ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

– వాతావరణశాఖ భారీ రెయిన్‌ అలర్ట్ ‌జారీ
– అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 26: ‌నైరుతి రుతుపవనాలు ఏపీలో విస్తరిస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  పలు జిల్లాల్లో భారీ వానలు పడగా అమరావతి వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన జారీ చేసింది. వర్షాలు పడే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని పేర్కొంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడ్రోజుల పాటు భారీ వర్షాలకు ఛాన్స్ ఉం‌దని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈనెల‌ 26, 278‌ తేదీల్లో మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ ‌భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఇక 27,28‌వ తేదీల్లో ఆదిలాబాద్‌, ‌నిర్మల్‌, ‌నిజామాబాద్‌, ‌వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌, ‌వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయని తెలిపింది. 28,29‌వ తేదీల విషయానికొస్తే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *