ఎనిమిదేళ్లవుతున్నా ఏదీ అభివృద్ది

  • ప్రశ్నించిన కాంగ్రెస్‌ ‌నేతలు భట్టి తదితరులు
  • అమరులకు ఘన నివాళి

అమరుల త్యాగాలకు అర్థం లేకుండా పోయింది : ట్విట్టర్‌ ‌ద్వారా శుభాకాంక్షలు తెలిపిన రేవంత్‌ ‌రెడ్డి
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 2 : ‌తెలంగాణ వొస్తే అన్ని వర్గాల వారు బాగుంటారని అందరూ ఆశించారని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకులు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఆయన వి•డియా సమావేశంలో మాట్లాడుతూ..తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లు అవుతుందని.. అయినా ఇప్పటికి తెలంగాణ ఆశయాలు సాకారం కాలేదన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ద్వారానే సాధన లక్ష్యాలు సాధ్యమయ్యాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్‌ ‌పోయి..అప్పుల పాలైందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అమరవీరుల స్థూపానికి కాంగ్రెస్‌ ‌నేతలు  నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క ..తెలంగాణ వొస్తే అన్ని వర్గాల వారు బాగుంటారని అందరూ ఆశించారన్నారు. సామజిక తెలంగాణ ఏర్పడుతుందనుకున్నాం కానీ.. తెలంగాణ  ఆశయాలు ఏమాత్రం  సాకారం  కాలేదని తెలిపారు. కాంగ్రెస్‌  ‌పార్టీతోనే రాష్ట్ర  సాధన లక్ష్యాలు  సాధ్యమవుతాయని చెప్పారు.

మిగులు  బడ్జెట్‌  ‌పోయి … రాష్టాన్న్రి అప్పులపాలు చేశారని తెలిపారు భట్టి విక్రమార్క. మాజీమంత్రి గీతా రెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ  తెలంగాణ  ఇచ్చారని తెలిపారు. సుదీర్ఘ  పోరాటంలో అనేక  మంది రాష్ట్రం కోసం త్యాగాలు  చేశారని..రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా  లేదన్నారు. పొన్నాల లక్ష్మయ్య  మాట్లాడుతూ.. సోనియా  గాంధీ చిత్తశుద్ధితో  రాష్ట్రం  ఏర్పడిందని , రాష్టాన్న్ర ప్రాజెక్టుల పేరుతో  దోచుకున్నరు  తప్ప చేసిందేవి•లేదన్నారు. నిరుద్యోగ నియామకాలు పక్కన పెట్టి … కేసీఆర్‌  ‌కుటుంబం లోనే పదవులు ఇచ్చుకున్నారని చెప్పారు. నిరంజన్‌ ‌మాట్లాడుతూ.. తెలంగాణ  కోసం  అనేక మంది ప్రాణ  త్యాగాలు చేశారని..వారి త్యాగాలు వెల కట్టలేనివి అన్నారు. అంజన్‌  ‌కుమార్‌ ‌యాదవ్‌ ‌మాట్లాడుతూ.. రాష్ట్ర  ఏర్పాటులో  ఎన్ని అవరోధాలు వొచ్చిన  కాంగ్రెస్‌  అధినేత సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చి మాట నిలబెట్టుకున్నారని తెలిపారు.

అమరుల త్యాగాలకు అర్థం లేకుండా పోయింది : ట్విట్టర్‌ ‌ద్వారా శుభాకాంక్షలు తెలిపిన రేవంత్‌ ‌రెడ్డి
రాష్ట్ర ప్రజలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్విటర్‌ ‌వేదికగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సోనియాగాంధీ చొరవతో అరవై ఏళ్ల ఆకాంక్షలకు ప్రతిరూపంగా రాష్ట్రం ఏర్పడిందన్నారు. వందలాది మంది అమరుల త్యాగాలతో సాధించుకున్న రాష్టాన్రికి…గులాబీ చీడ పట్టుకుందని రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. ఎనిమిదేళ్ల తెరాస పాలనలో ప్రతి ఒక్కరికీ ఏడుపే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల త్యాగాలకు విలువ లేకుండా విధ్వంస పాలన సాగిస్తున్న గులాబీ చీడను తరిమికొట్టాలని రేవంత్‌రెడ్డి కోరారు. రైతు ఆత్మహత్యలులేని, యువతకు ఉపాధి కల్పించే తెలంగాణ..కాంగ్రెస్‌ ‌స్వప్నమని తెలిపారు. సకల జనుల జీవితాల్లో వెలుగులు నింపే తెలంగాణ కోసం విశ్రమించకుండా శ్రమిస్తామని రేవంత్‌ ‌స్పష్టం చేశారు. వందల మంది త్యాగాల సాక్షిగా రాష్ట్రాన్ని సాధించుకున్నాం. స్వపరిపాలన సుపరిపాలన అవుతుందని ఆశించిన తెలంగాణకు గులాబీ చీడ పట్టుకుంది. ఎనిమిదేళ్ల తెరాస పాలనలో ప్రతి ఒక్కరికీ ఏడుపే మిగిలింది. అమరుల త్యాగాలకు విలువ లేకుండా విధ్వంస పాలన సాగిస్తున్న గులాబీ చీడను తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి. రైతు ఆత్మహత్యలు లేని, యువతకు ఉపాధి కల్పించి సకల జనుల జీవితాల్లో వెలుగులు నింపే తెలంగాణ.. కాంగ్రెస్‌ ‌పార్టీ స్వప్నం. ఇందు కోసం పార్టీ విశ్రమించకుండా శ్రమిస్తుందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page