ఎస్‌.ఎల్‌.‌బి.సి టన్నెల్‌ ‌పూర్తికి సిద్ధంగా ..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్‌ ‌లో ఉన్న ప్రాజెక్ట్ ‌ల పూర్తికి ప్రణాళికలు:మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి
:ఎస్‌.ఎల్‌.‌బి.సి టన్నెల్‌ ‌పూర్తికి ప్రభుత్వం సిద్ధంగా ఉందిఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్‌ ‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్ట్ ‌ల పూర్తికి ప్రణాళికలుఇకపై శరవేగంగా పనులు కొనసాగుతాయన్నారు. నల్లగొండ-నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లాల సరిహద్దుల్లోని మన్నెం వారిపల్లె లో మీడియా సమావేశం లో మాట్లాడారు.ఉచితంగా శ్రీశైలం నుండి వచ్చే గ్రావిటీని వదిలిపెట్టి కేసీఆర్‌ ఎత్తిపోతల పథకాలపై ఎందుకు దృష్టి పెట్టారో తెలియడం లేదు3,500 కోట్లు ఖర్చు పెడితే ఎస్‌.ఎల్‌.‌బి.సి ఏనాడో పూర్తి అయి ఉండేదన్నారు.

 

ఇది పూర్తి అయితే శ్రీశైలం నుండి 30 టి.యం.సి ల నీరు నల్లగొండ జిల్లాకు చేరి ఉండేదిఎస్‌.ఎల్‌.‌బి.సి ని వదిలిపెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌కు లక్ష కోట్లు,పాలమూరు-రంగా రెడ్డి ఎత్తిపోతల పథకానికి 25,000 కోట్లు,సీతారాంసాగర్‌ ‌ప్రాజెక్ట్ ‌కు 10,000 కోట్లు ఖర్చు పెట్టారన్నారు.పదేళ్లు పాలించిన వారి నిర్వాకం తోటే ఈ ప్రాజెక్ట్ ‌ముందుకు సాగలేదుఇదే పూర్తి అయితే నల్లగొండ జిల్లాలో నాలుగు లక్షల పై చిలుకు పంటపొలాలు సస్యశ్యామలంగా మారెవి.సుమారు 700 గ్రామాలకు సురక్షితమైన త్రాగు నీరు అంది ఉండేదన్నారు.ఎస్‌.ఎల్‌.‌బి.సి ప్రాజెక్ట్ అద్భుతమైన డిజైన్‌ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఉచితంగా శ్రీశైలం నుండి గ్రావిటీ సై చేపట్టిన ప్రాజెక్టు ఇదిగ్రావిటీ మీద నడిచే ఈ ప్రాజెక్ట్ ‌ను కేసీఆర్‌ ఎం‌దుకు నిర్లక్ష్యం చేశారో అర్ధం కావడం లేదన్నారు.గ్రావిటీని వదిలి పెట్టి ఇతర ప్రాజెక్ట్ ‌లపై కేసీఆర్‌ ‌లక్షల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు.

టన్నెల్‌ ‌పూర్తికి సరిపడా నిధులు విడుదల చేస్తాం
ఎస్‌. ఎల్‌.‌బి.సి టన్నెల్‌ ‌పూర్తికి ప్రభుత్వం సన్నద్ధమౌతుందని రాష్ట్ర  నీటి పారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్‌. ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.ఇకపై శరవేగంగా పనులు పూర్తి చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ సంకల్పం అని ఆయన పేర్కొన్నారు.శుక్రవారం రోజు శాసనమండలి చైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి  మల్లు భట్టివిక్రమార్క,రోడ్లుభవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి లతో కలసి నల్లగొండ-నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లాల సరిహద్దుల్లో ఉన్న మన్నెంవారి పల్లెలో ఎస్‌. ఎల్‌.‌బి.సి టన్నెల్‌ ‌పనులను ఆయన పరిశీలించారు.అనంతరం ఉమ్మడి నల్లగొండ-ఉమ్మడి పాలమూరు జిల్లాల ప్రజాప్రతినిధులతో టన్నెల్‌ ‌పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.సమీక్ష సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలో పెండింగ్‌ ఉన్న ప్రాజెక్ట్ ‌ల పనులను శరవేగంతో త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.అందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకున్నట్లు ఆయన వెల్లడించారు.

 

పదేళ్ల కేసీఆర్‌ ‌పాలన నిర్వహకమే ఎస్‌.ఎల్‌.‌బి.సి పూర్తి కాకపోవడానికి కారణమైందని ఆయన ఆరోపించారు.సవరించిన అంచనాల ప్రకారం పనులు పూర్తి చేస్తే 3,500 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తి అయి ఉండేదని ఆయన అన్నారు.ఉచితంగా శ్రీశైలం నుండి గ్రావిటీ ద్వారా పూర్తయ్యే దీనిని వదిలి పెట్టి ఎత్తిపోతలు అంటూ కాళేశ్వరం మీద లక్ష కోట్లు,సీతారామ సాగర్‌ ‌ప్రాజెక్ట్ ‌కు పదివేల కోట్లు,పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు అంటూ 25 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు.అదే 3,500 కోట్లు ఖర్చు పెట్టి ఎస్‌.ఎల్‌.‌బి.సిని పూర్తి చేసినట్లయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలు సస్యశ్యామలం అయ్యేవన్నారు.అంతే గాకుండా 700 పై చిలుకు గ్రామాలకు సురక్షిత త్రాగునీరు అందేదని ఆయన తెలిపారు.అటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్ ‌ను ఎందుకు కేసీఆర్‌ ‌విస్మరించారు అన్నది ఇప్పటికీ భోద పడడం లేదన్నారు.ఎస్‌.ఎల్‌.‌బి.సి ని పూర్తి చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ ముందున్న కర్తవ్యమని…సరిపడా నిధులు కేటాయించి సకాలంలో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page