కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున్ఖర్గే
న్యూదిల్లీ,డిసెంబర్ 19 : బీజేపీ ఎంపీలు నెట్టివేయడం వల్ల.. తాను కూడా కింద కూలినట్లు కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. బీజేపీ ఎంపీలు మకర ద్వారం వద్ద తనపై భౌతిక దాడి చేసినట్లు ఆరోపించారు. ఆ సమయంలో తన మోకాళ్లకు గాయమైనట్లు పేర్కొన్నారు. ఆ ఘటన పట్ల దర్యాప్తు చేపట్టాలని ఆయన స్పీకర్ను కోరారు.





