Category ప్రత్యేక వ్యాసాలు

ప్రశ్నార్ధకంగా పక్షుల మనగడ!

నేడు నగర వాతావరణంలో పక్షుల మనగడ కష్టమవుతోంది. ప్రశ్నార్ధకంగానూ మారుతోంది. ఇప్పటికే అనేక రకాల పక్షులు నగరాల్లో కనుమరుగయ్యాయి. అయితే పావురాలకు మాత్రం ఇది వర్తించదు. పల్లె ప్రాంతాల్లో కన్నా నగరా ల్లోనే మనం పావురాలను ఎక్కువగా చూస్తాం. సిటీస్‌లో వాటికి నీరు, ఆహారం అందుబాటులో ఉంటాయి. వాటిని చంపితినే జంతువులు దాదాపు ఉండవు. ఉన్నా చాలా తక్కువ. వీటికి తోడు ఎత్తయిన బిల్డింగులు, కిటికీలు, పైకప్పులు, వంతెనలు, ఫ్లైఓవర్లు, గోదాములు..ఇలా ఒకటేంటి, అవి నివసించడానికి ఎన్నో అనువైన ప్రదేశాలున్నాయి. అయితే, మెట్రో సిటీస్‌లో వీటి సంఖ్య పెరగటం మనుషులకు ప్రమాదంగా పరిణమిస్తోంది. పావురాల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలను పరిగణనలోకి తీసుకున్న పుణె మున్సిపల్‌ కార్పొరేషన్‌, వాటిని పోషించే వారిపై చర్యలు ప్రారంభించింది. పావురాల రెట్టలు, ఈకలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. వీటితోపాటు చర్మ సమస్యలు, అలర్జీలు, సైనసైటిస్‌ ప్రమాదం పెరుగుతుంది. కానీ, ఏదైనా ఒక జీవి జనాభా విపరీతంగా పెరిగితే అది పర్యావరణంపైనా ప్రభావం చూపుతుంది. పావురాల సంఖ్య పెరగడం పర్యావరణంలో అసమ తుల్యతకు సంకేతం. పావురాలు స్థానిక జాతులే. ఇళ్లలో పెంచుకోవడానికి పావురాలను మనుషులు అడవుల నుంచి గ్రామాలు, పట్టణాలకు తీసుకొచ్చారు. అంతకు ముందు అవి కొండా కోనల్లో తిరుగుతూ, పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య గూళ్లు పెట్టుకుని జీవించేవి. చిన్న చిన్న పురుగులు, పండ్లు తిని బతికేవి. వీటి రెట్టల ద్వారా పండ్ల విత్తనాలు అడవి అంతటా వ్యాపించేవి. కానీ, ఇప్పుడు పక్షులకు అడవులలో తిండి సరిగా దొరకడం లేదు. పావురాలను డేగలు, గద్దలు వేటాడి చంపి తింటుంటాయి. తోడేళ్లు, నక్కలకు కూడా ఇవి చాలా ఇష్టమైన ఆహారం. తరచూ మనుషులు కూడా వీటిని వేటాడుతుంటారు. ఇంతకు ముందు ఈ పక్షులు అడవుల్లో చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు చాలా తగ్గాయి. నగరాల్లో వీటికి శత్రువులు పెద్దగా లేకపోవడం, రక్షణ ఎక్కువగా ఉండటం వాటి సంఖ్య పెరగడానికి కారణమైంది. పైగా ప్రజలు వాటికి తిండిగింజలు వేస్తూ వేటాడే శ్రమను తగ్గిస్తున్నారు. దీంతో సహజంగానే సంతానోత్పత్తి సులభమవుతోంది. పౌల్ట్రీలలో కోళ్లు పెరిగినట్లే, ఇక్కడ పావురాలు కూడా పెరుగుతున్నాయి. నగరాలు పెద్ద పౌల్ట్రీ ఫామ్ గా మారాయి. పావురాల సంఖ్య పెరిగేకొద్దీ ప్రకృతిలోని ఇతర జీవులపై దాని ప్రభావం పడుతుంది. ఇవి తమకంటే చిన్నసైజులో ఉండే పిచ్చుకల్లాంటి వాటిని వేధిస్తుంటాయి. అవి కట్టుకున్న గూళ్లను ఆక్రమిస్తుంటాయి. వాటి ఆహారాన్ని తినేస్తాయి. దీనివల్ల ఆహారపు కొరతతో చిన్నపక్షులు నశిస్తుంటాయి. ఒక్క పావురానిదే కాదు, ఏ పక్షి మల మూత్రాలైనా మన చుట్టూ ఎక్కువగా ఉంటే, అవి మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఇక, పర్యావరణంలో పావురాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, అవి పెద్ద సంఖ్యలో పెరగడం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఏ ప్రదేశంలో ఎన్ని పక్షులు నివసించాలి అన్నదానిపై ఒక నిర్దిష్ట పరిమితి ఉంది. ఒక రకం జీవరాశి అధికంగా పెరిగితే, దానివల్ల ఇతర జీవులకు లభించే ఆహారం, నివాసం, ఎగిరే స్థలం తగ్గుతాయి. అది వాటి జనాభా విూద ప్రభావం చూపిస్తుంది. పావురాలు అన్ని పరిస్థితులను తట్టుకుంటాయి. కొన్ని ఇతర పక్షుల మాదిరిగా కాకుండా, ఏ సమయంలోనైనా గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేయగలవు. నివాసానికి అనుకూల స్థలం, పుష్కలంగా ఆహారం, వేటాడే జంతువులు లేకపోవడంలాంటివి పావురాలు విపరీతంగా పెరగడానికి కారణమవుతున్నాయి. ఇప్పుడు నగరాలలో చాలా ప్రాంతాలను పావురాలు ఆక్రమించినట్లు కనిపిస్తుంది. వీటి కారణంగానే కాకులు, పిచ్చుకల్లాంటి కొన్ని పక్షులు కనిపించకుండా పోతున్నాయి. అయితే పావురాల సంఖ్య పెరగడం వల్లే ఇతర పక్షుల తగ్గిపోతున్నాయని చెప్పడం పూర్తిగా నిజంకాకపోవొచ్చు. పట్టణీకరణతోపాటు, మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా ఇలాంటి పక్షులు కనుమరుగవుతున్నాయి. ఈ రెండింటిలో ఏది ఎంత వరకు కారణమన్నదాన్ని పరిశోధించాల్సి ఉంది. -మహేందర్ మిట్టపల్లి

నేడు నగర వాతావరణంలో పక్షుల మనగడ కష్టమవుతోంది. ప్రశ్నార్ధకంగానూ మారుతోంది.  ఇప్పటికే అనేక రకాల పక్షులు నగరాల్లో కనుమరుగయ్యాయి. అయితే  పావురాలకు మాత్రం ఇది వర్తించదు. పల్లె ప్రాంతాల్లో కన్నా నగరా ల్లోనే మనం పావురాలను ఎక్కువగా చూస్తాం. సిటీస్‌లో వాటికి నీరు, ఆహారం అందుబాటులో ఉంటాయి. వాటిని చంపితినే జంతువులు దాదాపు ఉండవు. ఉన్నా…

ప్రతి రోజూ కావాలి పుస్తకాల పండుగ!

ఇవాళ్టి నుంచి పదకొండు రోజుల పాటు హైదరాబాద్ బుక్ ఫేర్ అనే పుస్తకాల పండుగ జరగబోతున్నది. ‘ఈ రోజుల్లో పుస్తకాలు చదివే చాదస్తులెవరండీ’ అని సన్నాయి నొక్కులు నొక్కే వారుంటారు. పుస్తకమే శ్వాసగా ధ్యాసగా ప్రాణంగా ప్రపంచంగా బతుకుతున్నవాళ్లూ ఉంటారు. ముప్పై ఆరు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జరుగుతున్న పండుగే గనుక ఇందులో కొత్త ఏమున్నది…

భూ భారతి బిల్లుతో మానుకోట భూములకు రక్షణ

మానుకోట పేరు మహబూబాబాద్ గా రూపాంతరం చెందేందుకు మనవారు నవాబుల పాలన గుర్తుచేస్తూ పేరు మారిన విషయాన్ని చెబుతూ వస్తారు. నాటి మానుకోట నేటి మహబూబాబాద్ పోరాటాల గడ్డగా కమ్యూనిస్టుల అడ్డగా వేల ఎకరాల ప్రభుత్వ భూమి రక్షించబడుతూ వస్తున్న క్రమంలో నేడు రాష్ట్ర శాసనసభలో పెట్టిన బిల్లు ద్వారా ఆ భూములు మాయమై పరుల…

ఆత్మ పరిశీలన అవసరం !

special lstories, prathyeka vyasaalu, telangana news

 సంబరాలు సరే..  హావిూల సంగతేమిటి? సవాల్ గా మారిన  కౌలు రైతుల రుణాల సమస్య   కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రేవంత్‌ రెడ్డి సారధ్యంలోని  ఏడాది పూర్తి చేసుకుని ఘనంగా విజయోత్సవ సంబరాలు చేసుకుంది. ఇందులో తప్పు పట్టవలసినది ఏవిూ లేదు. ఐతే, విజయోత్సవాలు జరుపుకునే సందర్భంలో తాము ఏం సాధించాం అనేది చెప్పడం సంప్రదాయం.…

నిరుద్యోగులతో పాలకుల చెలగాటం!

Unemployment in India

బిజెపి ప్రభుత్వం ద్రోహపూరిత వైఖరి నిరుద్యోగుల ఆశలు అడియాసలేనా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కాలంగా కడప ఉక్కు పరిశ్రమ పేరుతో  నిరుద్యోగులతో చెలగాట మాడుతున్నాయి. పరిశ్రమ వొస్తే ఉద్యోగాలు వస్తాయని, బతుకులు బాగు పడతాయని ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆశలు అడియాసలు అవుతున్నాయి. కడపస్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని  లోక్‌సభలో కేంద్ర…

వ్యవసాయ సంక్షోభం పై చర్యలేవీ?

 రైతన్నలపై మోదీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి సమస్యల వలయంలో అన్నదాతలు, ఆత్మహత్యల బాట పడుతున్న వ్యవసాయ కార్మికులు దేశంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల సమర్పించిన మధ్యంతర నివేదిక  కళ్ళకు కట్టినట్టు చూపింది. సమస్యల వలయంలో చిక్కుకున్న అన్నదాతలు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యల బాట పడుతున్న తీరును…

దేశానికి రెండో రాజధాని అంత ఆషామాషీ కాదు!

second capital of the country is not easy

కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మధ్య సుప్రీంకోర్టు దిల్లీ నగరాన్ని ఏం చేయబోతున్నారని ప్రశ్నించింది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా దిల్లీలో కాలుష్యం తీవ్రంగా ఉందని,. తాను ఎప్పుడు దిల్లీకి వొచ్చినా అనారోగ్యం పాలవుతున్నానని ఇటీవల చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిణామాల మధ్య దిల్లీని దేశ రాజధానిగా ఇంకా కొనసాగించాలా అని సాక్షాత్తు సీనియర్‌ కాంగ్రెస్‌ నేత…

ఇంకెన్నాళ్ళీ విద్యార్థుల ఆత్మహత్యలు..?

తెలంగాణ రాష్ట్రంలో విద్యా కుసుమాలు నేలరాలుతున్నాయి. విద్యా ప్రమాణాలు సైతం రోజు రోజుకి పడిపోతున్నాయి. విద్యకు, విలువల బోధనకు చిరునామాగా ఉండాల్సిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలు ఆత్మహత్యలకు అవాంచనీయ సంఘటనలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. ఒకప్పుడు విద్యారులను విలువలతో కూడిన విద్యకై గురుకులాల్లో చదివించే వారు కానీ నేడు విలువల మాట దేవుడెరుగు కానీ,…

కనుమరుగు అవుతున్న కట్టడాలు…

తెరమరుగు అవుతున్న చారిత్రక నిర్మాణాలు…  రక్షణపై శ్రద్ధ లేని ప్రభుత్వాలు ప్రపంచ సాంస్కృతిక వారసత్వ దినోత్సవం ప్రతి ఏట నవంబర్‌ 19న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. వారసత్వ పరిరక్షణ అంశాల ఆధారంగా 1984, జనవరి 27న నాటి  భారతదేశ ప్రధాని  ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో రాజీవ్‌ గాంధీ చైర్మన్‌గా భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ…