ఎస్సీ బాలికల హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య

కామారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 8: జిల్లాలోని బాన్సువాడ ఎస్సీ బాలికల హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య  కలకలం రేపుతుంది. హాస్టల్‌ ‌గదిలో ఇంటర్‌ ‌విద్యార్థిని అమృత ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మద్నూర్‌ ‌మండలం లక్ష్మాపూర్‌ ‌గ్రామానికి చెందిన అమృత హాస్టల్‌లో ఉంటూ ఇంటర్‌ ‌బైపీసీ ఫస్ట్ ఇయర్‌ ‌చదువుతుంది. జ్వరం ఉందని కాలేజీకి వెళ్లకుండా ఉదయం హాస్టల్‌లోనే ఉండిపోయింది. మధ్యాహ్నం వచ్చిన తోటి విద్యార్థినిలు అమృత ఆత్మహత్య విషయాన్ని హాస్టల్‌ ‌సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో వారు పోలీసులకు, విద్యార్థిని కుటుంబ సభ్యులకు వివరించారు. కుటుంబ సభ్యులు హాస్టల్‌కు చేరుకుని ఆందోళన నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *