Category తెలంగాణార్థం

ప్రజల ప్రదర్శన అంటే ఏలినవారికి ఎందుకింత భయం?!

ప్రభుత్వం ఎక్కువా? ప్రజలు ఎక్కువా? ప్రజలు చెల్లించే పన్నులతో నడిచే ప్రభుత్వం, ప్రజలు వోట్లు వేసి ఎన్నుకుంటే మాత్రమే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండే ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో భాగమైన అధికారవర్గం ప్రజల దయ వల్ల అక్కడ ఉన్నామనే విషయాన్ని మరిచిపోతున్నారా?  ప్రభుత్వోద్యోగి, ప్రభుత్వాధికారి అనే మాటలు ఇటీవలివి గాని, అంతకు ముందు వాళ్లను పబ్లిక్…

పెద్ద ధన్వాడలో ధ్వనించిన ప్రజాగ్రహం!

Pedda Dhanwada ethanol factory issue, Ethanol plant controversy Telangana, Pedda Dhanwada village protest, Ethanol factory environmental impact, Telangana ethanol project news, Ethanol plant opposition Telangana, Rural protests against factories, Pedda Dhanwada latest news, Industrial projects in Telangana, Ethanol production in India

గత బుధవారం, జూన్ 4న, జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామ శివార్లలో ఇథనాల్ కర్మాగారం నెలకొల్పడానికి గాయత్రీ రిన్యూవబుల్ ఫ్యుయల్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ చేస్తున్న ప్రయత్నాలను ఆ కర్మాగార కాలుష్యం వల్ల బాధితులు కానున్న గ్రామస్తులు, పొరుగు గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. కంపెనీ తీసుకువచ్చిన ప్రైవేటు సైన్యమూ, బౌన్సర్లూ ప్రజల మీద దాడిచేసి మరియమ్మ…

పదకొండేళ్ల ఫలహారపు, ప్రతీకారపు తెలంగాణ!  

మనం సాధించుకోవలసినది ఏమిటి, భౌగోళిక తెలంగాణనా, ప్రజాస్వామిక తెలంగాణనా, సామాజిక తెలంగాణనా అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తీవ్రమైన చర్చలు, వాదోపవాదాలు జరుగుతుండేవి. ఎవరికి వాళ్లు తమ భావనల మీద గట్టిగా వాదనలు వినిపిస్తుండేవారు. ఉన్న వ్యవస్థ లోపల ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక తెలంగాణ సాధించడం సాధ్యం కాదని, అందువల్ల మొట్టమొదట కనీసమైన భౌగోళిక తెలంగాణ సాధించుకుంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత దాన్ని సామాజికీకరించడం…

ఎన్ కౌంటర్, అనంతర పరిణామాలలో మన అవ్యవస్థ

దేశంలో మావోయిస్టులు లేకుండా చేసే లక్ష్యంతో పదిహేడు నెలలుగా సాగుతున్న ఆపరేషన్ కగార్ లో భాగంగా ఛత్తీస్ గడ్ నారాయణపూర్ జిల్లా గుండె కోట్ లో మే 21న జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావుతో సహా 28 మంది చనిపోయారు. ఈ ఎన్ కౌంటర్, దాని తర్వాత…

ఇప్పుడు రభస, మరొక ప్రమాదం దాకా మౌనం!!       

చార్మినార్ గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదం హైదరాబాద్ చరిత్రలో ఒక ప్రధానమైన విషాదం. ఒకే ఇంట్లో పదిహేడు మంది హఠాత్తుగా మృత్యువాత పడ్డారు. హృదయమూ, మేధా ఉన్న ప్రతి ఒక్కరినీ కలచివేసిన ఈ దుర్ఘటన గురించి చాలా లోతుగా ఆలోచించవలసి ఉంది. గతంలో ఇటువంటి ప్రమాదాలు జరిగిన తర్వాత ఏయే గుణపాఠాలు తీసుకున్నామో, ఏ పరిష్కార…

‘జరూర్ ఆనా’  స్నేహమా, ఆదేశమా, ప్రాధేయమా? 

  ‘ప్రజలకు రొట్టె ఇవ్వలేకపోతే, సర్కస్ ఇవ్వండి’ అనేది రోమన్ చక్రవర్తులు అనుసరించిన రాజనీతి అని చరిత్ర పుస్తకాలు చెపుతాయి. ఆరుగాలం కష్టం చేసే, మనుషులుగానే గుర్తింపు లేని బానిసలకు కనీసమైన తిండి కూడా ఇవ్వకపోయినా, వారికి వినోదం కల్పించి దృష్టి మళ్లించడానికి ఆనాటి పాలకులు ప్రయత్నించారు. వినోదమంటే ఎంపిక చేసిన బానిసలను మల్లయోధులుగా మార్చి, వారిలో ఎవరో ఒకరు చనిపోయేదాకా వేదిక…

కర్రెగుట్టల ఉదంతం లేవనెత్తుతున్న ప్రశ్నలు

ఏప్రిల్‌ 21 నుంచి మూడు వారాలుగా తెలంగాణ – ఛత్తీస్‌ గడ్‌ సరిహద్దుల్లోని కర్రెగుట్టలను చక్రబంధం చేసిన భారత ప్రభుత్వ సాయుధ భద్రతా బలగాలు, అర్ధసైనిక బలగాలు సాధించదలచుకున్నదేమిటి అనే ప్రశ్న ఇవాళ ప్రతి ఒక్కరూ ఆలోచించవలసి ఉంది. మూడు వారాలుగా సాగుతున్న ఈ ప్రక్రియలో భద్రతా బలగాలు ఇప్పటికి కొన్ని కొండలను ఆక్రమించి, వాటి…

తెలంగాణ జనహృదయంలో న్యాయ భావన

లక్షలాది మంది హాజరైన ఎల్కతుర్తి బహిరంగ సభలో భారత రాష్ట్ర సమితి నాయకులు కె చంద్రశేఖర రావు ‘కగార్‌ ఆపరేషన్‌ను ఆపెయ్యాలె’, ‘అధికారం ఉన్నదని చంపుకుంట పోతరా’, ‘గిరిజనుల ఊచకోతను ఆపెయ్యాలె’, ‘నక్సలైట్లతో చర్చలు జరపాలె’ అని అంటుంటే సభ మొత్తం చప్పట్లతో ఆమోదం తెలిపింది. ‘ఈ మాట దిల్లీకి ఉత్తరం రాద్దామా’ అని ఆయన…

ఈ హత్యాకాండలో చేతులు కలపకండి!

తెలంగాణ ముఖ్యమంత్రికి బహిరంగలేఖ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారూ, మన రాష్ట్రానికీ ఛత్తీస్ గడ్ రాష్ట్రానికీ సరిహద్దులలో, జయశంకర్ భూపాల్ పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో, కర్రెగుట్టల ప్రాంతంలో ఇవాళ రేపట్లో ఒక భయానకమైన మారణకాండ జరగనున్నదని వార్తలు వస్తున్న పరిస్థితులలో, మీ తక్షణ స్పందన కోసం, తగిన చర్యల కోసం ఈ బహిరంగ లేఖ.  …