– కేంద్ర మంత్రి బండి
హైదరాబాద్, ప్రజాతంత్ర,జులై 25 : ‘పదవులు తాత్కాలికం, ప్రజల విశ్వాసమే అంతిమం’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు నడవడమే ప్రజాస్వామ్యమని చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఆయన స్పందించారు. తమకు పార్టీ కంటే.. దేశమే ప్రధానమన్నారు. ‘ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం అంటే.. ప్రజల గొంతు వినడం, వారి మాటను గౌరవించడం, అవసరమైతే బాధ్యత తీసుకునే ధైర్యాన్ని కలిగి ఉండటం. భాజపా దాన్నే పాటిస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పార్టీ విలువలను ప్రతిబింబిస్తుంది. ఇన్నేళ్లపాటు దేశసేవలో భాగమైనందుకు ధర్మేంద్ర ప్రధాన్కు ధన్యవాదాలు‘ అని ఎక్స్లో పోస్టు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





