లక్షలాది మంది హాజరైన ఎల్కతుర్తి బహిరంగ సభలో భారత రాష్ట్ర సమితి నాయకులు కె చంద్రశేఖర రావు ‘కగార్ ఆపరేషన్ను ఆపెయ్యాలె’, ‘అధికారం ఉన్నదని చంపుకుంట పోతరా’, ‘గిరిజనుల ఊచకోతను ఆపెయ్యాలె’, ‘నక్సలైట్లతో చర్చలు జరపాలె’ అని అంటుంటే సభ మొత్తం చప్పట్లతో ఆమోదం తెలిపింది. ‘ఈ మాట దిల్లీకి ఉత్తరం రాద్దామా’ అని ఆయన అడిగితే ‘రాద్దాం’ అని లక్షల కంఠాలు ఒకటికి రెండు సార్లు జవాబి చ్చాయి. ‘మీరు అవునంటే ఇదే తీర్మానం జేసి దిల్లీకి పంపిద్దాం’ అంటే సభ హోరెత్తింది. అలా ఆ సభలో అగ్రనాయకుడు మాత్రమే కాక ఆ పార్టీలోని సీనియర్ సభ్యులు, శాసన సభ్యులు కూడా ఇవే ఆకాంక్షలు అంతకు ముందు నుంచే ప్రకటిస్తు న్నారు.
ఇది భారత రాష్ట్ర సమితి గురించో, చంద్రశేఖర రావు గురించో కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి పాలన ఎంత ప్రజాకం టకంగా ఉండిరదో వందలాది సార్లు రాశాను, మాట్లాడాను. ఇప్పుడు ఆయనను సమర్థించవలసిన అవసరమేమీ లేదు. ఇప్పుడు ఆయన మాటలు ప్రతిపక్షంలో ఉన్నందువల్ల, గాలివాటం మాటలు కూడా కావచ్చు. అధికారంలో ఉన్నప్పుడు ఆయనా అదే దమన నీతిని ఉపయోగించిన విషయం ఎవరూ మరిచిపోలేరు.
కాని ఇక్కడ మాట్లాడుకోవలసింది ఆయన గురించో ఆ పార్టీ పాలన గురించో కాదు, ఆ మాటలు విన్న మహా జన స్పందన గురించి. మహాద్భుతమైన ప్రజా గళం గురించి. ఆ మాటలకు దొరికిన విస్తారమైన ఆమోదం గురించి. రాష్ట్రం నలుమూలల నుంచి ఎక్కడెక్కడి నుంచో ఆ సభకు వచ్చారంటే వాళ్లంతా భారత రాష్ట్ర సమితి నాయకులో, సభ్యులో, సానుభూతిపరులో కావచ్చు. అందులో గత పది సంవత్సరాలలో అవినీతికీ అక్రమాలకూ దౌర్జన్యానికీ ప్రజల మీద పెత్తందారీ తనానికీ పాల్పడినవారూ కొందరు ఉండవచ్చు. అనేక కారణాల వల్ల ఏదో ఒక రాజకీయ పార్టీకి దగ్గరగా ఉండాలని అనుకునేవారే అత్యధిక సంఖ్యా కులు కావచ్చు. కాని అందరికందరూ తెలంగాణ బిడ్డలు. వారి హృదయాల్లో విప్లవకారుల పట్ల ఎటువంటి అభిప్రాయం ఉన్నదో వారి చప్పట్లలో, ముక్తకంఠంలో వ్యక్తమయింది. ఎవరు ఏమి చేసి అయినా సరే తెలంగాణ బిడ్డల హృదయాల్లోంచి విప్లవాకాంక్షలను, విప్లవ సానుభూతిని చెరిపెయ్య లేరని లక్షలాది తెలంగాణ బిడ్డల కంఠాలు ముక్తకం ఠంతో ప్రకటించాయనడానికి ఆ సభే సాక్షి. ఆ ప్రకటనకు బి ఆర్ ఎస్, చంద్రశేఖరరావు కేవలం సాధనాలు.
ఆ సభ జరుగుతున్న సమయాననే యాదృ చ్ఛికంగా ప్రొ.హరగోపాల్, జస్టిస్ (రిటైర్డ్) చంద్రకుమార్ల నాయకత్వంలో ఒక పౌరస మాజ బృందం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. ఆపరేషన్ కగార్ మారణ కాండను ఆపమని, కాల్పుల విరమణ ప్రకటిం చమని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపమని కేంద్రం మీద ఒత్తిడి తేవాలని, రాష్ట్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించి, చర్చలు జరపడానికి సిద్ధపడాలని వారు కోరారు.
కాని ఇక్కడ మాట్లాడుకోవలసింది ఆయన గురించో ఆ పార్టీ పాలన గురించో కాదు, ఆ మాటలు విన్న మహా జన స్పందన గురించి. మహాద్భుతమైన ప్రజా గళం గురించి. ఆ మాటలకు దొరికిన విస్తారమైన ఆమోదం గురించి. రాష్ట్రం నలుమూలల నుంచి ఎక్కడెక్కడి నుంచో ఆ సభకు వచ్చారంటే వాళ్లంతా భారత రాష్ట్ర సమితి నాయకులో, సభ్యులో, సానుభూతిపరులో కావచ్చు. అందులో గత పది సంవత్సరాలలో అవినీతికీ అక్రమాలకూ దౌర్జన్యానికీ ప్రజల మీద పెత్తందారీతనానికీ పాల్పడినవారూ కొందరు ఉండవచ్చు. అనేక కారణాల వల్ల ఏదో ఒక రాజకీయ పార్టీకి దగ్గరగా ఉండాలని అనుకునేవారే అత్యధిక సంఖ్యాకులు కావచ్చు. కాని అందరికందరూ తెలంగాణ బిడ్డలు. వారి హృదయాల్లో విప్లవకారుల పట్ల ఎటువంటి అభిప్రాయం ఉన్నదో వారి చప్పట్లలో, ముక్తకంఠంలో వ్యక్తమయింది. ఎవరు ఏమి చేసి అయినా సరే తెలంగాణ బిడ్డల హృదయాల్లోంచి విప్లవాకాంక్షలను, విప్లవ సానుభూతిని చెరిపెయ్యలేరని లక్షలాది తెలంగాణ బిడ్డల కంఠాలు ముక్తకంఠంతో ప్రకటించాయనడానికి ఆ సభే సాక్షి. ఆ ప్రకటనకు బి ఆర్ ఎస్, చంద్రశేఖరరావు కేవలం సాధనాలు.
ముఖ్యమంత్రి వారు చెప్పినది సావధానంగా విన్నారని, కాల్పుల విరమణ, మరణాలకు ముగింపు, శాంతి చర్చలు జరగాలని అన్నారని, గతంలో 2004 చర్చలలో ప్రధాన భాగస్వామి అయిన అప్పటి హోమ్ మంత్రి కె జానారెడ్డిగారి సలహాలతో మంత్రి వర్గంతో, అధిష్టానంతో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకుంటానని అన్నారని వార్తలు వచ్చాయి. మర్నాడు ఉదయమే ఆయన జానా రెడ్డి తో పాటు, అప్పటి చర్చలలో మరొక భాగస్వామి కె కేశవ రావు ను కూడా కలిసి చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు, శాసన సభ్యులు కూడా కాల్పుల విరమణ, శాంతి చర్చలు, తక్షణమే ప్రాణహాని ఆగిపోవడం గురించి మాట్లాడుతున్నారు.
ఇది చెప్పడం కూడా కాంగ్రెస్ గురించో, ఆ పార్టీ నాయకుల గురించో సదభిప్రా యంతో కాదు. ఇంతకు ముందు ప్రతిపక్షం విషయంలో చెప్పినట్టు కాంగ్రెస్ నాయకులు కూడా ఈ వ్యక్తీకరణకు కేవలం సాధనం మాత్రమే. ఆ మాధ్యమం ద్వారా వ్యక్తమవు తున్నది, లేదా వ్యక్తం చేయకుండా ఉండలేని స్థితి కల్పిస్తున్నది తెలంగాణ జన హృదయమే. ‘ఆదివాసులైనా, మావోయిస్టు కార్యకర్తలైనా తెలంగాణ బిడ్డల మరణాలు ఇంక చాలు. ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ప్రజల జీవించే స్వేచ్ఛను ధ్వంసం చేయడం, మారణకాండ సాగించడం ఇంకానా, ఇకపై చెల్లదు’ అని తెలంగాణ ప్రజాస్వరం వెల్లువె త్తుతున్నది. ఆ జనాదేశాన్ని గ్రహిం చడం, దాన్ని తమ మాటల్లో పెట్టడం ఇవాళ ఏ రాజకీయ పక్షానికైనా అనివార్యమైన స్థితి వచ్చింది. ఈ క్రమంలో ఆయా రాజకీయ పార్టీల అవకాశవాదమూ, ద్వంద్వ ప్రవృత్తీ కూడా ఉండవచ్చు, ఉంటాయి. అయినా సరే, తెలంగాణ సమాజపు ప్రధాన ఆకా ంక్షను వాళ్లు వ్యక్తీకరించక తప్పడం లేద నేదే కీలకాంశం.
ఇది చెప్పడం కూడా కాంగ్రెస్ గురించో, ఆ పార్టీ నాయకుల గురించో సదభిప్రాయంతో కాదు. ఇంతకు ముందు ప్రతిపక్షం విషయంలో చెప్పినట్టు కాంగ్రెస్ నాయకులు కూడా ఈ వ్యక్తీకరణకు కేవలం సాధనం మాత్రమే. ఆ మాధ్యమం ద్వారా వ్యక్తమవుతున్నది, లేదా వ్యక్తం చేయకుండా ఉండలేని స్థితి కల్పిస్తున్నది తెలంగాణ జన హృదయమే. ‘ఆదివాసులైనా, మావోయిస్టు కార్యకర్తలైనా తెలంగాణ బిడ్డల మరణాలు ఇంక చాలు. ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ప్రజల జీవించే స్వేచ్ఛను ధ్వంసం చేయడం, మారణకాండ సాగించడం ఇంకానా, ఇకపై చెల్లదు’ అని తెలంగాణ ప్రజాస్వరం వెల్లువెత్తుతున్నది. ఆ జనాదేశాన్ని గ్రహించడం, దాన్ని తమ మాటల్లో పెట్టడం ఇవాళ ఏ రాజకీయ పక్షానికైనా అనివార్యమైన స్థితి వచ్చింది. ఈ క్రమంలో ఆయా రాజకీయ పార్టీల అవకాశవాదమూ, ద్వంద్వ ప్రవృత్తీ కూడా ఉండవచ్చు, ఉంటాయి. అయినా సరే, తెలంగాణ సమాజపు ప్రధాన ఆకాంక్షను వాళ్లు వ్యక్తీకరించక తప్పడం లేదనేదే కీలకాంశం.
అధికార, ప్రతిపక్షాలు మాత్రమే కాదు, ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వ సాయుధ బలగాలు గత పదహారు నెలలుగా సాగిస్తున్న మారణకాండను వామపక్ష పార్టీలు ఏదో ఒక స్థాయిలో ఖండిస్తూనే ఉన్నాయి. ఇరువైపులా ప్రాణహాని ఆగిపోవాలని తరతమ స్థాయిలలో తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు శాంతి చర్చలకు సిద్ధమేనని మావోయిస్టు పార్టీ ప్రకటించాక, ప్రభుత్వం పెడచెవిన పెట్టి హింసాకాండను, బాంబు దాడులను కొనసాగిస్తున్న వేళ, ప్రత్యేకంగా కర్రెగుట్టల దాడి మొదలయ్యాక, తెలంగాణలోని పది వామపక్ష పార్టీలు – సిపిఐ, సిపిఐ (ఎం), సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ, సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్, సిపిఐ (ఎంఎల్) లిబరేషన్, సిపిఐ (ఎంఎల్), ఎంసిపిఐ, ఎస్ యు సి ఐ, పార్వర్డ్ బ్లాక్ – ఒకే వేదిక మీదికి వచ్చి కేంద్ర ప్రభుత్వం తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని, శాంతి చర్చలకు ముందుకు రావాలని డిమాండ్ చేశాయి. అలాగే తెలంగాణ జన సమితి కూడా ఈ డిమాండ్లు ప్రకటించింది.
నిజానికి ఈ పార్టీల న్నిటికీ మావోయిస్టు పార్టీతో తీవ్రమైన భేదాభి ప్రాయా లున్నాయి. తమలో తమకు కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. అయినప్పటికీ వీరందరూ తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని, అన్నీ వైపులా ప్రాణహాని జరగగూడదని, మావోయిస్టు పార్టీతో చర్చలకు రావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారంటే, ఇది ఆయా పార్టీల గురించి చర్చించే సందర్భం కాదు. ఇక్కడ కూడా ఆ పార్టీలన్నీ తెలంగాణ ప్రజాభిప్రాయ ప్రకటనకు సాధనాలుగా ఉన్నాయి. వినక తప్పని తెలంగాణ ఆక్రోశాన్ని, ఆవేదనను, ధిక్కారాన్ని, విప్లవోద్యమం పట్ల తెలంగాణ ప్రజల ప్రేమాభి మానాలను గుర్తించడానికి ఆ పార్టీలన్నీ ముందుకొచ్చాయి.
రాజకీయ పక్షాల సంగతి అలా ఉంచి, గత నెల రోజులుగా తెలంగాణలో అనేక ప్రజా సంఘాలు, ఎందరో ప్రజలు స్వతంత్రంగా, స్వచ్ఛందంగా ఇవే ఆకాంక్షలు ప్రకటిస్తున్నారు. ఆపరేషన్ కగార్ లో ఆదివాసులను, మావో యిస్టులను పిట్టల్లా కాల్చి చంపుతూ, అనేక మంది తెలంగాణ బిడ్డల మృతదేహాలు దశాబ్దాల తర్వాత తిరిగి తమ స్వగ్రామాలకు రావడం మొదలయ్యాక, తెలంగాణ పౌర సమాజంలో ఈ మారణకాండ ఆగాలనే ఆలోచన ప్రారంభమయింది. జస్టిస్ చంద్రకుమార్ నాయకత్వంలో ఒక శాంతి చర్చల కమిటీ ఏర్పడిరది. ఆ కమిటీ ఏర్పాటు ప్రకటన వెలువడిన వారం లోగానే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో కాల్పుల విరమణ, శాంతి చర్చల ప్రతిపాదనతో ఒక లేఖ వెలువడిరది. సరిగ్గా ఆ లేఖ వెలువడిన రోజే, అనారోగ్యంతో ఉండగా పట్టుకుని కాల్చిచంపిన గుముడవెల్లి రేణుక మృతదేహం కడవెండికి చేరి అంత్యక్రియలు జరుగుతున్నాయి గనుక ప్రజలలో ఆపరేషన్ కగార్ దుర్మార్గం పట్ల వ్యతిరేకత మరింత ప్రత్యక్షంగా, మరింత గాఢంగా చెలరేగింది. అప్పటి నుంచి గడిచిన నాలుగు వారాలలో మావోయిస్టు పార్టీ వైపు నుంచి రూపేష్ పేరు మీదా, అభయ్ పేరు మీదా మరొక మూడు నాలుగు లేఖలు, ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ వెలుగు చూశాయి. శాంతి చర్చల కమిటీ రెండు మూడు సమావేశాలు ఏర్పాటు చేసింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలనూ ఆహ్వానించి భారత్ బచావో ఒక పెద్ద సదస్సు జరిపింది. ఆదివాసీ హక్కుల పోరాట సంఫీుభావ సమితి, పౌరహక్కుల సంఘం కొన్ని జిల్లా కేంద్రాలలో సభలు నిర్వహించాయి. సిపిఐ, న్యూడెమోక్రసీ సభలు, ప్రదర్శనలు జరిపాయి. అనేక పార్టీల, ప్రజాసంఘాల ఐక్యవేదికలు ఎన్నో జిల్లాలలో, చిన్న చిన్న పట్టణాలలో కూడా ప్రదర్శ నలు, సభలు నిర్వహించాయి.
తెలంగాణ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఈ జనాందోళన ఆంధ్రప్రదేశ్ కు, ఇతర రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నది. కోల్కత్తా లో ప్రదర్శనలు జరిగాయి. దిల్లీలో ఈ డిమాండ్లు గోడల మీద నినాదాలయ్యాయి. సామాజిక మాధ్య మాలలో ఈ ప్రజాకాంక్షలు హోరెత్తు తున్నాయి. సరిగ్గా 2002లో ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వానికీ విప్లవోద్యమానికీ చర్చలు జరిగే వాతావరణం ఏర్పడినప్పుడు, 2004లో వాస్తవంగా చర్చలు జరిగి నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయ సమీకరణ, వ్యక్తీ కరణ జరిగిందో అటువంటి వాతావరణం ఏర్పడుతున్నది. 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపుల్స్ వార్ మీద, ఆరు ప్రజాసంఘాల మీద నిషేధం పొడిగింపు జరపకుండా, కాల్పుల విరమణ ఒప్పం దం మీద సంతకం చేసి, చర్చలు కూడా జరిపిన ఆరునెలల కాలం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎన్ కౌంటర్ హత్యల భయం లేకుండా ఎలా కంటి నిండా నిద్రపోగ లిగారో ఆ వాతావరణం మళ్లీ వస్తుందా అని ఆశ కలుగుతున్నది.
ఇది మావోయిస్టుల పట్ల అభిమానం అనడం అతిశయోక్తి అని, అది కేవలం హత్యాకాండ పట్ల నిరసన, మరణిస్తున్నవారి పట్ల మానవీయ సానుభూతి మాత్రమేనని అనుకునేవాళ్లు కూడా ఉండవచ్చు. వెల్లువెత్తుతున్న ఆందోళన కనీసం తెలంగాణ ప్రజల హృదయాల్లోని న్యాయభావన వ్యక్తీకరణ అని అయినా ఒప్పుకోక తప్పదు. ఆ న్యాయ భావనే ఎనిమిది దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల హృదయాల్లో, ఆలోచనల్లో, సామూహిక జ్ఞాపకంలో విప్లవ భావనను, విప్లవాచరణను, విప్లవ సానుభూతిని సజీవంగా ఉంచుతున్నది. దాన్ని చెరిపెయ్యడం ఎవరి తరమూ కాదు.
అయితే అధికార రాజకీయ పక్షాల నుంచి సాధారణ ప్రజానీకం దాకా, ప్రజా సంఘాల దాకా విభిన్న శ్రేణుల నుంచి, విభిన్న స్థాయిల నుంచి ఇటువంటి ఒకే ఆకాంక్ష తలెత్తుతున్నప్పుడు, ఈ ఆకాంక్ష ప్రకటిస్తున్నవారి చిత్తశుద్ధి మీద, విశ్వసనీయత మీద ఎవరికైనా సందేహాలుం డవచ్చు. వారు స్వప్రయోజనాల కోసమే ఈ ఆకాంక్షను ప్రకటిస్తున్నారేమో అనే అనుమానం రావచ్చు. ఈ ఆకాంక్షను వెలిబుచ్చడంలో భాగంగా వారు తమ అభిప్రాయ దురభిప్రా యాలను, తమ సొంత ఎజెండాలను ముందుకు తీసుకువస్తారేమో అనే ప్రశ్నలు తలెత్తవచ్చు.
ఆ భయ సందేహాలు ఎంత వాస్తవికమై నవైనా ప్రస్తుతానికి వాటిని పక్కన పెట్టవలసి ఉంది. తక్షణమే హత్యాకాండ ఆగాలి, ఆదివాసులైనా, మావోయిస్టులైనా, భద్రతా బలగాలైనా ప్రాణ హాని జరగగూడదు. శాంతి సాధన కోసం ప్రజాస్వామిక చర్చ జరగాలి. హింసాహింసలు అనే అనవసరమైన చర్చ కన్నా అత్యవసరమైన న్యాయా న్యాయాల చర్చ జరగాలి. ప్రజాసమస్యలు చర్చలోకి రావాలి. ఇవీ ఇవాళ ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినవి, సాధించ వలసినవి. పైపైన చూస్తే ఇంత పెద్ద ఎత్తున ప్రజా కదలికల్లో వ్యక్తమయినదంతా కొనసాగుతున్న హత్యా కాండ పట్ల నిరసన, మృతుల పట్ల సానుభూతి మాత్రమే అనిపించవచ్చు. కాని లోలోపల ఇదంతా ఆదివాసుల పట్ల, విప్లవకారుల పట్ల ప్రజలలో దాగి ఉన్న ప్రేమాభిమానాల వ్యక్తీకరణ. మితిమీరిన నిర్బంధకాండ వల్ల ఆ ప్రేమాభి మానాలు ఇంతకాలమూ బైటికి రాకపోయి ఉండవచ్చు. ఆ ప్రేమాభిమానాల నిప్పు మీద భయం నివురు కప్పి ఉండవచ్చు. ఆపరేషన్ కగార్ వంటి భయానకమైన దాడి ఆ నివురును చెదరగొడు తున్నది. ఆ హత్యలు, ఆ దూకుడు, ఆ దౌర్జన్యం అన్నీ కూడా ప్రతి ఒక్కరిలో ఇంత అన్యాయమా అని ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఆ రకంగా ఆపరేషన్ కగార్ ఉద్దేశిత లక్ష్యానికి వ్యతిరేకమైన ఫలితాన్ని సాధిస్తున్నదనాలి.
ఇది మావోయిస్టుల పట్ల అభిమానం అనడం అతిశయోక్తి అని, అది కేవలం హత్యాకాండ పట్ల నిరసన, మరణిస్తున్నవారి పట్ల మానవీయ సానుభూతి మాత్రమేనని అనుకునేవాళ్లు కూడా ఉండవచ్చు. వెల్లువెత్తుతున్న ఆందోళన కనీసం తెలంగాణ ప్రజల హృదయాల్లోని న్యాయభావన వ్యక్తీకరణ అని అయినా ఒప్పుకోక తప్పదు. ఆ న్యాయ భావనే ఎనిమిది దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల హృదయాల్లో, ఆలోచనల్లో, సామూహిక జ్ఞాపకంలో విప్లవ భావనను, విప్లవాచరణను, విప్లవ సానుభూతిని సజీవంగా ఉంచుతున్నది. దాన్ని చెరిపెయ్యడం ఎవరి తరమూ కాదు.
https://epaper.prajatantranews.com/editionname/Main/PRAJATAN_MAI/page/5/article/PRAJATAN_MAI_20250501_5_3