మంత్రి హరీశ్ రావు ట్వీట్
మాకు నూకలు చెల్లడం కాదు..తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయి…అని మంత్రి హరీష్ రావు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేసారు. బ్యాట్ సరిగా పట్టడం చేతకాని మీ అబ్బాయికి ఏకంగా బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసు. అలాంటిది మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది..పెద్ద ఎత్తున రైతులు ఉద్యమిస్తే కార్పొరేట్ కొమ్ముకాసే చట్టాలను ఉపసంహరించుకుని తోకముడిచిన మీరా.. రైతు బాంధవుడైన కేసీఆర్ ను విమర్శించేది..2జీ 3జీ 4జీ కాదు, కేంద్రంలో దశాబ్ద కాలంగా నాజీలను మించిన నియంతృత్వ పాలన మీది..రాబోయే ఎన్నికల్లో మీరు మాజీ లే..సీఎం పదవి కాదు.. ముందు తెలంగాణలో సింగిల్ డిజిట్ తెచ్చుకునేందుకు ప్రయత్నించండి..తెలంగాణ అభివృద్ధి విషయంలో రాజీ లేని యోధుడు కేసీఆర్ గారు..అబద్ధపు విమర్శలు..ఔట్ డేటెడ్ ఆరోపణలు..రాసిచ్చిన స్క్రిప్ట్ తో హోం మంత్రి స్కిట్ అని మంత్రి హరీష్ రావు ట్వీట్ చేసారు.