హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా శాసనసభ ఆవరణలో జాతీయ జెండాను శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం ఆవిష్కరించారు. తొలుత జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనమండలి కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి, లెజిస్లేచర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర సచివాలయంలో జాతీయ పతాకాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆవిష్కరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





