Category తెలంగాణ

ఐటీడీఏ భవనాల నిర్మాణాలకు నిధుల మంజూరు

– ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: ఐటీడీఏ ఏటూరునాగారం ఐటీడీఏ ఉట్నూరు నూతన భవనాల నిర్మాణం కోసం రూ.15 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ కావటం పట్ల పంచాయతీరాజ్‌ ,గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు.…

26న బతుకమ్మ కుంటలో బతుకమ్మ సంబురాలు

– 29న సరూర్‌ నగర్‌ స్టేడియంలో ‘గిన్నెస్‌’ రికార్డ్‌ బతుకమ్మ ఉత్సవం – ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన సీఎస్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: ఈనెల 29న సరూర్‌ నగర్‌ స్టేడియంలో నిర్వహించే భారీ బతుకమ్మ కార్యక్రమంతోపాటు, 26న ముఖ్యమంత్రి పాల్గొనే బతుకమ్మ కుంటలో బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయడానికి సమన్వయంతో కృషి చేయాలని ప్రభుత్వ…

ప్రజా వైద్యుడు ఆమెడ అమరత్వానికి 29 ఏండ్లు

– పట్టపగలే నడిరోడ్డుపై కాల్చి చంపిన దుర్మార్గులు. – దుండగులను పట్టుకోలేని పాలకులు- – నేటికీ జిల్లా ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు వరంగల్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: పేదలకు వైద్యం అందించాలనే సంకల్పంతో వైద్య వృత్తిని ఎంచుకుని సేవలందించే ప్రజా వైద్యుడిని 29 ఏళ్ల క్రితం పట్టపగలే నడిరోడ్డుపై దుర్మార్గులు కాల్చి చంపారు. చిరునవ్వుతో పలకరిస్తూ…

యువతను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరు

– ‘డేర్‌ టు డ్రీమ్‌’ శిబిరం ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: యువతలో అపారమైన శక్తిసామర్థ్యాలున్నాయని, వారిని మనం ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణ సిఖ్‌ సొసైటీ ఆధ్వర్యంలో మేడ్చల్‌ జిల్లా తూంకుంటలోని ఓ రిసార్ట్‌లో డేర్‌ టు డ్రీమ్‌ పేరిట…

వ‌రంగ‌ల్ ఎంజీఎం హాస్పిట‌ల్‌లో ప‌సికందు మృతి

– నిలిచిన విద్యుత్ స‌ర‌ఫ‌రాల‌ – ఆక్సిజ‌న్ అంద‌కనే మృతి – త‌ల్లిదండ్రుల ఆరోప‌ణ‌ ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కెన ఎంజీఎం హాస్పిట‌ల్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చిన్న పిల్లల విభాగంలో రెండు నెలల పసికందు మృతి చెందాడు. ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన రెండు నెలల బాబు మూడు రోజుల క్రితం సబ్బు…

గ్లోబల్‌ హెల్త్‌ కేర్‌ హబ్‌గా హైదరాబాద్‌

– హైదరాబాద్‌లో హెచ్‌సీఏ హెల్త్‌కేర్‌ జీసీసీ ప్రారంభం – అమెరికా వెలుపల భారత్‌లో మొట్టమొదటిది ఇదే – 75 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి.. 3వేల మందికి ఉద్యోగాలు – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: హైదరాబాద్‌ను గ్లోబల్‌ హెల్త్‌ కేర్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని…

మేడారం పనులు వేగవంతంగా చేపట్టాలి

– అధికారులతో మంత్రులు సీతక్క, సురేఖ టెలికాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు సంబంధించి చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రభుత్వం వేగం పెంచింది. సీఎం రేవంత్‌ రెడ్డి మంగళవారం అధికారికంగా ప్రణాళికను ఖరారు చేయగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు మంత్రులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్‌…

కిట్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ నిర్మలాదేవికి డాక్టరేట్‌

వరంగల్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: వరంగల్‌లోని కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (కిట్స్‌డబ్ల్యూ)లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ (ఈసీఐఈ) విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రంగిశెట్టి నిర్మలాదేవికి జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ, హైదరాబాద్‌(జేఎన్‌టీయూహెచ్‌) పీహెచ్‌డీని ప్రదానం చేసింది, ఈ సందర్భంగా కిట్స్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.అశోక రెడ్డి…

పారిశ్రామికవేత్తలుగా మహిళా సంఘ సభ్యులు

– మహిళా భవన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: :మహిళలు అభివృద్ధి పథంలో నడుస్తున్నారని, 67 లక్షల మంది మహిళలు మహిళా సంఘాల్లో (ఎస్‌హెచ్‌జీ) ఉండి పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. బంజారాహిల్స్‌లోని ఎన్బీటీ నగర్‌లో రూ.93.50 లక్షలతో నిర్మించిన…