక అదనపు బాధ్యత ఉంది. అప్పట్లో కాంగ్రెస్ శతాబ్ది గురించి చర్చ జరిగింది. ఇప్పుడు మనం భారత రాజ్యాంగ శతాబ్దం (2050) వైపు ప్రయాణిస్తున్నాం. ఇక ప్రశ్న ఒక పార్టీ వారసత్వం గురించికాదు; రాజ్యాంగ వారసత్వాన్ని ఎవరు కాపాడతారు? అనేదే అసలు ప్రశ్న.
స్వాతంత్ర్యోద్యమం భారతదేశానికి రాజకీయ స్వేచ్ఛను ఇచ్చింది. రాజ్యాంగం ఆ స్వేచ్ఛకు న్యాయబద్ధతను, సమానత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఇచ్చింది. ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ప్రాంతీయ పార్టీలు అయినా, తమ చారిత్రక హక్కులను చెప్పుకోవడం కంటే రాజ్యాంగబద్ధ బాధ్యతలను నిర్వర్తించడమే గొప్పది.
యం.యస్. ఆచార్య 1987లో వేసిన ప్రశ్నలు నేటికీ సమాధానాల కోసం ఎదురుచూస్తున్నాయి. రాజకీయ పార్టీలు చరిత్రను ఎవరి పేరుతో జరుపుకుంటున్నాయన్నది అంత ముఖ్యంకాదు. ఆ చరిత్ర నేర్పిన విలువలను ఎవరు ఆచరిస్తున్నారు? అన్నదే భారత ప్రజాస్వామ్య భవిష్యత్తును నిర్ణయించే అసలు ప్రశ్న. అదే ఆచార్య సంపాదకీయానికి నేటి కాలంలోనూ నిలిచిపోయే భావన సందర్భోచితంగా ఉంది.
వరంగల్ వాణి 31-12-1987నాటి ఘాటైన యం యస్ ఆచార్య సంపాదకీయం
శతాబ్ది ఉత్సవాల దిగ్విజయంపై ఈర్ష్యా?
కాంగ్రెస్(ఐ) కాంగ్రెస్ శతాబ్ది ఉత్సవాలు జరుపుతుండటాన్ని చాలా మంది ఆక్షేపించారు. కాంగ్రెస్`ఐ అసలు జాతీయ కాంగ్రెస్ కానేకాదు పొమ్మన్నారు కొందరు, జాతీయ కాంగ్రెస్ విభిన్న రాజకీయ సిద్ధాంతాలు విధానాలు, గల అనేక మంది కూడా రాజకీయ వేదిక కనుక శకాబ్ది ఉత్సవాలు జరపడం కాంగ్రెస్`ఐకి గుత్తా కాదు. అని కూడ అన్నారు.. ఇటువంటి వారిలో కాంగ్రెస్`ఎస్ నాయకుడు శ్రీ శరద్ పవార్ కూడ ఉండటం విశేషం..
నిజానికి జాతీయ కాంగ్రెస్`ఐ ఒక్క వ్యక్తికి ఏ ఒక వర్గానికి చెందిన సొత్తు కాదు గుత్తా కూడ కాడు. ఈ వాదన సరైందే ననుకుంటే కాంగ్రెస్`ఐకి శతాబ్ది ఉత్పవాలు జరిపే హక్కు లేకుండా పోదు. కాగా కాంగ్రెస్`ఐకి కూడ అటువంటి హక్కు ఉన్నది అని ధృవపడుతుంది.
ఆ విధంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సాగిన స్వాతంత్య్ర సమరంలో యావద్భారత ప్రజలు పాల్గొన్నారు. కొందరు ప్రత్యక్షంగా మిగిలిన వారు పరోక్షముగా, ప్రత్యక్ష పరోక్ష సంబంధం గల అందరికి కాంగ్రెస్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకొనే హక్కు జనిపించే హక్కు జరుపుతుంటే పాల్గొనే హక్కు కూడ ఉంది.
భారత దేశాన్ని రెండు ఖండాలుగా చీల్చడానికి మూలపురుషుడైన జనాబ్ మహమ్మద్ అలీ జిన్నా కూడ ముస్లింలీగ్ పెట్టకముందు జాతీయ కాంగ్రెస్లోనే ఉన్నారు.
దేశ స్వాతంత్య్రానంతరం జన్మించిన వారిని మినహాయించి తతిమ్మా ప్రజలు కమ్యూనిస్టులు, సోషలిస్టులు వగైరా వేర్వేరు పార్టీలుగా చీలిపోక పూర్వం జాతీయ కాంగ్రెసువారే.
ఇటువంటి పార్టీలవారు సమిష్టిగా గాని వ్యష్టిగా గాని కాంగ్రెస్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవచ్చు. అటువంటి ఉత్సవాల వేదిక నుండి నాటి కాంగ్రెస్ ఘనతనూ, కాంగ్రెస్ నాటీ నాయకుల మంచి చెడులను, తాము ఎందువల్ల కాంగ్రెస్ నుండి విడిపోయి వేరే పార్టీ పెట్టిలో కూడ వివరించవచ్చు. అంతేకాదు కాంగ్రెలో తాము ఉన్న నాడు ఏ మంచి జరుగుతుండెనో తాము విడిపోయి పెట్టిన వేరే పార్టీ ద్వారా అదే మంచిని తాము ఏ విధంగా కొనసాగిస్తుందిరో కూడా విశదం చేయవచ్చు.
కాని వీరంతా అటువంటిదేమి తలపెట్టటం లేదు.
కాంగ్రెస్`ఐ కి గుత్తాకాదనీ, కాంగ్రెస్`ఐ వారికాఅర్హత లేదనీ అలాగే అనేకానేక ఆరోపణలతో కుళ్లుబోతుతనాన్ని కొన్నాళ్లుగా ఒక వైపు వెదజల్లుతున్న వీరంతా తమను ప్రతిపక్షాలుగా వర్ణించుకుంటారు. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తామేనని ప్రకటించుకుంటున్నారు. శతాబ్ది ఉత్సవాల వేదికపైన ప్రతిపక్షాలను విమర్శించినందుకు కినుక వహిస్తారు. ఎందుకు?
తండ్రి వంశం గూర్చి లేదా తల్లి పంశం గూర్చి గాని వివరాలు తెలియని కొంత మంది కాంగ్రెసునూ, కాంగ్రెస్`ఐని, తమ కామెర్ల కళ్ళతో వర్ణించి ఎద్దేవా చేస్తూ వ్రాస్తున్న వ్యాసాలు, లేఖలకో, తమ విజ్ఞానాన్ని ప్రసారం చేసుకుంటున్నారు.
12 వందలేళ్ల తరతరాల బానిసత్వం నుండి విముక్తుల్ని చేసినందుకు పది తరాలు గడచిన తీర్చలేని ఋణధారం అది.
బావిలో పడిన తనను వెలికితీయ వచ్చే వాడిని కరిచేతత్వం’’
‘‘విశృంఖలత, క్రమశిక్షణా రాహిత్యం, తనను గూర్చి తనకే తెలియని అజ్ఞానం. బావిలో పడిన తనను వెలికితీయ వచ్చే వాడిని కరిచేతత్వం’’ మానసిక దాస్యం, పొరుగింటి పుల్లకూర రుచితత్వం, ఆత్మన్యూనతాభావం, అసమర్థ, దుర్జసత్వం, ఈర్ష్యాద్వేషాలు, కృతఘ్నత- ఇంకా ఇటువంటి సవాలక్ష దుర్గుణ భూయిష్టమై అందితే జుట్టు లేదా కాళ్లు పట్టే నీచతత్వం గల ఏ జాతి, ఏ వ్యక్తి కూడ ఏ దేశంలోనూ బాగుపడలేదు.
మన దేశంలో అటువంటివి లేవు కనుక మనకు భవిష్యత్తు ఉన్నదని సమ్ముతూ ముందుకు పోదాం.
ఈ అంశాన్నే శతాబ్ది ఉత్సవాలకు హాజరైన లక్షలాది మంది నిరూపించారు.





