హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : వి• సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్లో తెలంగాణలో కంటే మెరుగైనా అభివృద్ధి జరిగి ఉంటే చూపించాలని మంత్రి కేటీఆర్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాకు సవాల్ విసిరారు. తెలంగాణపై కేంద్ర మంత్రి సింధియా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందిస్తూ…పాలనలో విఫలమైన రాష్ట్రాల్లోని బీజేపీ నాయకుల చిత్తశుద్ధిని వి•రు నిజంగా మెచ్చుకోవాలని ట్వీట్ చేశారు. వారు తెలంగాణకు వొచ్చి విభజన రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా తాను ధైర్యంగా సింధియాకు సవాల్ చేస్తున్నానని అన్నారు. దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ జనాభా.. దేశానికి 5 శాతం జీడీపీని కంట్రిబ్యూట్ చేస్తుందని కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. ప్రతి తెలంగాణ పౌరుడు ఈ దేశానికి డబుల్ ఇంజిన్గా దోహదపడ్డాడని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం లాగే బీజేపీ పాలిత రాష్టాల్రు కూడా కష్టడితే 75వ స్వాతంత్య ్రదినోత్సవం నాటికి ఈ దేశం 10 ట్రిలియన్ల ఎకానవి•కి చేరుకునే అవకాశం ఉండేదన్నారు కేటీఆర్.