న్యాయ వ్యవస్థతో పాటు చట్టాలు, శిక్షల్లో భారతీయీకరణ జరగాల్సి ఉంది. ఇటీవల మన ఐపిసి స్థానంలో కొత్త చట్టాలు ప్రవేశ పెట్టిన దరిమిలా దీనిపై చర్చ చేయాలి. ఎందుకంటే పెరుగుతున్న నేరాలు, కొత్తకొత్త మోసాలు, ఐటి, ఆన్లైన్ మోసాలు, అత్యాచారాలు వంటి వాటిని పరిశీలించి చట్టాలను మార్పు చేసుకోవాల్సి ఉంది. మన న్యాయవ్యవస్థ ఇంకా బ్రిటిష్ కాలంనాటి పరిస్థితులకు అనుగుణంగానే సాగుతోంది. కోల్కతా ఆస్పత్రిలో డాక్టర్ హత్యాచారం తరవాత అనేక ఘటనలు మళ్లీ జరుగుతూనే ఉన్నాయి. అత్యాచారాలపై ప్రజల్లో భయం లేకుండా పోతున్నది. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నా ఇంతవరకు అసలు దోషులను పట్టుకోలేదు. మన పోలీస్ వ్యవస్థ పక్కాగా లేదనడానికి ఇదే నిదర్శనం. ఇకపోతే లిక్కర్ కేసులో సత్వర విచారణ సాగడం లేదు. బెయిల్ రాకుండా నేతలను జ్కెలుకు పంపిస్తున్నారు. అలాగే నేతల అవినీతి పైనా విచారణ సాగడం లేదు. సామాన్యులకు న్యాయం అందకుండా పోతోంది. నిరంతరం రాజకీయ కేసులు తప్ప సామాన్యుల పక్షాన న్యాయవ్యవస్థ బలంగా నిలబడడం లేదు. నేటికీ ఎందరో చేయని నేరాలకు జ్కెళ్లలో మగ్గుతున్నారు.
ఇలాంటి వారిని ఎలా బయటకు తీసకుని వస్తారన్నది కూడా ముఖ్యం. అలాగే ఎలాంటి కేసున్కెనా కనీసం 3నెలల్లో ముగించి తీర్పును ఇచ్చేలా కఠిన చట్టాలను అమలు చేయాలి. అంబేడ్కర్ మహాశయుడి ఆలోచనలకు అందని విధంగా మన రాజకీయాలు మారుతున్నాయి. రాజ్యాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని నాయకులు రాజ్యమేలుతున్నారు. అవినీతికి పాల్పడ్డా పెద్దగా శిక్షలు పడడం లేదు. నెలరోజుల్లోగా ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఏవైనా కేసులు ఉంటే తేల్చేయాలి. ఏళ్లతరబడి కేసులను నాన్చేయడం వల్ల ఐదేళ్ల పుణ్యకాలం గడిచిపోతోంది. చిట్టచివరకు ఎన్నికల ముందు తీర్పులు వ్యతిరేకంగా వచ్చినా చేయగలిగేది ఏవిరీ లేదు. కనుక వీటిపైనా దృష్టి సారించాల్సి ఉంది. న్యాయవ్యవస్థ లో సమూల మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా స్థానిక భాషల్లో కోర్టు కార్యకలాలపాలు సాగాలి. అప్పుడే ప్రజలకు కూడా ఏం జరుగుతుందో తెలుస్తుంది. కోర్టుల్లో న్యాయ చర్చలను స్థానిక భాషల్లో చర్చించేలా చట్టం చేసుకోవాలి. గతంలో ప్రధాని మోదీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టి ఇప్పుడీ విషయంపై చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అర్థంకాని భాషలో కాకుండా ప్రజలకు అర్థం అయ్యే భాషలో న్యాయచర్చలు సాగాలి.
కోర్టుతీర్పులు స్థానిక భాషల్లో విడుదల చేయాలి. పాలకులు పేదలకు న్యాయాన్ని చేరువ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలి. అనేక సంస్కరణలు తీసుకుని వొచ్చామని చెబుతున్న ప్రధాని మోదీ ఈ న్యాయవ్యవస్థలో ఉన్న లోటుపాట్లను గుర్తించి తక్షణ చర్యలకు పూనుకోవాలి. పార్లమెంట్ వేదికగా దీనికి శాశ్వత పరిష్కారం చూపాలి. ఇప్పటివరకు పనిచేసిన న్యాయమూర్తులు ఆయా సందర్భాల్లో తమ విలువైన సూచనలు చేశారు. వాటిని సలహాలుగా తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగాలి. ప్రజలకు ఏంచేస్తే సత్వర న్యాయం అందుతుందో ఆలోచించాలి. అవసరమైతే మాజీ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులతో కమిటీలు వేసి వారి సలహాలు తీసుకోవాలి. ప్రతిపేదవాడికి న్యాయం అందించడమే న్యాయమూర్తి ప్రధాన లక్ష్యం కావాలి. దేశంలో న్యాయం పట్ల జరుగుతున్న ఆలస్యాన్ని గుర్తించి సత్వర న్యాయం అందేందుకు అసవరమైన చర్యలను చేపట్టాలి. నిర్ణీత కాలంలోగా న్యాయ విచారణలు, తీర్పులు వచ్చేలా చట్టబద్దం చేసుకోవాలి. ఇదే సందర్భంలో పెండిరగ్ కేసులు సమస్యగా మారాయని కూడా గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలి. ప్రతి తీర్పులోనూ ప్రజలకు న్యాయం జరిగిందన్న భావన కలగించాలి. రాజకీయ నాయకుల కేసుల విషయంలో త్వరగా విచారణ జరిపి శిక్షలు వేస్తే మంచిది.
కోర్టు తీర్పులను అమలు చేయని ప్రభుత్వాలపై కఠిన చర్యలకు అవకాశం ఉండాలి. ఇటీవల పలువురు సుప్రీం చీఫ్ జస్టిస్లుగా పనిచేసిన వారు న్యాయవ్యవస్థలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇవన్నీ కూడా పేదలకు సత్వర న్యాయం అందాలన్న తపనతో చేసినవే తప్ప మరోటి కాదు. భారత న్యాయ వ్యవస్థ సాధారణ ప్రజలకు ఎంతో దూరంలో నిలిచిందన్న ఆరోపణల్లో వాస్తవాలను గుర్తించాలి. ఇప్పటికీ కోట్ల మంది అణగారిన వర్గాల ప్రజలకు న్యాయ సహాయం అవసరం ఉంది. తమకు అన్యాయం జరిగిందని భావించిన ప్రతి వారూ కోర్టులకు వెళ్లడం లేదు. ఎందుకంటే కోర్టులకు వెళితే తేలేదేవిరీ లేకపోగా అనవసర కాలయాపన, డబ్బులు దండగ అన్న భావనలో ప్రజలు ఉన్నారు. అవసరమైన వెంటనే న్యాయ వ్యవస్థను ఆశ్రయించడానికి ఇంకా వారు జంకుతూనే ఉన్నారు. న్యాయవ్యవస్థ రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ నిర్ణీత కాలవ్య వధిలో కోర్టుల్లో కేసులు తేలడంలేదు. తీర్పులు వొచ్చాక అమలు కావడం లేదు. వివేకానందరెడ్డి హ్యతకేసు, కోడికత్తి కేసు, లిక్కర్ కేసు, జగన్ అవినీతి కేసులు ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఎంతలా జాప్యం జరుగుతుందో చూడవొచ్చు. పోలీసుల విచారణలో జాప్యం.. కోర్టుల్లో జాప్యం వంటివన్నీ పోవాలి. కేసు తీవ్రతను బట్టి సత్వర విచారణ, తీర్పులు రావాలి.
ఇందుకు అవసరమైతే.. మనదేశం వేల ఏళ్లుగా అనుసరించిన రాజ్యాంగ వ్యవస్థలను, న్యాయవ్యవస్థలను, ఇతర దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలి. నిజానికి కోర్టులు, రాజ్యాంగం పట్ల ప్రజలకు సరైన అవగాహన లేదు. ప్రజలను కోర్టులకు చేరువ చేయడం రాజ్యాంగ విధి కావాలి. రాజ్యాంగం అంటే పాలకులకు సంబంధించిన వ్యవహారంగా ఉండరాదు. న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు, విశ్వాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రజలకు న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం కలిగించాలి. స్థానికంగా న్యాయస్థానాలను పెంచి సత్వర న్యాయం కలిగించాలి. మన న్యాయ వ్యవస్థ, ప్రొసీడిరగ్స్ ఇంకా ఆంగ్లేయులనాటి విధానాలనే అవలంబిస్తోందన్న ఆరోపణల నుంచి బయటపడి పటిష్ట మైన న్యాయ చట్టాలను రూపొందిం చాలి. దీనిని ప్రాతిపదికగా తీసుకుని మన పాలకులు న్యాయ వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి. సత్వర న్యాం అందడం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. కోల్కతా అత్యాచార కేసులో సత్వర విచారణ పూర్తి చేసి దోషులను బహిరంగంగా ఉరితీస్తే తప్ప ప్రజల్లో మార్పు రాదు. మహిళలకు భద్రత దక్కదు.
-డా.సి.వి రత్నకుమార్.