– సంచలన తీర్పు వెలువరించిన పోక్సో కోర్టు
తిరునల్వేలి, సెప్టెంబర్ 8 : మైనర్పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో తమిళనాడులోని తిరునల్వేలి పోక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఒక దోషికి మరణశిక్ష విధిస్తూ, మరో ఇద్దరికి కఠిన కారాగార శిక్షలను ఖరారు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే, 2022లో తిరునల్వేలికి చెందిన 16 ఏళ్ల బాలికకు ఓ ప్రార్థనా స్థలంలో విలాతికుళానికి చెందిన పెయింటర్ మునీశ్వరన్ (25) పరిచయమయ్యాడు. ఫోన్ నంబర్లు మార్చుకున్నాక వారిద్దరూ సుమారు రెండు వారాల పాటు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన మునీశ్వరన్, సదరు బాలికను తన ద్విచక్ర వాహనంపై మీనాక్షిపురంలోని తన సోదరి నివాసానికి తీసుకెళ్లి, అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం మునీశ్వరన్ తన స్నేహితులైన చిన్నకుట్టి (28), మురుగేశన్ (23)లను అక్కడికి పిలిపించాడు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం, వారు కూడా బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టారు. ఈ దారుణం గురించి బాధితురాలు తన తల్లిదండ్రులకు తెలపడంతో, వారు పాళయంకోట్టై మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సురేశ్ కుమార్ మంగళవారం తుది తీర్పు వెలువరించారు. నిందితుడు చిన్నకుట్టికి మరణశిక్ష విధించగా, మురుగేశన్కు 20 ఏళ్లు, మునీశ్వరన్కు 13 ఏళ్ల కఠిన కారాగార శిక్ష ఖరారు చేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



