ఎస్టీ రిజర్వేషన్లు ఇందిరమ్మ పుణ్యమే

– అభివృద్ధిని ఓర్వేలేకపోతున్న బావ‌-బామ్మర్దులు
– ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్రను ప్రారంభించిన పీసీసీ చీఫ్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 25 : ఇం‌దిరాగాంధీ.. ఎస్టీ రిజర్వేషన్‌ ఇవ్వకపోయి ఉంటే నేడు లంబాడీలు, ఎరుకల, యానాదిలు ఈ స్థాయిలో ఉండేవాళ్లు కాదని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు. లంబాడీల బాగు కోసం పనిచేసే ప్రభుత్వం తమది అని స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ గుడిసెలు లేని గ్రామాలు కావాలని అనుకున్నారని.. ఆ దిశగానే తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్‌ ‌గిరిజన నేతలు చేపట్టిన ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్రను టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్‌, ‌హరీశ్‌రావు శకం గతమని.. అధికారం పోయిందన్న అక్కసుతో వారిద్దరూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి.. బావాబామ్మర్దులకు నచ్చడం లేదని మహేష్‌ ‌విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు తగ్గకుండా మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. 1 లక్ష 78 వేల కోట్ల
రూపాయల విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చామని తెలిపారు. ఫ్యూచర్‌ ‌సిటీని మొదలు పెట్టి 5 లక్షల 78 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పారు. బస్సు యాత్ర ముగింపు కార్యక్రమానికి ప్రియాంక గాంధీని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ ‌లంబాడ ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *