నగరంలో చిన్నారి కిడ్నాప్ కలకలం

– తల్లి ఒడిలో ఉండగా అర్థరాత్రి ఎత్తుకెళ్లిన దుండగులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : హైదరాబాద్‌లో చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. కుత్బుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రహదారి పక్కన అర్ధరాత్రి తల్లి ఒడిలో నిద్రిస్తున్న ఆరు నెలల చిన్నారిని దుండగులు ఎత్తుకెళ్లారు. మల్లారెడ్డి హాస్పిటల్ ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న మార్బుల్ షాపు వద్ద ఆదివారం అర్ధరాత్రి నవనీత అనే మహిళ తన నలుగురు పిల్లలతో నిద్రిస్తున్నది. తల్లి నిద్రలో ఉన్న సమయంలో ఒడిలో నిద్రిస్తున్న ఆరు నెలల చిన్నారి ఆశను ఎవరో దుండగులు ఎత్తుకెళ్లారు. కాసేపటికి మెలకువ వచ్చిన నవనీత చుట్టుపక్కల వెతకగా పాప కనిపించకపోవడంతో ఆందోళనకు గురైంది. వెంటనే కుత్బుల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తల్లి నవనీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం సపంలోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *