యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్ 4: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నిత్యాన్నదానం పథకానికి ఓ భక్తుడు భారీ విరాళం ఇచ్చారు. రూ.8 లక్షలను, గరుడ ట్రస్ట్కు రూ.2 లక్షలు మొత్తం రూ.10 లక్షల చెక్కులను ఆలయ ఇన్చార్జి ఈవో రవికి హన్మకొండ వాస్తవ్యుడు ఏపూరు శ్రవణ్ కుమార్ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి లడ్డు ప్రసాదాలను అందజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





