తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామంటూ మోసం

– గోల్డ్‌మ్యాన్‌ ‌సూర్యభాయ్‌పై పోలీస్‌ ‌కేసు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 26: ‌గోల్డ్ ‌మ్యాన్‌ ‌సూర్య భాయ్‌పై కేసు నమోదు అయ్యింది. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ ఆరోపణలు రావడంతో సూర్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి, హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌లకు సన్నిహితుడి నంటూ నమ్మించాడని, తక్కువ ధరకే విదేశీ బంగారం ఇస్తామంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించాడంటూ బాధితులు వాపోయారు. అటు బంగారం ఇవ్వక, డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు సూర్య భాయ్‌ ఇం‌టికి వెళ్లారు. దీంతో తన దగ్గర ఉన్న మూడు ఐఫోన్లను ఇచ్చి వీటి విలువ రూ.10 లక్షలు ఉంటుందని చెప్పడంతో పాటు రూ.20 లక్షల చెక్‌ ఇచ్చి పంపించాడు. అయితే, బాధితులు వెళ్లిపోయాక వారిపైనే అత్తాపూర్‌ ‌పోలీసులకు సూర్య ఫిర్యాదు చేశాడు. తనను బెదిరించి తన ఫోన్లు లాక్కెళ్లారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయాన్ని రాబట్టారు. బంగారం కోసం హిమాయత్‌నగర్‌, ‌నీలోఫర్‌లో సూర్య భాయ్‌కు బాధితులు రూ.30 లక్షలు ఇచ్చినట్లు విచారణలో బయటపడింది. దీంతో అత్తాపూర్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేసిన పోలీసులు.. కేసును నారాయణగూడకు బదిలీ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *