పాత దరఖాస్తుల బదిలీకి అవకాశం

– హౌసింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గౌతమ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : హౌసింగ్ బోర్డు చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ సొంతింటి పథకానికి సంబంధించి 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి మరో వెసులుబాటు కల్పించినట్లు బోర్డు వైస్ చైర్మన్, కమిషనర్ వి.పి.గౌతమ్ తెలిపారు. గతంలో 16 నియోజకవర్గాల్లో ఏదైనా ఒక నియోజకవర్గం కింద దరఖాస్తు చేసుకుని ప్రస్తుతం ఎల్‌బీ నగర్, గోషామహల్, ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో నివసిస్తుంటే తమ పాత దరఖాస్తును ఈ నియోజకవర్గాలకు బదిలీ చేసుకోవచ్చని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ పాత దరఖాస్తు వివరాలతో హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోని https://tghb.telangana.gov.in/cure-status లింక్ ద్వారా ఈనెల 20లోగా దరఖాస్తు బదిలీ కోసం అభ్యర్థించాలని గౌతమ్ సూచించారు. అభ్యర్థి ప్రస్తుతం నివసిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే దరఖాస్తు బదిలీ జరుగుతుందని, ఈ బదిలీ నివాస ధ్రువీకరణతో పాటు ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించిన అన్ని అర్హతలు, నిబంధనల పరిశీలనకు లోబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం అభ్యర్థులు కొత్తగా లేదా ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించరాదన్నారు. దరఖాస్తు బదిలీ చేయడం వల్ల ఇంటి కేటాయింపుపై ఎలాంటి హక్కు ఏర్పడదని, దరఖాస్తుల పరిశీలన, అర్హత నిర్ధారణ, నిర్దేశించిన కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే అర్హులైన వారికి ఇళ్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు మధ్యవర్తులను ఆశ్రయించవద్దని, ఎవరికీ ఎలాంటి నగదు చెల్లించవద్దని గౌతమ్ కోరారు. అధికారిక సమాచారం తెలంగాణ హౌసింగ్ బోర్డు అధీకృత మార్గాల ద్వారా మాత్రమే తెలియజేస్తామన్నారు. మరిన్ని వివరాలకు https://tghb.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా తెలంగాణ హౌసింగ్ బోర్డు కాల్ సెంటర్ నంబర్ 040-24603572ను సంప్రదించవచ్చునన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *