మాజీ మంత్రి హరీశ్ రావు కృషి…

 

“జోర్డాన్ లో అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్న తమను ఆదుకొని, స్వదేశానికి తిరిగి వచ్చేలా చేసిన  బీఆర్ఎస్ పార్టీకి, ఖర్చులు భరించిన  మాజీ మంత్రి హరీష్ అన్నకు  ధన్యవాదాలు..” సొంతుళ్లకు చేరుకున్న 12 మంది జోర్డాన్ వలస కార్మికులు

ఉపాధి నిమిత్తం జోర్డాన్ వెళ్లి వివిధ కారణాలతో అక్కడే చిక్కుకున్న 12 మంది వలస కార్మికులు ఎట్టకేలకు సొంతూళ్లకు చేరుకున్నారు. తెల్లవారు జామున హైదరాబాద్ చేరుకున్న వలస కార్మికులు మాజీ మంత్రి హరీశ్ రావు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియచేసారు.
జోర్డాన్ లో అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్న తమను ఆదుకొని, స్వదేశానికి తిరిగి వచ్చేలా చేసారని బీఆర్ఎస్ పార్టీకి, హరీశ్ రావు కు ధన్యవాదాలు తెలిపారు. తాము తిరిగి తెలంగాణకు వచ్చేందుకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు. కాంగ్రెస్, బిజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లినప్పటికీ ఎవరూ స్పందించలేదని చెప్పుకొచ్చారు.
తమను తిరిగి స్వస్థలాలకు తీసుకువచ్చిన బిఆర్ఎస్ పార్టీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని ఆనందం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా హరీశ్ రావు వారి కుటుంబ పరిస్థితులు, జోర్డాన్ లో వార్డు ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి అడిగి తెలుసుకున్నారు.
కడుపు నిండా తిండి కూడా లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కున్నామని జోర్డాన్ లో అనుభవించిన బాధలు చెప్పుకుంటూ కంట నీరు పెట్టుకున్నారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా హరీశ్ రావు వారికి భరోసా ఇచ్చారు. తెలంగాణలో ఉండి ఉపాధి, ఉద్యోగ మార్గాలు ఆలోచించాలని సూచించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లోని తమ తమ సొంతూళ్లకు వలస కార్మికులు పయనమయ్యారు..

*మాజీ మంత్రి హరీశ్ రావు కృషి
తెలంగాణ తొలి ముఖ్య మంత్రి, బిఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో జోర్డాన్ లో చిక్కుకున్న 12 మందిని స్వదేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు కృషి చేశామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు.
12 మంది వలస కార్మికుల సమస్య తెలియగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాం.,స్పందించి వారికి సాయం అందించాలని కోరాం అని పేర్కొంటూ మరోవైపు జోర్డాన్ లోని ఇండియన్ ఎంబసీ ఆఫీస్ కు వెళ్లి కార్మికులు అనేక సార్లు మొరపెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసారు. అయినా స్పందన లేదు అని తెలిపారు. అందుకే జోర్డాన్ లో చిక్కుకున్న12 మంది కోసం పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకురావడం జరిగిందనీ..ఇప్పటికైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతో మంది ఉపాధి నిమిత్తం వివిధ దేశాల్లో అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూన్నారు. మన పిల్లల్ని మనం కాపాడుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు.
జోర్డాన్ వలస కార్మికుల సమస్య తన దృష్టికి రాగానే దాదాపు రెండు వారాల నుండి వారినీ స్వదేశానికి రప్పించేందుకు హరీశ్ రావు కృషి చేశారు. ఒకవైపు జోర్డాన్ వలస కార్మికుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా మీడియా దృష్టికి తీసుకువెళ్లిన హరీశ్ రావు , మరోవైపు బిఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి ద్వారా భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. ఇంకోవైపు సంబంధిత కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో పెనాల్టీ చెల్లించి వారిని తెలంగాణకు తీసుకు వెళ్లేందుకు కంపెనీ ఒప్పుకున్నది. వలస కార్మికుల ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా చెల్లించాల్సిన మొత్తంతో పాటు, స్వదేశానికి రావడానికి అయ్యే విమాన టికెట్లను సైతం స్వయంగా హరీశ్ రావు భరించారు. ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్న వారిని ప్రత్యేక వాహనాల్లో సొంతుళ్లకు తరలించారు. ప్రస్తుతం వాళ్లు ఇంటికి చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page