– మరింత వేగంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
– ఇప్పటికి 14.80 లక్షల మెట్రిక్ టన్నులపై చిలుకు కొనుగోళ్లు
– రైతుల ఖాతాలో రూ.2001.96 కోట్లు జమ
– తడిసిన ధాన్యం తక్షణమే మిల్లులకు తరలింపు
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 : అకాల వర్షాలు సంభవిస్తున్నందున ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని, అందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాలయం నుండి ఆయన జిల్లాల ఇన్చార్జి మంత్రులు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో కలిసి సోమవారం అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రబీ సీజన్లో పెరిగిన ధాన్యం ఉత్పత్తికి అనుగుణంగా కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఇప్పటివరకు కోటి 84 లక్షల మంది రైతుల నుండి 14.80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటివరకు రైతుల ఖాతాలో రూ.2001.96 కోట్లు జమ చేసినట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో కొనుగోలు కేంద్రానికి భారీ ఎత్తున ధాన్యం తరలిరానున్నందున కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అనుసరించాల్సిన పద్దతులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా ధాన్యం వస్తున్నందున అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అయితే రాత్రి పడిన అకాల వర్షాలతో సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్ వంటి జిల్లాల్లో 299 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసినట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. తడిసిన ధాన్యాన్ని తక్షణమే బియ్యం మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రాబోయే 3-4 రోజులు అకాల వర్షాలు సంభవించే అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేసిన సూచనను అధికారులు తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అకాల వర్షాల ప్రభావం రైతుల మీద పడకుండా వాతావరణ పరిస్థితులకనుగుణంగా కొనుగోలు కేంద్రాలలో టార్బాలిన్లను వినియోగించేలా పక్కా చర్యలు తీసుకోవాలన్నారు. అకాల వర్షాలు సంభవించినప్పుడు ఆ ప్రభావం కొనుగోళ్లపై పడకకుండా రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వాతావరణ పరిస్థితులకనుగుణంగా కొనుగోలు ప్రక్రియను కొనసాగించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పౌరసరఫరాల శాU కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రవాణా శాU కమిషనర్ కె.ఇలంబర్తి, కార్మిక, ఉపాధి, విపత్తు నిర్వహణ శాU కార్యదర్శి హరిచందన తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





