- ఫార్ములా ఈ రేస్ కేసు తదుపరి విచారణ 25కు వాయిదా
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : ఫార్ములా-ఈ రేస్ కేసు విచారణలో భాగంగా నాంపల్లి ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ విచారణకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హాజరయ్యారు. ఏసీబీ కోర్టు నోటీసులతో తొలిసారిగా విచారణకు కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. ఫార్ములా-ఈ రేస్ కేసులో ఇప్పటికే చార్జ్షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కార్ రేస్తో రూ.54.88 కోట్ల నష్టం జరిగిందని చార్జ్షీట్లో ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. కేటీఆర్, ఐఏఎస్ అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, కంపెనీని నిందితులుగా ఏసీబీ అధికారులు ఈ కేసులో చేర్చారు. ఛార్జ్షీట్ ధాఖలు చేసిన తర్వాత మొదటి కేసును న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకున్నామని కోర్టు తెలిపింది. తదుపరి ఈ కేసులో ట్రయల్ మొదలు పెట్టనుంది. తదుపరి విచారణను ఆగస్టు25వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. కేటీఆర్ లక్ష పూచీకత్తు, 2 షూరిటీస్ సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




