దసరాకు 6వేల‌ ప్రత్యేక బస్సులు: టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్ల‌డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : ‌దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 6,000 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది. ఈ ప్రత్యేక బస్సులు ప్రస్తుత ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు, వివిధ ప్రాంతాలకు మరింత సౌకర్యంగా ప్రయాణం చేసేందుకు సర్వసాధారణ మైన మార్గాల్లో నడుపుతారు. ప్రయాణికులు ఆన్‌లైన్‌ ‌లేదా బస్సు స్టేషన్‌ల ద్వారా టిక్కెట్లు బుక్‌ ‌చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక సేవలు దసరా సమయంలో అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటాయి.

తద్వారా వారు ఈ పండుగను సుఖంగా జరుపుకోగలుగుతారు. అయితే.. హైదరాబాద్‌ ‌శివారు నుంచి దసరాకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ‌తెలిపారు. ఓఆర్‌ఆర్‌ ‌దుగా విజయవాడ, బెంగళూరుకు సర్వీసులు అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. కరీంనగర్‌, ‌నిజామాబాద్‌ ‌మార్గాల్లో ఎలక్ట్రి ‌సూపర్‌ ‌లగ్జరీ బస్సులు అందుబాటులో ఉండనున్నట్లు సజ్జనార్‌ ‌వెల్లడించారు. ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని సజ్జనార్‌ ‌పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *