Category తెలంగాణ

మంత్రి సీతక్కను కలిసిన పంచాయతీరాజ్‌ ఈఎన్‌సీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన పి.జోగారెడ్డి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కను ప్రగతి భవన్‌లో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క జోగారెడ్డిని అభినందించారు. ప్రజా ప్రభుత్వం పంచాయతీరాజ్‌ విభాగంలో నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.…

ముఖ్యమంత్రిని కలిసిన క్రికెటర్‌ తిలక్‌వర్మ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: భారత్‌ క్రికెటర్‌ తిలక్‌వర్మ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వ‌కంగా కలిశారు. ఆసియా కప్‌-2025 ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ విజయంలో తిలక్‌వర్మ కీలక పాత్ర పోషించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయనను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సత్కరించి అభినందించారు. సీఎం రేవంత్‌ రెడ్డికి తిలక్‌వర్మ క్రికెట్‌ బ్యాట్‌ను బహూకరించారు.…

పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న కేటీఆర్ దంపతులు

జూబిలీ హిల్స్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 30: జూబ్లీహిల్స్‌  ప్రసిద్ధ పెద్దమ్మతల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్) దంపతులు మంగళవారం ఆలయాన్ని సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆలయానికి విచ్చేసిన కేటీఆర్ దంపతులు, పెద్దమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని…

సిమెంట్‌ ‌లోడుతో గంజాయి సరఫరా

– శివారులో భారీగా గంజాయి పట్టివేత – 6కోట్ల విలువ ఉంటుందని అంచనా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 30: ‌మత్తుపదార్థాల నిరోధానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా  వాటిని సరఫరా చేసే వారు కొత్త మార్గాలలో వెళుతున్నారు. సిమెంట్‌ ‌బ్యాగుల మాటున గంజాయిని సరఫరా చస్తూ పట్టుబడ్డారు. దుండగులు ఎక్కడో ఓచోట అక్రమంగా మాదకద్రవ్యాల రవాణా కొనసాగిస్తూ…

కెనడాలో సద్దుల బతుకమ్మ

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, వరంగల్‌, ‌సెప్టెంబర్‌ 30: కెనడా దేశంలోని కిచనీర్‌ ‌ప్రాంతంలోని వాటర్‌లూ రిమ్‌పార్క్‌లోగల ఫర్‌లేస్‌ ‌హాల్‌లో తెలుగువారంతా కలిసి సద్దుల బతుకమ్మ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు మహిళలు సుమారు 800 మంది సాంప్రదాయ దుస్తుల్లో, తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ ఆటపాటలతో అలరించారు. భారతీయ మహిళలతోపాటు స్థానిక…

 సీఎం రేవంత్ ను క‌లిసిన మంత్రి జూప‌ల్లి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 30 :  జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టూరిజం, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిష‌న్ శాఖ‌ల మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం శాఖ‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, టూరిజం శాఖ‌ ఎండీ వ‌ల్లూరి క్రాంతి మంగ‌ళ‌వారం మ‌ర్యాపూర్వ‌కంగా క‌లిశారు. రా­ష్ట్ర ప్ర­భు­త్వం ఆధ్వ­ర్యంలో సరూర్‌న­గ­ర్‌ మై­దా­నం­లో మంగ‌ళ‌వారం నిర్వహించిన…

సీజనల్‌ వ్యాధుల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి

– వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: రాష్ట్రంలో ప్రజారోగ్య శాఖ ముందస్తు నివారణ చర్యలు చేపట్టడం వల్ల సీజనల్‌ వ్యాధుల కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు డైరెక్టర్‌ అఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ రవీందర్‌ కుమార్‌ వెల్లడిరచారు. సీజనల్‌ వ్యాధులు పూర్తి నియంత్రణలో ఉన్నాయని అధికారులు వైద్య ఆరోగ్య…

హోం శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఆనంద్‌ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: తెలంగాణ హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సి.వి.ఆనంద్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 1991 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ఆనంద్‌ ఇప్పటివరకు సిటీ పోలీసు కమిషనర్‌గా వ్యవహరించారు. ఇది ఆయనకు రెండోసారి. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డైరెక్టర్‌ జనరల్‌గాకూడా పనిచేశారు. మంగళవారం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా…

ఇంటింటా కాంగ్రెస్‌ బాకీ కార్డులు పంపిణీ చేయాలి

– ప్రతి రైతుకూ రూ.75 వేలు రైతుబంధు బాకీ – ప్రతి మహిళకూ రూ.44 వేల బాకీ చెల్లించి ఓట్లు అడగాలి – ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూపాయి కూడా చెల్లించలేదు – కాంగ్రెస్‌ బాకీ కార్డు విడుదల కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్‌ సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: కాంగ్రెస్‌ మోసాలను, ఆ పార్టీ పాలనను…