కమ్యూనిటీ రేడియో ..!

సమాజానికి అవసరమైన ప్రోగ్రామింగ్‌ ‌ద్వారా సానుకూల మార్పునకు మద్దతు

చిన్నది ఏదైనా అందంగా ఉంటుందని నానుడి. భారతదేశంలో కమ్యూనిటీ రేడియో కథ ఈ నానుడికి సరిగ్గా సరిపోతుంది. కమ్యూనిటీ రేడియో శక్తి అంతా సానుకూల సామాజిక లక్ష్యాల దిశగా సమాజాన్ని ప్రభావితం చేయడం, సానుకూల మార్పు ద్వారా ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలోనే ఉంది.ఇప్సోస్‌ ‌కోసం బిల్‌ అం‌డ్‌ ‌మెలిందా గేట్స్ ‌ఫౌండేషన్‌ ‌నిర్వహించిన ఒక సర్వే ప్రకారం తరచు చేతులు కడుక్కోవడం, శానిటైజర్ల వినియోగం ప్రాధాన్యతపై కమ్యూనిటీ రేడియో ప్రచారోద్యమం నిర్వహించిన జిల్లాల్లో ఈ ప్రచారం సాగించని బేస్‌ ‌కేటరిగీ జిల్లాలతో పోల్చితే కోవిడ్‌-19 ‌కేసులు 7.5% మేరకు తగ్గాయి.
వివిధ రకాల సామాజిక సమస్యల పరిష్కారానికి స్థానిక ప్రజలందరూ కలిసికట్టుగా పని చేసేలా వారి సామర్థ్యాలను పెంచడంలో సామాజిక రేడియో సమర్థతకు ఇది దర్పణం పడుతుంది. విద్య, యువత, ఆరోగ్యం, వ్యవసాయం వంటి అన్ని అంశాలపై  స్థానిక ప్రజలే కార్యక్రమాలు  రూపొందించి సమాజ ప్రయోజనం  కోసం సామాజిక రేడియో ద్వారా ప్రసారం చేయవచ్చు. ఈ రేడియోలో ప్రసారం అయ్యే కార్యక్రమాల్లో అధిక శాతం గ్రామీణ సమాజం భాగస్వామ్యంతో నిర్వహించే భాగస్వామ్య కార్యక్రమాలే. ఇది తప్పనిసరిగా సామాజిక మార్పునకు దారి తీస్తుంది.   కమ్యూనిటీ రేడియో సహాయంతో సూక్ష్మ స్థాయికి అభివృద్ధిని విస్తరింపచేయవచ్చు.

గత 8 సంవత్సరాల కాలంలో దేశంలో కమ్యూనిటీ రేడియో ఉద్యమం మరింత పటిష్ఠం అయింది. 2014 సంవత్సరం నుంచి దేశంలో కమ్యూనిటీ రేడియో స్టేషన్ల (సిఆర్‌ఎస్‌) ‌సంఖ్య రెట్టింపు కన్నా పెరిగింది. నేడు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ భాషల్లో 356 సిఆర్‌ఎస్‌ ‌లు కార్యక్రమాలు ప్రసారం చేస్తూ స్థానిక సమాజాలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు ఒక వాహికగా ఉన్నాయి. ప్రధాన మీడియాలో ఇలాంటి కార్యక్రమాలకు తగినంత సమయం గాని, ప్రదేశం గాని ఉండడంలేదు.

సిఆర్‌ఎస్‌ ‌విజయానికి సమాజాలే వెన్నెమెకగా నిలుస్తున్నాయి. కేంద్రప్రభుత్వం వాటికి క్రియాశీలంగా మద్దతు ఇస్తోంది. 2021 నుంచి 2026 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో అమలుపరచడానికి కేంద్రప్రభుత్వం దేశంలో ‘‘సామాజిక రేడియో ఉద్యమానికి మద్దతు’’ పేరిట ఒక స్కీమ్‌ ‌రూపొందించింది. లాభాపేక్ష లేని సంస్థల వనరులు పరిమితం అన్న అంశం దృష్టిలో ఉంచుకుని కమ్యూనిటీ రేడియోల స్థాపనకు అలాంటి సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. కొత్త  పరికరాల కొనుగోలు, రెన్యువల్‌ ‌కు సహయం అందించడంతో పాటు  అవసరమైన సమయాల్లో ఎమర్జెన్సీ గ్రాంట్లు కూడా ఇస్తున్నారు. సిఆర్‌ఎస్‌ ఉద్యమం ఉత్తేజితం చేసేందుకుబీ  కొత్త, భావి సిఆర్‌ఎస్‌ ‌లను చేయిపట్టుకు నడిపించేందుకు 2021 సంవత్సరంలో లీడ్‌ ‌కమ్యూనిటీ రేడియో కాన్సెప్ట్  ‌ప్రవేశపెట్టారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి లీడ్‌ ‌సిఆర్‌ఎస్‌ ‌లుగా పని చేయడానికి 24 సిఆర్‌ ‌స్టేషన్లను ఎంపిక చేశారు.
ఈ రంగంలోకి రావాలనుకునే ఔత్సాహిక సంస్థలు సిఆర్‌ఎస్‌ అనుమతుల కోసం ఆన్‌ ‌లైన్‌ ‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఇటీవల సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ బ్రాడ్‌ ‌కాస్ట్ ‌సేవా పోర్టల్‌ ‌ను ప్రారంభించింది.  ఆకాశవాణి (ఎఐఆర్‌) ‌నుంచి స్వీకరించిన వార్తా, కరెంట్‌ అఫైర్స్ ‌కార్యక్రమాలు అదే విధంగా ప్రసారం చేయడానికి లేదా స్థానిక భాషలు/  మాండలికాల్లో తర్జుమా చేసి ప్రసారం చేయడానికి సిఆర్‌ఎస్‌ ‌లను అనుమతిస్తున్నారు. సిఆర్‌ఎస్‌ ‌ల ఆదాయాలకు మద్దతు ఇవ్వడం కోసం వాటిలో ప్రకటనల ప్రసార సమయాన్ని ప్రతీ ఒక గంటకు 5 నిముషాల నుంచి 7 నిముషాలకు పెంచారు. ఈ విభాగంతో ముడిపడి ఉన్న అందరినీ ప్రత్యేకించి పాలసీ నిర్ణేతలు, మీడియా, వివిధ ప్రభుత్వ శాఖలు/  మంత్రిత్వ శాఖలు, ఐక్యరాజ్యసమితి సంఘాలు, నిర్వహణలోని కమ్యూనిటీ రేడియో స్టేషన్లను ఒక్క వేదిక పైకి తెచ్చేందుకు జాతీయ, ప్రాంతీయ కమ్యూనిటీ రేడియో సమ్మేళన్‌ ‌లు నిర్వహిస్తున్నారు. అలాగే  ఆ రంగంలోని వారిని ప్రోత్సహించేందుకు ప్రతీ ఏడాది  నేషనల్‌ ‌కమ్యూనిటీ రేడియో అవార్డులు కూడా ఇస్తున్నారు.
సామాజిక, సమాజ సంక్షేమానికి సిఆర్‌ఎస్‌ ‌సమర్థవంతమైన, ప్రభావవంతమైన మాధ్యమంగా నిలుస్తున్న దనేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఈశాన్య రాష్ట్రాల అధ్యయన • విధాన పరిశోధన కేంద్రం (సి-ఎన్‌ఇఎస్‌) 2015 ‌సంవత్సరంలో అస్సాంలోని డిబ్రూగఢ్‌ ‌ప్రధాన కేంద్రంగా ‘‘రేడియో బ్రహ్మపుత్ర’’గా ప్రసిద్ధి చెందిన బ్రహ్మపుత్ర కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ ‌ను ప్రారంభించింది. ఈ రేడియో కేంద్రం తేయాకు తోటలు, నదీపరీవాహక ప్రాంతాలు, ఇతర ప్రధాన ప్రాంతాల్లో నివశిస్తున్న గ్రామాలకు చెందిన నిరాదరణకు గురవుతున్న వర్గాల ప్రజల కోసం కృషి చేస్తోంది. స్థానిక సమాజ నిర్మాణం, సమాజంలోని విభిన్న సామాజిక వర్గాల జనాభాను దృష్టిలోఉంచుకుని ఈ కేంద్రం అస్సామీ, మిసింగ్‌, ‌సాద్రి (తేయాకు తోటల్లో పని చేసే వారు మాట్లాడే భాష), హజాంగ్‌, ‌దియోరి భాషల్లో ఆరోగ్యం, విద్య, జీవనోపాధి, పర్యావరణం, వైపరీత్య వ్యవసాయం, జానపదం, సంస్కృతి విభాగాల్లో  కార్యక్రమాలు రూపొందించి రోజూ 14 గంటల పాటు ప్రసారం చేస్తోంది. అలాగే వయనాడ్‌ ‌జిల్లాలోని ద్వారకలో ఏర్పాటైన కమ్యూనిటీ రేడియో మట్టోలి… రేడియో, విజువల్‌ ‌మీడియాలో కెరీర్‌ ‌ప్రారంభించలన్న ఆశావహులైన స్థానిక ప్రతిభావంతులకు ఒక ప్రయోగవేదికగా నిలుస్తోంది.
స్థానిక గిరిజన తెగలకు చెందిన వారు గిరిజన మాండలికాల్లో నిర్మించే కార్యక్రమాలు గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రోత్సహిస్తున్నాయి. ఒరిస్సాలోని రేడియో నమస్కార్‌  ‌పూరీ జిల్లాలోని కోణార్క్  ‌చుట్టుపక్కల  ప్రాంతాల్లో విస్తరించి ఉన్న నాలుగు బ్లాక్‌ ‌లకు చెందిన (గాప్‌, ‌నిమపడ, కాకత్‌ ‌పూర్‌, అష్టరంగ) 700 పైగా గ్రామాలకు సేవలందిస్తోంది.  స్థానిక సమాజంలోని బాలలందరూ పాఠశాలకు వెళ్లేలా ప్రోత్సహించడానికి ఈ రేడియో ‘‘చలా స్కూల్‌ ‌కీ జిబా’’ (మనం స్కూలుకి వెళదాం) ప్రచారం ప్రారంభించింది. ఈ ఎపిసోడ్‌ ‌ల ప్రభావంతో ఆ ప్రాంతంలోని 15 గ్రామాల్లో చదువు మధ్యలోనే వదిలేసిన విద్యార్థులందరూ తిరిగి పాఠశాలలకు హాజరవుతున్నారు. ప్రభుత్వ అధికారులు ఈ గ్రామాలన్నింటినీ జీరో డ్రాపౌట్‌ ‌జోన్‌  ‌గా ప్రకటించారు. హర్యానాలోని నుహ్‌ ‌కు చెందిన కమ్యూనిటీ రేడియో అల్ఫాజ్‌-ఇ-‌మేవత్‌ ‌కోవిడ్‌ ‌వ్యాప్తి, లాక్‌ ‌డౌన్‌ ‌కాలంలో అద్భుతమైన పాత్ర పోషించింది. ఈ రేడియో  స్టేషన్‌  ఎలాంటి అంతరాయాలు లేకుండా కార్యక్రమాలు ప్రసారం చేసి కోవిడ్‌ ‌నిరోధం, ప్రచారానికి సమాచార వారధిగా నిలిచింది.
ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ‘‘సమాజానికి చెందిన, సమాజం కోసం,  సమాజ నిర్వహణ’’లోని సంస్థలుగా పని చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నందు వల్లనే భారతదేశంలో సిఆర్‌ఎస్‌ ‌లు సమర్థవంతం అయ్యాయి. గ్రామీణ ప్రజలు, సమాజంలోని నిమ్నవర్గాలు, మారుమూల ప్రాంతాల్లో నివశించే జనాభాను అభివృద్ధి పథంలో, పరివర్తన దిశగా నడిపించే శక్తులుగా అవి నిరూపించుకున్నాయి.
 – శ్రీమతి ఎస్థర్‌ ‌కర్‌, ఇం‌డిపెండెంట్‌ ‌మీడియా కన్సల్టెంట్‌, ‌పరిశోధకురాలు, కమ్యూనిటీ రేడియో ఔత్సాహికురాలు.
మాజీ డైరెక్టర్‌ ‌జనరల్‌, ‌పిఐబి, భారత ప్రభుత్వం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page